CSK vs GT: వర్షం కారణంగా నా పదేళ్ల కుమారుడికి ధోనీని చూపించలేకపోయా!
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ (IPL 2023 Final)ను ఆదివారం రాత్రి మ్యాచ్ చూసి ఇంటికి వెళ్లేందుకు చాలా మంది ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అయితే.. వార్షం కారణంగా మ్యాచ్ సోమవారానికి వాయిదా పడింది. దీంతో కొంతమంది మ్యాచ్ను వీక్షించకుండానే అహ్మదాబాద్ నుంచి తిరుగుముఖం పట్టారు. అలాంటి వారిలో ఓ బాధితుడు పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ఎంఎస్ ధోనీని (MS Dhoni) ప్రత్యక్షంగా చూద్దామని ఆశపడిన పదేళ్ల కుర్రాడికి తీవ్ర నిరాశే ఎదురైంది. ఆదివారం రాత్రి అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ (CSK vs GT) మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఇవాళ్టికి వాయిదా పడింది. మ్యాచ్తోపాటు ధోనీని దగ్గరగా చూసేందుకు డగౌట్కు సమీపంలోని సీట్లను బుక్ చేసుకున్నామని, వర్షం వల్ల ఆశలు ఆవిరైనట్లు ఓ అభిమాని పెట్టిన పోస్టు వైరల్గా మారింది. షెడ్యూల్ ప్రకారం ఆదివారం రాత్రి మ్యాచ్ చూసిన తర్వాత ఇండోర్కు వెళ్లిపోవాలని ఓ బిజినెస్ మ్యాన్ నిర్ణయించుకున్నారు. కానీ, మ్యాచ్ వర్షార్పణం కావడం.. రిజర్వే డేకు మారినప్పటికీ పనిఒత్తిడి వల్ల ఇండోర్కు తప్పక వెళ్లాల్సి వచ్చిందని వాపోయారు.
ఇండోర్కు చెందిన వికాస్ కేడియా తన భార్య, ఇద్దరు పిల్లలతో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు అహ్మదాబాద్కు వచ్చారు. తన పదేళ్ల కుమారుడికి ధోనీని దగ్గర నుంచి చూపించాలని భావించానని, వర్షం వల్ల మొత్తం నిరాశ కలిగిందని పేర్కొన్నాడు. ‘‘వర్షం బోరున పడటంతో ప్రేక్షకులంతా ఒక్కసారిగా బయటకు వచ్చారు. ఆ గుంపులో ఉంటే సురక్షితం కాదనిపించింది. గందరగోళ పరిస్థితులతో పిల్లలు తప్పిపోయే ప్రమాదం ఉందనిపించి ఆందోళన చెందా. చివరికి వారిని తీసుకుని బయటపడ్డా. అయితే వర్క్ ఉండటంతో ఇండోర్కు బయల్దేరి వచ్చాం. ధోనీని ప్రత్యక్షంగా చూడకుండా వచ్చేస్తుండగా కారులోనే మా పెద్దబ్బాయి ఏడుపు అందుకున్నాడు’’అని కేడియా తెలిపారు. ఇలా కేవలం కేడియాకు మాత్రమే కాకుండా చాలా మంది అభిమానులకు ఈ పరిస్థితి తలెత్తింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం