NZ vs IND: మూడో టీ20 టై.. టీమ్ఇండియాదే సిరీస్
న్యూజిలాండ్తో మూడు టీ20ల సిరీస్ను భారత్ 1-0 ఆధిక్యంతో దక్కించుకొంది. నేపియర్ వేదికగా చివరిదైన మూడో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా టైగా ముగిసింది.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ తర్వాత ఆడిన తొలి టీ20 సిరీస్ను టీమ్ఇండియా కైవసం చేసుకొంది. భారత ఆటగాళ్లకు వరుణుడూ తోడు కావడంతో మూడు టీ20ల సిరీస్ను 1-0 ఆధిక్యంతో సొంతం చేసుకొంది. తొలి మ్యాచ్ రద్దు కాగా.. రెండో టీ20లో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. మూడో మ్యాచ్ డక్వర్త్లూయిస్ పద్ధతి ప్రకారం టైగా ముగిసింది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా సూర్యకుమార్ యాదవ్కు అవార్డు దక్కింది.
నేపియర్ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్ టైగా ముగిసింది. వర్షం కారణంగా మధ్యలోనే మ్యాచ్ను అంపైర్లు ఆపేశారు. 161 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్ మ్యాచ్ ఆగిపోయే నాటికి 75/4 స్కోరుతో ఉంది. దీంతో డక్వర్త్లూయిస్ పద్ధతి ప్రకారం మ్యాచ్ టైగా ముగిసింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 19.4 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటైంది. నాలుగు వికెట్లతో కీలక పాత్ర పోషించిన మహమ్మద్ సిరాజ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకొన్నాడు.
పంత్ మళ్లీ విఫలం
బౌలర్లు కష్టపడి కివీస్ను 160 పరుగులకే కట్టడి చేసిన ఆనందం కాసేపు భారత అభిమానులకు నిలవలేదు. రెండో టీ20లో అద్భుతంగా ఆడిన ఇషాన్ కిషన్ (10)తోపాటు రిషభ్ పంత్ (11), సూర్యకుమార్ యాదవ్ స్వల్ప వ్యవధిలో పెవిలియన్కు చేరడంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే మరోవైపు కెప్టెన్ హార్దిక్ పాండ్య (30 నాటౌట్: 18 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్) దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. దీంతో 9 ఓవర్లకు నాలుగు వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. ఈ క్రమంలో వర్షం రావడం టీమ్ఇండియాకి కలిసొచ్చింది. డక్వర్త్లూయిస్ పద్ధతి ప్రకారం 76 పరుగులు చేస్తే విజయం.. 75 చేస్తే టైగా ముగుస్తుంది. భారత్ సరిగ్గా 75 చేయడంతో ఓటమి నుంచి తప్పించుకొంది. కివీస్ బౌలర్లలో సౌథీ 2.. మిల్నే, ఐష్ సోధి చెరో వికెట్ తీశారు.
ఇద్దరే ఆడారు.. ఇద్దరే తీశారు
కివీస్ ఆరంభంలోనే ఫిన్ అలెన్ (3) వికెట్ను చేజార్చుకొంది. అయితే చాప్మన్ (12)తో కలిసి మరో ఓపెనర్ డేవన్ కాన్వే (59) ఇన్నింగ్స్ను నిలబెట్టేందుకు ప్రయత్నించాడు. అయితే చాప్మన్ను సిరాజ్ బుట్టలో వేశాడు. కానీ ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ (54) వీరవిహారం చేశాడు. కాన్వే-ఫిలిప్స్ కలిసి మూడో వికెట్కు 86 పరుగులు జోడించారు. దీంతో కివీస్ స్కోరు 200 పరుగులకు వెళ్తుందేమోనని భారత అభిమానుల్లో కలవరం రేగింది. అయితే సిరాజ్ (4/17), అర్ష్దీప్ సింగ్ (4/37) విజృంభించడంతో కేవలం 30 పరుగుల వ్యవధిలో ఎనిమిది వికెట్లను కివీస్ చేజార్చుకొంది.
ఇది భారత్కు తొలిసారి.. మొత్తంగా మూడోసారి
వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయి టైగా ముగియడం భారత టీ20 చరిత్రలో ఇదే తొలిసారి. అయితే అంతర్జాతీయంగా మాత్రం మూడో మ్యాచ్ కావడం గమనార్హం. గతేడాది (2021) నెదర్లాండ్స్ X మలేషియా... మాల్టా X మార్సా జట్ల మధ్య జరిగిన మ్యాచ్లు ఇలా టైగా ముగిశాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడించారు. -
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM