Fastest fifties: ధనాధన్ బ్యాటింగ్.. ఈ సీజన్లో వేగవంతమైన అర్ధశతకాలివే..!
భారత టీ20 లీగ్లో ఇప్పటివరకు 25 మ్యాచ్లు పూర్తయ్యాయి. చెన్నై, ముంబయి మినహా అన్ని జట్లూ ఈ సీజన్లో మంచి ప్రదర్శన చేస్తున్నాయి...
ఇంటర్నెట్డెస్క్: భారత టీ20 లీగ్లో ఇప్పటివరకు 25 మ్యాచ్లు పూర్తయ్యాయి. చెన్నై, ముంబయి మినహా అన్ని జట్లూ ఈ సీజన్లో మంచి ప్రదర్శన చేస్తున్నాయి. ఈ క్రమంలోనే పలువురు బ్యాట్స్మన్ ధనాధన్ ఇన్నింగ్స్తో చెలరేగుతున్నారు. అలా ఇప్పటివరకు వేగవంతమైన అర్ధశతకాలు సాధించిన టాప్ 10 బ్యాట్స్మెన్ ఎవరో ఓ లుక్కేద్దాం..
* ప్యాట్ కమిన్స్: కోల్కతా ఆటగాడు ప్యాట్ కమిన్స్ ముంబయితో జరిగిన మ్యాచ్లో రెచ్చిపోయాడు. కేవలం 14 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసుకొని ఈ సీజన్లో వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించాడు. అదే సమయంలో ఈ లీగ్ చరిత్రలో 14 బంతుల్లోనే ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. కేఎల్ రాహుల్ 2018లో తొలిసారి ఈ రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్లో కమిన్స్ 4 ఫోర్లు, 6 సిక్సర్లు సాధించి మొత్తం 56 పరుగులు చేసి కోల్కతాను గెలిపించాడు.
* రాహుల్ త్రిపాఠి: హైదరాబాద్ బ్యాట్స్మన్ రాహుల్ త్రిపాఠి గతరాత్రి కోల్కతాతో జరిగిన మ్యాచ్లో 21 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. దీంతో ఈ సీజన్లో రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించిన బ్యాట్స్మన్గా నిలిచాడు. అందులో 4 ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టాడు. మొత్తంగా 71 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
* లియామ్ లివింగ్స్టోన్: పంజాబ్ ఆటగాడు లియామ్ లివింగ్స్టోన్ కూడా 21 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో అతడు ఈ ఘనత సాధించాడు. దీంతో వేగవంతమైన అర్ధశతకం బాదిన ఆటగాడిగా ప్రస్తుతం మూడో స్థానంలో నిలిచాడు. ఈ మ్యాచ్లో అతడు 7 ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టాడు. మొత్తం 64 పరుగులు చేశాడు. అయితే, ఈ మ్యాచ్లో గుజరాత్ గెలవడం కొసమెరుపు.
* జోస్బట్లర్: రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్ ఈ సీజన్లో జోరుమీదున్నాడు. ఇప్పటికే ఒక శతకం, రెండు అర్ధశతకాలతో టాప్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే గుజరాత్తో ఆడిన మ్యాచ్లో 23 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. అందులో 8 ఫోర్లు, 3 సిక్సర్లు దంచికొట్టాడు. మొత్తంగా ఈ మ్యాచ్లో 54 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో గుజరాత్ విజయం సాధించింది.
* ఎవిన్ లూయిస్: లఖ్నవూ ఆటగాడు ఎవిన్ లూయిస్ సైతం 23 బంతుల్లోనే ఈ సీజన్లో వేగవంతమైన అర్ధశతకం సాధించాడు. చెన్నైతో తలపడిన మ్యాచ్లో అతడు దంచికొట్టి ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. అందులో 6 ఫోర్లు, 3 సిక్సర్లు సంధించాడు. మొత్తంగా ఈ మ్యాచ్లో 55 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి తన జట్టును గెలిపించాడు.
* సంజూ శాంసన్: రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ ఈ సీజన్లో 25 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి ఈ జాబితాలో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో అతడు కెప్టెన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. అందులో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో మొత్తం 55 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో రాజస్థాన్ విజయం సాధించింది.
* రాబిన్ ఉతప్ప: ఇప్పటివరకు జరిగిన సీజన్లో చెన్నై పెద్దగా ఆకట్టుకోకపోయినా ఆ జట్టు బ్యాట్స్మన్ రాబిన్ ఉతప్ప మంచి ఫామ్లో ఉన్నాడు. లఖ్నవూతో జరిగిన మ్యాచ్లో అతడు 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి ఔటయ్యాడు. దీంతో ఈ జాబితాలో ఏడో స్థానంలో నిలిచాడు. అందులో మొత్తం 8 ఫోర్లు, 1 సిక్సర్ సాధించాడు. ఆ మ్యాచ్లో చెన్నై 210 పరుగుల భారీ స్కోర్ చేసినా ఓటమిపాలైంది.
* శివమ్దూబే: మరో చెన్నై ఆటగాడు శివమ్దూబే. ప్రస్తుత సీజన్లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో మూడో స్థానంలో ఉన్న అతడు పంజాబ్తో జరిగిన మ్యాచ్లో 26 బంతుల్లో 50 పరుగులు సాధించాడు. దీంతో ఈ జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచాడు. అందులో 6 ఫోర్లు, 3 సిక్సర్లు దంచికొట్టాడు. మొత్తంగా ఈ మ్యాచ్లో దూబే 57 పరుగులు చేశాడు. ఇక్కడ కూడా చెన్నై ఓటమిపాలవ్వడం గమనార్హం.
* పృథ్వీషా: దిల్లీ ఓపెనర్ పృథ్వీషా ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. కోల్కతాతో ఆడిన మ్యాచ్లో అతడు 27 బంతుల్లో అర్ధ శతకం సాధించాడు. అందులో 7 ఫోర్లు, 2 సిక్సర్లు నమోదు చేశాడు. మొత్తం 51 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇక ఈ మ్యాచ్లో దిల్లీ 215 పరుగుల భారీ స్కోర్ చేయగా కోల్కతా అంత మొత్తం ఛేదించలేక ఓటమిపాలైంది.
* ఆండ్రీ రసెల్: కోల్కతా సూపర్ హిట్టర్ ఆండ్రీ రసెల్ ఈ జాబితాలో పదో స్థానంలో ఉన్నాడు. అతడు పంజాబ్తో ఆడిన మ్యాచ్లో 27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అందులో 2 ఫోర్లు, 8 సిక్సర్లు ఉండటం విశేషం. మొత్తంగా ఈ మ్యాచ్లో 70 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి కోల్కతాను గెలిపించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు