Team India: టీమ్ఇండియా ఆటగాళ్ల రీల్.. కోహ్లీ లేకపోవడాన్ని ప్రశ్నిస్తున్న అభిమానులు
ప్రపంచక కప్ ప్రారంభం కాబోతున్న వేళ టీమ్ఇండియా ఆటగాళ్లతో ఒక రీల్ షూట్ చేసి ఇన్స్టాలో పోస్టు చేసింది. అయితే ఈవీడియోలో కోహ్లీ లేకపోవడంతో ఆయన అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ప్రపంచ కప్(CWC 2023) మరో రెండు రోజుల్లో ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే అన్ని దేశాలు ఈ మెగా టోర్నీ కోసం సంసిద్ధమయ్యాయి. పలు జట్లు సన్నాహక మ్యాచ్లు సైతం ఆడాయి. ప్రపంచకప్ ప్రారంభం నేపథ్యంలో భారత క్రికెట్ టీమ్(Team India) ఆటగాళ్లతో ఒక రీల్ చేసి ఇన్స్టాగ్రామ్(Instagram)లో పోస్టు చేసింది. 360 డిగ్రీ రొటేటింగ్ కెమెరాలో ఆటగాళ్లు ఫోజులిచ్చారు. వీరిలో కెప్టెన్ రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్, శార్దుల్ ఠాకూర్, ఇషాన్ కిషన్ ఉన్నారు. ప్రపంచకప్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు క్యాప్షన్ ఇచ్చారు. అయితే ఈ పోస్టుపై పలువురు నెటిజన్లు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కారణం ఈ రీల్లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) లేకపోవడమే.
ఇన్స్టా రీల్లో కోహ్లీ లేకపోవడాన్ని అభిమానులు గుర్తించి వెంటనే స్పందించారు. రీల్లో కోహ్లీ ఎందుకు మిస్ అయ్యాడని ప్రశ్నిస్తున్నారు. ‘‘నేను విరాట్ కోసం ఎదురుచూస్తున్నాను కానీ అతడు ఈ వీడియోలో లేడు. ఇలా ఎందుకు జరిగింది’’ అని ఓ అభిమాని ప్రశ్నించాడు. కోహ్లీ లేకుండా ఈ రీల్ అసంపూర్తి అని మరో అభిమాని పేర్కొన్నాడు. విరాట్ లేకుండా రూపొందిన ఈ వీడియో మసాలా లేని ఆహరమేనని మరో అభిమాని కామెంట్ చేశాడు. కింగ్ కోహ్లీ ఎక్కడ అంటూ పలువురు ప్రశ్నించారు. తొలి సన్నాహక మ్యాచ్ అనంతరం నెదర్లాండ్స్తో మ్యాచ్ ఆడేందుకు కోహ్లీ జట్టుతో పాటు తిరువనంతపురం చేరుకోలేదు. అత్యవసర వ్యక్తిగత కారణాలతో అతడు ముంబయి వెళ్లాడు.
ఇక ఆట విషయానికొస్తే పలు వార్మప్ మ్యాచ్లకు వరుణుడు అంతరాయం కలిగించాడు. టీమ్ ఇండియా, నెదర్లాండ్స్ మధ్య మంగళవారం జరగాల్సిన మ్యాచ్ ఒక్క బంతి పడకుండానే రద్దయింది. దీంతో భారత్ ఆడాల్సిన రెండు సన్నాహక మ్యాచ్లు వర్షంతో రద్దయ్యాయి. అక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్తో మెగా టోర్నీ ప్రారంభం కాబోతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Ravichandran Ashwin: ఆ రోజు కోహ్లి, రోహిత్ ఏడ్చారు
ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన తర్వాత విరాట్ కోహ్లి, రోహిత్శర్మ డ్రెస్సింగ్రూమ్లో ఏడ్చారని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చెప్పాడు. -
Team India: బౌలర్లు పుంజుకునేనా!
పొట్టి సిరీస్ గెలవాలనే పట్టుదలతో ఉన్న భారత్ కీలక సమరానికి సిద్ధమైంది. శుక్రవారం జరిగే నాలుగో టీ20లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది. తొలి రెండు టీ20ల్లో భారత్ నెగ్గగా.. మూడో మ్యాచ్లో నెగ్గడం ద్వారా సిరీస్ ఆశలను ఆసీస్ సజీవంగా ఉంచుకుంది. -
రోహిత్ పరిస్థితేంటి!
నిరుడు టీ20 ప్రపంచకప్ తర్వాతి నుంచి టీ20లకు దూరంగా ఉంటోన్న రోహిత్ శర్మ దక్షిణాఫ్రికా పర్యటనలోనూ పరిమిత ఓవర్ల క్రికెట్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. -
India vs South Africa: దక్షిణాఫ్రికాకు ముగ్గురి సారథ్యంలో..
దక్షిణాఫ్రికా పర్యటనకు టీమ్ఇండియా సిద్ధం. అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మూడు ఫార్మాట్లకు జట్లను ప్రకటించింది. టీ20ల్లో సూర్యకుమార్, వన్డేల్లో కేఎల్ రాహుల్ భారత్కు నాయకత్వం వహించనున్నారు. -
టీ20 ప్రపంచకప్కు ఉగాండా
ఉగాండా..! క్రికెట్లో ఈ పేరు అసలు ఎప్పుడూ వినిపించదు. పెద్ద టోర్నీల్లో ఆ జట్టు ఎప్పుడూ ఆడలేదు. కానీ ఇప్పుడా జట్టు మెగా టోర్నీలో అదృష్టం పరీక్షించుకోనుంది. పెద్ద జట్లతో పోటీకి సై అంటోంది. -
భారత్కు 8 పతకాలు ఖాయం
ఐబీఏ ప్రపంచ జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు అదిరే ప్రదర్శన చేశారు. ఆర్మేనియాలో జరుగుతున్న ఈ టోర్నీలో సెమీఫైనల్లో అడుగుపెట్టడం ద్వారా ఎనిమిది మంది పతకాలు ఖాయం చేసుకున్నారు. -
క్వార్టర్స్లో ప్రియాన్షు
సయ్యద్ మోదీ అంతర్జా తీయ బ్యాడ్మింటన్ టోర్నీలో ప్రియాన్షు రజావత్ క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టాడు. గురువారం పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో ప్రియాన్షు 21-18, 11-6 (రిటైర్డ్)తో సతీశ్ కుమార్పై విజయం సాధించాడు. -
నజ్ముల్ అజేయ శతకం
కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో (104 బ్యాటింగ్; 193 బంతుల్లో 10×4) అజేయ శతకంతో సత్తాచాటడంతో న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ పుంజుకుంది. -
స్టోక్స్ మోకాలికి శస్త్ర చికిత్స
ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మోకాలికి విజయవంతంగా శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. వచ్చే ఏడాది జనవరిలో భారత్తో ఆరంభమయ్యే టెస్టు సిరీస్కు సిద్ధం కావాలనే పట్టుదలతో ఉన్న ఈ 32 ఏళ్ల ఆల్రౌండర్.. తాజాగా వన్డే ప్రపంచకప్లో బ్యాటర్గా మాత్రమే ఆడాడు. -
తెలంగాణకు రజతం
సీనియర్ జాతీయ ఆర్చరీ ఛాంపియన్షిప్లో తెలంగాణ జట్టు రజత పతకం సాధించింది. మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో తెలంగాణ ద్వితీయ స్థానంలో నిలిచింది.


తాజా వార్తలు (Latest News)
-
Stock Market: లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. రికార్డు గరిష్ఠానికి నిఫ్టీ
-
Nagarjuna Sagar: నాగార్జున సాగర్ వద్ద కొనసాగుతున్న పోలీసు పహారా
-
Purandeswari: ఓట్ల కోసమే ‘నాగార్జునసాగర్’ వివాదం: పురందేశ్వరి
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Chandrababu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు
-
ఏడాదిగా తల్లి మృతదేహంతో ఇంట్లోనే అక్కాచెల్లెళ్లు..