T20 League: మెరుపులే మెరుపులు.. అతి తక్కువ బంతుల్లో అర్ధశతక వీరులు!
అభిమానులు ఆశించేది ధనాధన్ బ్యాటింగ్. క్రీజులో ఉన్నది యవకుడా అనుభవజ్ఞుడా అనేది చూడరు. బంతిని బౌండరీ దాటించాడా లేదా.. సిక్సర్ల మోత మోగించాడా లేదా...
టీ20 లీగుల్లో అభిమానులు ఆశించేది ధనాధన్ బ్యాటింగ్. క్రీజులో ఉన్నది యవకుడా అనుభవజ్ఞుడా అనేది చూడరు. బంతిని బౌండరీ దాటించాడా లేదా.. సిక్సర్ల మోత మోగించాడా లేదా.. అనేవే లెక్కేసుకుంటారు. అలా వీలైనన్ని తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు సాధించిన వారే హీరోలుగా మిగులుతారు. మరికొద్ది రోజుల్లో మెగా టోర్నీ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు అతితక్కువ బంతుల్లో అత్యధిక పరుగులు, అందులోనూ అర్ధశతక రికార్డులు నెలకొల్పిన టాప్ బ్యాట్స్మెన్ ఎవరో ఓసారి లుక్కేద్దాం.
కేఎల్ రాహుల్ విధ్వంసం..
దేశవాళీ మెగా టీ20 లీగ్ చరిత్రలో అత్యంత వేగంగా అర్ధశతకం సాధించిన ఆటగాళ్ల జాబితాలో కేఎల్ రాహుల్ అందరికన్నా ముందున్నాడు. అతడు 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి నాలుగేళ్లుగా నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. 2018లో పంజాబ్ జట్టు తరఫున ఆడిన అతడు దిల్లీతో తలపడిన మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు. ఆ మ్యాచ్లో మొత్తం 16 బంతులు ఎదుర్కొన్న రాహుల్.. 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 51 పరుగులు సాధించాడు.
యూసుఫ్ పఠాన్ మెరుపుల్..
ఇక ఈ జాబితాలో రెండో స్థానం కైవసం చేసుకుంది మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్. 2014లో అతడు కోల్కతా తరఫున ఆడగా హైదరాబాద్తో తలపడిన ఓ మ్యాచ్లో 15 బంతుల్లోనే అర్థ శతకం సాధించాడు. దీంతో ఐపీఎల్లో అత్యంత వేగంగా అర్ధశతకం సాధించిన జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. రాహుల్ 2018లో ఈ రికార్డును బద్దలుకొట్టనంత వరకూ యూసుఫ్ తొలి స్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్లో అతడు 22 బంతుల్లో.. 5 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో మొత్తం 72 పరుగులు సాధించాడు.
సునీల్ నరైన్ దంచికొట్టుడు..
కోల్కతా ఆరౌండర్ సునీల్ నరైన్ సైతం ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. అతడు కూడా యూసుఫ్ లానే 15 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. 2017లో బెంగళూరుతో జరిగిన ఓ మ్యాచ్లో అతడు రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. అందులో మొత్తం 17 బంతులు ఎదుర్కొని.. 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో మొత్తం 54 పరుగులు సాధించాడు. దీంతో అత్యంత వేగంగా అర్ధశతకం పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు.
సురేశ్ రైనా చితకబాదుడు..
టీ20 లీగ్లో విజయవంతమైన బ్యాట్స్మెన్లో సురేశ్ రైనా ఒకడు. అతడు కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం. 2014లో చెన్నై తరఫున ఆడిన అతడు పంజాబ్తో జరిగిన ఓ మ్యాచ్లో 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచిన ఆటగాడిగా ఉన్నాడు. ఆ మ్యాచ్లో మొత్తం 25 బంతులు ఎదుర్కొన్న రైనా.. 12 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో మొత్తం 87 పరుగులు చేశాడు. అంటే ఈ జాబితాలో తక్కువ బంతుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ ఈ చెన్నై మాజీ ప్లేయర్ రికార్డు నెలకొల్పాడు.
ఇషాన్ కిషన్ వీర బాదుడు..
ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలిచన ఆటగాడు ముంబయి బ్యాట్స్మన్ ఇషాన్ కిషన్. అతడు గతేడాది హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 16 బంతుల్లోనే అర్ధ శతకం సాధించి రైనా తర్వాతి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో 32 బంతులు ఆడిన ఇషాన్.. 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో మొత్తం 84 పరుగులు చేశాడు. దీంతో తక్కువ బంతుల్లో అర్ధ శతకం సాధించిన వారిలో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇలా దంచికొట్టడం వల్లే ముంబయి ఈసారి వేలంలో రూ.15.25 కోట్ల అత్యధిక ధర వెచ్చించి మరీ కొనుగోలు చేసింది.
* 17 @ 9: ఇక 17 బంతుల్లో అర్ధ శతకం సాధించిన ఆటగాళ్ల జాబితాలో మొత్తం 9 మంది బ్యాట్స్మెన్ ఉన్నారు. అందులో క్రిస్గేల్, హార్దిక్ పాండ్య, కీరణ్ పొలార్డ్, ఆడం గిల్క్రిస్ట్, క్రిస్మోరిస్, నికోలస్ పూరన్తో పాటు.. ఇషాన్, పొలార్డ్, నరైన్ రెండో సారి ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. అలాగే 18 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన వారిలో పృథ్వీ షా, రిషభ్ పంత్, జోస్ బట్లర్ చోటు సంపాదించుకున్నారు.
- ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఇంకెవరూ మీ భార్యే..’: కోహ్లీ ఆన్సర్కు షాకైన దినేశ్ కార్తిక్
Kohli-DK: బెంగళూరు ఆటగాడు డీకే అడిగిన ప్రశ్నలకు.. కోహ్లీ ఇచ్చిన సమాధానం నెట్టింట వైరల్ అవుతోంది. దినేశ్ కార్తిక్ సతీమణి దీపిక ప్రస్తావన తేవడంతో అతడు ఆశ్చర్యపోయాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
డేవిడ్, పొలార్డ్కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?
ముంబయి ఆటగాడు, కోచ్పై ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ కొరడా ఝళిపించింది. వారు చేసిన చర్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర నిర్ణయం తీసుకుంది. -
Ravindra Jadeja: గాల్లోకి ఎగిరి.. ఒంటిచేత్తో జడేజా క్యాచ్!
లఖ్నవూతో శుక్రవారం జరిగిన మ్యాచ్లో చెన్నై ఆటగాడు రవీంద్ర జడేజా.. గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో క్యాచ్ ఒడిసిపట్టాడు.
-
దిల్లీ కోటలో తొలి మ్యాచ్.. హైదరాబాద్ దూకుడు కొనసాగేనా?
అభిమానుల ఊహకు అందనిరీతిలో.. సంచలన ఆటతో ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ జట్టు అదరగొట్టేస్తోంది. ఇవాళ మరో మ్యాచ్లో తలపడేందుకు సిద్ధమవుతోంది. -
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
ప్రస్తుత సీజన్లో దూకుడుగా ఆడుతున్న క్రికెటర్లలో ధోనీ ముందువరుసలో ఉంటాడు. ఆడేది పది బంతుల్లోపే అయినా ప్రత్యర్థి బౌలర్లకు వణుకు పుట్టిస్తున్నాడు. -
ఆ ముగ్గురిని చూస్తే ముచ్చటేసింది.. రోహిత్ ఈజ్ బ్యాక్: హర్భజన్
పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ముంబయి జట్టుకు కాసేపు యాక్టివ్ కెప్టెన్గా రోహిత్ శర్మ వ్యవహరించాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
లఖ్నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్, చెన్నై సారథి రుతురాజ్ గైక్వాడ్కు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ జరిమానా విధించింది. -
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
సొంత మైదానంలో లఖ్నవూ విజయం సాధించింది. ఆ జట్టు గెలుపు కంటే మరొక అంశం అభిమానులను ఆకట్టుకుంది. అదే ఎంఎస్ ధోనీ (MS Dhoni) బ్యాటింగ్ వీరవిహారం. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
social look: వర్ష చీరకట్టు.. ప్రియాంక క్యూటు.. రష్మి హాటు..
-
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
-
ప్రజలు బెంజ్ కారు అడగట్లేదు కదా!.. ఎన్నికలపై విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
అందుకే భారాస కష్టాల్లో పడింది: గుత్తా సుఖేందర్రెడ్డి
-
జగన్పై రాయిదాడి కేసు.. దుర్గారావు ఎక్కడ?
-
22న ఏపీ పదోతరగతి ఫలితాలు