CSK vs GT: వర్షం కారణంగా నా పదేళ్ల కుమారుడికి ధోనీని చూపించలేకపోయా!
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ (IPL 2023 Final)ను ఆదివారం రాత్రి మ్యాచ్ చూసి ఇంటికి వెళ్లేందుకు చాలా మంది ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అయితే.. వార్షం కారణంగా మ్యాచ్ సోమవారానికి వాయిదా పడింది. దీంతో కొంతమంది మ్యాచ్ను వీక్షించకుండానే అహ్మదాబాద్ నుంచి తిరుగుముఖం పట్టారు. అలాంటి వారిలో ఓ బాధితుడు పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ఎంఎస్ ధోనీని (MS Dhoni) ప్రత్యక్షంగా చూద్దామని ఆశపడిన పదేళ్ల కుర్రాడికి తీవ్ర నిరాశే ఎదురైంది. ఆదివారం రాత్రి అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ (CSK vs GT) మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఇవాళ్టికి వాయిదా పడింది. మ్యాచ్తోపాటు ధోనీని దగ్గరగా చూసేందుకు డగౌట్కు సమీపంలోని సీట్లను బుక్ చేసుకున్నామని, వర్షం వల్ల ఆశలు ఆవిరైనట్లు ఓ అభిమాని పెట్టిన పోస్టు వైరల్గా మారింది. షెడ్యూల్ ప్రకారం ఆదివారం రాత్రి మ్యాచ్ చూసిన తర్వాత ఇండోర్కు వెళ్లిపోవాలని ఓ బిజినెస్ మ్యాన్ నిర్ణయించుకున్నారు. కానీ, మ్యాచ్ వర్షార్పణం కావడం.. రిజర్వే డేకు మారినప్పటికీ పనిఒత్తిడి వల్ల ఇండోర్కు తప్పక వెళ్లాల్సి వచ్చిందని వాపోయారు.
ఇండోర్కు చెందిన వికాస్ కేడియా తన భార్య, ఇద్దరు పిల్లలతో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు అహ్మదాబాద్కు వచ్చారు. తన పదేళ్ల కుమారుడికి ధోనీని దగ్గర నుంచి చూపించాలని భావించానని, వర్షం వల్ల మొత్తం నిరాశ కలిగిందని పేర్కొన్నాడు. ‘‘వర్షం బోరున పడటంతో ప్రేక్షకులంతా ఒక్కసారిగా బయటకు వచ్చారు. ఆ గుంపులో ఉంటే సురక్షితం కాదనిపించింది. గందరగోళ పరిస్థితులతో పిల్లలు తప్పిపోయే ప్రమాదం ఉందనిపించి ఆందోళన చెందా. చివరికి వారిని తీసుకుని బయటపడ్డా. అయితే వర్క్ ఉండటంతో ఇండోర్కు బయల్దేరి వచ్చాం. ధోనీని ప్రత్యక్షంగా చూడకుండా వచ్చేస్తుండగా కారులోనే మా పెద్దబ్బాయి ఏడుపు అందుకున్నాడు’’అని కేడియా తెలిపారు. ఇలా కేవలం కేడియాకు మాత్రమే కాకుండా చాలా మంది అభిమానులకు ఈ పరిస్థితి తలెత్తింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
POLL: రోహిత్ను కాదని హార్దిక్కు కెప్టెన్సీ... ముంబయి ఇండియన్స్ నిర్ణయం సరైనదేనా?
Mumbai Indians Captiancy: ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా హార్దిక్ పాండ్య... ఈ మార్పు అభిమానులకు సమ్మతమేనా? -
కొత్త కెప్టెన్.. కోటి ఆశలతో
2013లో ఐపీఎల్ అరంగేట్రం.. 2016లో ఛాంపియన్. స్టార్ ఆటగాళ్లతో ఒకప్పుడు కళకళలాడిన జట్టు. కానీ ఆ తర్వాత తడబాటు. ఒడుదొడుకుల ప్రయాణం. -
నా భుజాలపై రోహిత్ చేతులేసి..
జట్టు కెప్టెన్గా రోహిత్ లేనంత మాత్రాన ఏమీ మారదని, తన భుజాలపై చేతులేసి అతను నడిపిస్తాడని ముంబయి ఇండియన్స్ కొత్త సారథి హార్దిక్ పాండ్య అన్నాడు. -
కోహ్లి ముఖంలో ఆనందం చూశా
డబ్ల్యూపీఎల్ రెండో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచిన తర్వాత విరాట్ కోహ్లి ముఖంలో ఆనందం చూశానని కెప్టెన్ స్మృతి మంధాన వెల్లడించింది. -
సబ్స్టిట్యూట్గా వచ్చి గెలిపించాడు
శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ను బంగ్లాదేశ్ 2-1తో కైవసం చేసుకుంది. కంకషన్ సబ్స్టిట్యూట్గా వచ్చిన తంజిద్ హసన్ (84; 81 బంతుల్లో 9×4, 4×6) మెరుపులు మెరిపించడంతో సోమవారం ఆఖరిదైన మూడో వన్డేలో బంగ్లా 4 వికెట్ల తేడాతో నెగ్గింది. -
ఐపీఎల్ ఆరంభంలో పంత్కు కష్టమే
రోడ్డు ప్రమాదంలో గాయపడి 15 నెలల విరామం తర్వాత మైదానంలో అడుగు పెడుతున్న రిషబ్ పంత్కు.. ఈ ఐపీఎల్ ఆరంభంలో ఇబ్బందులు తప్పవని దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. -
ప్రపంచ రికార్డుతో అఖిల్కు పసిడి
భారత షూటర్ అఖిల్ షెరోన్ అదరగొట్టాడు. ఇప్పటికే పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానం గెలిచిన అతను.. తాజాగా పోలిష్ గ్రాండ్ ప్రి పోటీల్లో ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. -
శ్రేయస్ ఫిట్టే కానీ..
కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లో ఆడేందుకు ఫిట్నెస్తో ఉన్నట్లుగా బీసీసీఐ నిర్ధరించినట్లు తెలుస్తోంది. -
‘లక్ష్య’ జ్యోతికకు కాంస్యం
ఇండియా ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి దండి జ్యోతిక శ్రీ (ఆంధ్రప్రదేశ్) సత్తాచాటింది. -
బెంగళూరు జట్టుతో విరాట్
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఐపీఎల్ సన్నాహాలు మొదలుపెట్టాడు. -
కోహ్లీతో బ్యాటింగ్ అంటే..
కోహ్లితో కలిసి బ్యాటింగ్ చేయడం నమ్మశక్యం కాని అనుభూతి అని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ తెలిపాడు. -
అప్పుడే ఆటను వదిలేద్దామనుకున్నా..
క్రికెట్కు 2017లోనే ఆటకు వీడ్కోలు చెబుదామని అనుకున్నట్లు భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. -
సర్ఫరాజ్, జురెల్లకు బీసీసీఐ కాంట్రాక్టులు
భారత యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, వికెట్కీపర్ ధ్రువ్ జురెల్కు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులు లభించాయి. గ్రూప్-సిలో ఉన్న ఈ ఆటగాళ్లు ఫీజు కింద ఏడాదికి కోటి రూపాయలు పొందుతారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా మూకల దాడిలో గాయపడిన తెదేపా కార్యకర్త మృతి
-
TS News: తమిళిసై రాజీనామాకు ఆమోదం.. ఝార్ఖండ్ గవర్నర్కు అదనపు బాధ్యతలు
-
Liquor Policy Case: రూ.100కోట్ల చెల్లింపులపై ఈడీ ప్రకటన.. అక్రమంగా ఒక్క రూపాయీ లేదన్న ఆప్
-
POLL: రోహిత్ను కాదని హార్దిక్కు కెప్టెన్సీ... ముంబయి ఇండియన్స్ నిర్ణయం సరైనదేనా?
-
Modi: ‘మీవాళ్లు క్షేమంగా ఉన్నారు..త్వరలో తిరిగొస్తారు’: బల్గేరియా అధ్యక్షుడికి మోదీ రిప్లై
-
Actors turned Directors: ధనుష్, ఉపేంద్ర, కంగన.. మళ్లీ మరో కోణాన్ని చూపించేందుకు...