Sanju Samson: బీసీసీఐ.. సంజూ శాంసన్, రాహుల్ త్రిపాఠి ఏం చేశారు?
భారత టీ20 లీగ్ 15వ సీజన్ ముగిసిన తర్వాత టీమ్ఇండియా జూన్లో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో 5 టీ20ల సిరీస్ ఆడనుంది....
టీమ్ఇండియా ఎంపికపై అభిమానుల ఫైర్
ఇంటర్నెట్డెస్క్: భారత టీ20 లీగ్ 15వ సీజన్ ముగిసిన తర్వాత టీమ్ఇండియా జూన్లో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో 5 టీ20ల సిరీస్ ఆడనుంది. అందుకోసం బీసీసీఐ సెలెక్షన్ కమిటి ఆదివారం 18 మంది ఆటగాళ్లతో కూడిన టీ20 టీమ్ జాబితాను విడుదల చేసింది. అందులో ఈ సీజన్లో అంత గొప్పగా రాణించని రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్ లాంటి ఆటగాళ్లను ఎంపిక చేయగా.. వారికన్నా మెరుగైన స్ట్రైక్రేట్ కలిగిన సంజూ శాంసన్, రాహుల్ త్రిపాఠిని పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో వీరిద్దర్ని ఏ లెక్కన ఎంపిక చేయలేదని అభిమానులు బీసీసీఐని నిలదీస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో బీసీసీఐని ఎండగడుతూ సంజూ, రాహల్ త్రిపాఠిల ఆటను మెచ్చుకుంటున్నారు.
కాగా, ఈ సీజన్లో ఇషాన్ కిషన్ 14 మ్యాచ్ల్లో 418 పరుగులు చేయగా అందులో 3 అర్ధశతకాలు సాధించాడు. సగటు 32.15, స్ట్రైక్రేట్ 120.11గా నమోదయ్యాయి. రుతురాజ్ 14 మ్యాచ్ల్లో 374 పరుగులు చేశాడు. 3 అర్ధ శతకాలే సాధించాడు. సగటు 26.29 కాగా, స్ట్రైక్రేట్ 126.46గా ఉంది. వెంకటేశ్ అయ్యర్ మరీ ఘోరంగా 12 మ్యాచ్ల్లో 182 పరుగులే చేశాడు. ఒకటే అర్ధశతకం సాధించాడు. 16.55 సగటు, 107.69 స్ట్రైక్రేట్తో పేలవంగా ఉన్నాడు. మరోవైపు రాహుల్ త్రిపాఠి.. 14 మ్యాచ్ల్లో 413 పరుగులు చేశాడు. అందులో 3 అర్ధశతకాలు కొట్టాడు. మెరుగైన 41.30 సగటు, స్ట్రైక్రేట్ 158.23 సాధించాడు. ఇక సంజూ శాంసన్ 14 మ్యాచ్ల్లో 374 పరుగులు చేశాడు. రెండు అర్ధశతకాలు సాధించాడు. సగటు 28.77 నామమాత్రంగా ఉన్నా స్ట్రైక్రేట్ 147.24 గొప్పగా ఉంది. ఈ నేపథ్యంలో వీరిద్దర్నీ ఎంపిక చేయకపోవడంపై అభిమానులు మండిపడుతున్నారు. మరోవైపు ఈ లీగ్లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో టాప్4లో నిలిచిన శిఖర్ ధావన్ను కూడా ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు