
ప్చ్.. సింధుకు నిరాశ!
ఇంటర్నెట్డెస్క్: బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్ను విజయంతో ఆరంభించాలనుకున్న భారత అగ్రశ్రేణి షట్లర్ పీవీ సింధుకు నిరాశే మిగిలింది. గ్రూప్-బిలో మహిళల సింగిల్స్లో.. ప్రపంచ నంబర్వన్ షట్లర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో తలపడిన తొలి మ్యాచ్లో ఓటమిపాలైంది. 21-19, 12-21, 17-21 తేడాతో పరాజయాన్ని చవిచూసింది.
తొలి గేమ్లో తెలుగు తేజం పైచేయి సాధించగా, రెండో గేమ్లో ప్రత్యర్థి విజయం సాధించింది. ఇక నిర్ణయాత్మక గేమ్ ఉత్కంఠగా సాగింది. ఆదిలో తైజు 6-3తో ఆధిక్యంలోకి వెళ్లింది. కాగా సింధు గొప్పగా పోరాడి 6-6తో స్కోరు సమం చేసింది. కానీ కొన్ని పొరపాట్లతో సింధు మరోసారి ప్రత్యర్థికి పాయింట్లు సమర్పించుకుంది. దీంతో 17-21తో మ్యాచ్ను కోల్పోయింది. 59 నిమిషాల పాటు ఈ మ్యాచ్ సాగింది.
ఇప్పటివరకు తై జు యింగ్తో సింధు 21 మ్యాచ్ల్లో తలపడగా 16 సార్లు ఓటమిపాలైంది. కాగా, సింధు తన తర్వాతి మ్యాచ్లో థాయ్లాండ్ క్రీడాకారిణి ఇంతానన్ రచనోక్తో తలపడనుంది. రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో సాగే ఈ టోర్నీలో.. గ్రూప్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన క్రీడాకారిణులు సెమీస్కు అర్హత సాధిస్తారు.
ఇదీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.