Cummins : టీ20 లీగ్.. స్పీడ్గా ‘50’ కొట్టిన బ్యాటర్లు వీరే!
టీ20 లీగ్లో అత్యధిక తక్కువ బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన...
ఇంటర్నెట్ డెస్క్: టీ20 లీగ్లో ప్యాట్ కమిన్స్ (56*) సూపర్ ఇన్నింగ్స్ ఆడేశాడు. ముంబయితో జరిగిన మ్యాచ్లో కోల్కతా బ్యాటర్ కేవలం 14 బంతుల్లోనే అర్ధశతకం బాదేసి తన జట్టును గెలిపించాడు. ఈ క్రమంలో కేఎల్ రాహుల్ (14) రికార్డును కమిన్స్ సమం చేశాడు. మరి టీ20 లీగ్లో అతి తక్కువ బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన వీరులెవరో తెలుసుకుందాం..
- కేఎల్ రాహుల్: నాలుగేళ్ల కిందట (2018) దిల్లీతో జరిగిన మ్యాచ్లో కేఎల్ రాహుల్ భీకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 14 బంతుల్లోనే ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో అర్ధశతకం సాధించాడు. అయితే 51 పరుగులకే బౌల్ట్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. ఇప్పుడు కమిన్స్ సమం చేసేవరకూ దాదాపు నాలుగేళ్ల నుంచి రికార్డు పదిలంగానే ఉంది.
- యూసఫ్ పఠాన్: టీమ్ఇండియా మాజీ ఆటగాడు మిడిలార్డర్లో విధ్వంసం సృష్టించేవాడు. 2014 సీజన్లో ఈ కోల్కతా బ్యాటర్ కేవలం 15 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. అదీ హైదరాబాద్ జట్టు మీదనే కావడం గమనార్హం. హైదరాబాద్ నిర్దేశించిన 161 పరుగుల లక్ష్య ఛేదనలో నాలుగో స్థానంలో వచ్చిన పఠాన్ (72: 22 బంతులు) చెలరేగడంతో సునాయాసంగా విజయం సాధించింది.
- సునిల్ నరైన్: క్రీజ్లో నిలబడి అలవోకగా బౌండరీలు బాదే ఆల్రౌండర్ సునిల్ నరైన్. బెంగళూరుపై 2017లో జరిగిన మ్యాచ్లో కేవలం 15 బంతుల్లోనే ఫిఫ్టీ కొట్టేశాడు. నరైన్ (54) దెబ్బకు బెంగళూరు నిర్దేశించిన 159 పరుగులను కేవలం 15.1 ఓవర్లలోనే కోల్కతా ఛేదించింది. బౌలింగ్లోనూ సునిల్ నరైన్ (2/29) అదరగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.
- సురేశ్ రైనా: ఒకప్పటి చెన్నై బ్యాటర్, టీమ్ఇండియా మాజీ ఆటగాడు సురేశ్ రైనా దూకుడుగా ఆడటంలో దిట్ట. జట్టు అవసరాలకు తగ్గట్టుగా పరుగులు రాబట్టేవాడు. అయితే గత రెండు సీజన్ల నుంచి ఫామ్పరంగా ఇబ్బంది పడుతున్న రైనాకు ఈసారి సీజన్లో అవకాశం దక్కలేదు. అయితేనేం అతడి రికార్డును తక్కువగా అంచనా వేయకూడదు. 2014లోనే పంజాబ్పై రైనా (87) కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టి ఔరా అనిపించాడు.
- ఇషాన్ కిషన్: ముంబయి ఓపెనర్, ఈసారి మెగా వేలంలో భారీ ధరను దక్కించుకున్న ఇషాన్ కిషన్ (84) కూడా ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. గతేడాది (2021) హైదరాబాద్ మీద 16 బంతుల్లోనే బాదేశాడు. ఇషాన్ దెబ్బకు ముంబయి 235 పరుగుల భారీ స్కోరు చేసి హైదరాబాద్ ఎదుట ఉంచింది. అయితే లక్ష్య ఛేదనలో హైదరాబాద్ 193 పరుగులకే పరిమితమైంది.
- 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీలు చేసిన బ్యాటర్లూ ఉన్నారు. క్రిస్ గేల్ (175*) 2013లో కోల్కతా మీద భారీ ఇన్నింగ్స్ ఆడాడు. కోల్కతాపై హార్దిక్ పాండ్య (91), చెన్నై మీద కీరన్ పొలార్డ్ (87), దిల్లీపై ఆడమ్ గిల్ క్రిస్ట్ (85), గుజరాత్పై 2016లో మోరిస్ (82), నికోలస్ పూరన్ (77) హైదరాబాద్ మీద సూపర్ ఫిఫ్టీలు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
బెంగళూరు - కోల్కతా జట్ల మధ్య ఆసక్తికర పోరు నేడు. ఇరు జట్లలోనూ కీలక ఆటగాళ్లు ఉన్నారు. -
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
బెంగళూరు, కోల్కతా జట్ల మధ్య మ్యాచ్ నేపథ్యంలో అందరి దృష్టి ఇద్దరి క్రికెటర్లపైనే ఉంది. -
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
ధోనీతో తనకున్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో రవీంద్ర జడేజా గుర్తు చేసుకున్నాడు. -
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!