rohit sharma: రోహిత్ శర్మకు అభిమాని పాదాభివందనం
టీమ్ఇండియా సారథి రోహిత్ శర్మకు ఊహించని సంఘటన ఎదురైంది.
తిరువనంతపురం: టీమ్ఇండియా సారథి రోహిత్ శర్మకు ఊహించని సంఘటన ఎదురైంది. దక్షిణాఫ్రికాతో ఓపెనింగ్ మ్యాచ్ సందర్భంగా అప్పుడే క్రీజులోకి అడుగుపెట్టిన ఈ కెప్టెన్ను చూసి ఓ అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించాడు. భద్రతా సిబ్బందిని తోసుకుని మైదానంలోకి దూసుకొచ్చిన అతడు రోహిత్కు పాదాభివందనం చేశాడు. ఈ పరిణామానికి కెప్టెన్ సహా అక్కడున్నవారందరూ ఆశ్చర్యపోయారు. అప్రమత్తమైన సిబ్బంది అతడిని వెంటనే అక్కడి నుంచి బయటకు పంపారు. గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ మైదానం వేదికగా జరిగిన టీ20 మ్యాచులో 8 వికెట్ల తేడాతో భారత ఆటగాళ్లు సఫారీలను చిత్తు చేసిన విషయం తెలిసిందే. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. అనంతరం భారత్ రెండు వికెట్ల నష్టానికి 16.4 ఓవర్లలో 110 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా