FIFA: ‘బంగారు బూటు’ కోసం మెస్సీ vs ఎంబాపె.. అసలేంటీ ‘గోల్డెన్ బూట్’..?
సాకర్ విశ్వవిజేత ఎవరన్నది మరి కొద్ది గంటల్లో తేలనుంది. మరి ఈ టోర్నీలో అత్యధిక గోల్స్తో బంగారు బూటు దక్కించుకునే ఆటగాడు ఎవరు? ప్రపంచకప్ కలను నెరవేర్చుకోవాలని ఆశ పడుతున్న మెస్పీ ఈ గోల్డెన్ బూట్ రేసులో ఉండగా.. ఫ్రాన్స్ స్టార్ ఆటగాడు ఎంబాపె కూడా పోటీ పడుతున్నాడు.
దోహా: ఫిఫా (FIFA) ప్రపంచకప్ 2022 మెగా టోర్నీ చివరి దశకు వచ్చేసింది. ఆదివారం జరిగే సాకర్ ఫైనల్ సమరంలో విశ్వవిజేత ఎవరో తేలనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ (France)తో అర్జెంటీనా (Argentina) తలపడనుంది. అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఈ ఫైనల్ పోరులోనే ‘బంగారు బూటు’ దక్కించునే ఆటగాడు ఎవరో కూడా తేలిపోతుంది. ఈ అవార్డు కోసం ఫుట్బాల్ మాంత్రికుడు, అర్జెంటీనా కెప్టెన్ మెస్సీ (Lionel Messi), ఫ్రాన్స్ స్టార్ ఆటగాడు ఎంబాపె (Kylian Mbappe) ముందు వరుసలో ఉన్నారు. ఇంతకీ ఏంటీ ‘గోల్డెన్ బూట్’..? ఈ అవార్డును ఎవరికిస్తారు..?
1982లో తొలిసారి..
1930 నుంచి ఫిఫా ప్రపంచకప్ (FIFA Worldcup) టోర్నీలు జరుగుతున్నాయి. అప్పటి నుంచే మెగా టోర్నీలో అత్యధిక గోల్స్ సాధించిన వారికి ప్రత్యేకంగా ట్రోఫీలు ఇస్తున్నారు. అయితే 1982 ప్రపంచకప్ నుంచి ‘గోల్డెన్ షూ’ పేరుతో ఈ అవార్డులను ఇస్తున్నారు. ఫుట్బాల్ ఆటగాడు ధరించే బూట్ ఆకారంతో ఉండే ఈ ట్రోఫీని ఇత్తడితో చేసి బంగారు పూత పూస్తారు. దీని బరువు దాదాపు కిలో వరకు ఉంటుంది. 2006 ప్రపంచ కప్ నుంచి దీని పేరును ‘గోల్డెన్ బూట్’ (Golden Boot)గా మార్చారు.
మెస్సీ vs ఎంబాపె..
తాజా టోర్నీలో ఈ అవార్డు కోసం పోటీ పడుతున్న వారిలో మెస్సీ, ఎంబాపె ముందు వరుసలో ఉన్నారు. ఈ ఏడాది టోర్నీలో తమ జట్లు ఫైనల్కు చేరడంలో కీలక పాత్ర పోషించిన ఈ అగ్రశ్రేణి ఆటగాళ్లు.. చెరో అయిదు గోల్స్తో ఉమ్మడిగా అగ్రస్థానంలో ఉన్నారు.
* ఈ టోర్నీలో మెస్సీ ఐదు గోల్స్ చేయగా.. మరో మూడింటికి సహకరించాడు. సౌదీ అరేబియా, మెక్సికో, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, క్రొయేషియాపై ఒక్కో గోల్ సాధించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో మెస్సీ కళ్లు చెదిరే గోల్తో ఆకట్టుకున్నాడు. ఈ టోర్నీలో మొత్తం 570 నిమిషాలు ఆడిన మెస్సీ.. మూడు పెనాల్టీ కిక్స్ను విజయవంతంగా ఉపయోగించుకున్నాడు.
* ఇక, గోల్డెన్ బూట్ కోసం పోటీ పడుతున్న ఎంబాపె కూడా ఐదు గోల్స్ చేసి.. మరో రెండింటికి సహకరించాడు. ఆస్ట్రేలియాపై 1, డెన్మార్క్పై 2, పోలాండ్పై 2 గోల్స్ చేశాడు. మొరాకోతో జరిగిన సెమీస్లో ఎంబాపెకు గోల్ దక్కలేదు.
ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్లో వీరిద్దరిలో ఎవరు ఎక్కువ గోల్స్ చేస్తే వారికే బంగారు బూటు దక్కుతుంది. ఒకవేళ ఇద్దరూ సమానంగా ఉంటే.. గోల్స్కు అసిస్ట్ చేసిన సంఖ్య ఆధారంగా అవార్డు ఇస్తారు. ఒకవేళ అది కూడా సమానమైతే.. ప్లేయర్ ఆడిన క్షణాలను పరిగణనలోకి తీసుకుంటారు. అయితే అర్జెంటీనా ఆటగాడు అల్వారెజ్, ఫ్రాన్స్ ఫుట్బాలర్ ఒవీర్ గిరూడ్ చెరో నాలుగు గోల్స్తో రెండో స్థానంలో కొనసాగుతున్నారు. వీరిద్దరూ కూడా ఆదివారం జరిగే తుది పోరులో తలపడనున్నారు. ఒకవేళ ఫైనల్ మ్యాచ్లో ఈ ఇద్దరిలో ఎవరైనా.. మెస్సీ, ఎంబాపెను దాటి బంగారు బూటు గెలుచుకున్నా ఆశ్చర్యపోవాల్సి అవసరం లేదు.
ఏకంగా 13 గోల్స్..
ఫిఫా ప్రపంచకప్లో తొలి ‘గోల్డెన్ షూ’ను 1982లో పాలో రోసీ (ఇటలీ) 6 గోల్స్ అందుకున్నాడు. అయితే ఓ ప్రపంచకప్లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా ఫ్రాన్స్కు చెందిన జస్ట్ ఫాంటైన్ నిలిచాడు. 1958వ ఎడిషన్ టోర్నీలో అతడు ఏకంగా 13 గోల్స్ సాధించాడు. ఇక, ఈ టోర్నీ చరిత్రలో ఇంతవరకూ ఏ ఆటగాడు ఒకటి కంటే ఎక్కువసార్లు బంగారు బూటు అందుకోలేదు. కానీ, బ్రెజిల్ జట్టు ఆటగాళ్లకు అత్యధికంగా ఆరుసార్లు ఈ అవార్డు దక్కింది. అత్యధిక గోల్స్ జాబితాలో రన్నరప్లకు . వెండి, కాంస్య బూట్లను కూడా అందజేస్తారు.
ఈ అవార్డులు కూడా..
‘గోల్డెన్ బూట్’తో పాటు ‘గోల్డెన్ బాల్’, ‘గోల్డెన్ గ్లౌ’ అవార్డులను కూడా ఫిఫా ప్రపంచకప్లో అందిస్తారు. ఈ టోర్నీలో ఉత్తమ ఆటగాడికి బంగారు బంతి, ఉత్తమ గోల్ కీపర్కు బంగారు చేతి గ్లౌజు అవార్డులు ఇస్తారు. ఓటింగ్ ద్వారా ఈ విజేతలను ఎంపిక చేస్తారు.
మరి ‘గోల్డెన్ బూట్’తో పాటు మెస్సీ ప్రపంచ కప్ కల నెరవేరనుందా..? అన్నది తేలాలంటే మరి కొద్ది గంటలు ఆగాల్సిందే..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు