Lakshya Sen: స్టార్ షట్లర్ లక్ష్యసేన్పై చీటింగ్ కేసు..
భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ ఆటగాడు లక్ష్య సేన్పై బెంగళూరులో మోసం కేసు నమోదైంది. అతడు తన వయసును తక్కువగా చూపించి టోర్నీల్లో పాల్గొంటున్నాడని ఆరోపణలు వచ్చాయి.
దిల్లీ: భారత నంబర్ వన్ బ్యాడ్మింటన్ ఆటగాడు లక్ష్య సేన్పై బెంగళూరులో చీటింగ్ కేసు నమోదైంది. లక్ష్య సేన్, అతడి సోదరుడు చిరాగ్ సేన్ తమ వయసును తప్పుగా చూపించి 2010 నుంచి పలు టోర్నమెంట్లలో ఆడుతున్నారని గోవియప్ప నాగరాజా అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సేన్ సోదరులతో పాటు వారి తండ్రి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కోచ్ ధీరేంద్ర, తల్లి నిర్మల, కోచ్ విమల్ కుమార్లపై ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది.
ఉత్తరాఖండ్కు చెందిన సేన్ సోదరులు బెంగళూరులోని ప్రకాశ్ పదుకొణె బ్యాడ్మింటన్ అకాడమీలో విమల్ కుమార్ వద్ద శిక్షణ తీసుకుంటున్నారు. ఫిర్యాదు దారు గోవియప్ప కూడా ఇదే నగరంలో మరో అకాడమీని నిర్వహిస్తున్నారు. విమల్ కుమార్, లక్ష్య సేన్ తల్లిదండ్రులు కలిసి 2010లో సేన్ సోదరులకు తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలు సృష్టించారని గోవియప్ప ఆరోపించారు. వయసు తక్కువగా చూపించి పలు టోర్నమెంట్లలో వీరు పాల్గొన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం లక్ష్య సేన్ వయసు 24 ఏళ్లని.. కానీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు సమర్పించిన బర్త్ సర్టిఫికేట్లో 21 ఏళ్లుగా ఉందని ఆరోపించారు. ఇక లక్ష్య సోదరుడు చిరాగ్ వయసు 26 ఏళ్లయితే.. 24 ఏళ్లని జనన ధ్రువీకరణ పత్రాలు సృష్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే ఈ ఆరోపణలను విమల్ కుమార్ ఖండించారు. ‘‘అవన్నీ అవాస్తవాలే. ఉద్దేశపూర్వకంగా చేస్తోన్న ఆరోపణలే. బ్యాడ్మింటన్లో వయసు వెరిఫికేషన్, ధ్రువీకరణ అనేది బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మాత్రమే చేస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే. నాపై వస్తోన్న నిరాధార ఆరోపణలు నేను ఖండిస్తున్నా’’ అని విమల్ స్పష్టం చేశారు. అయితే ఈ ఆరోపణలపై లక్ష్య సేన్, అతడి కుటుంబం ఇంతవరకూ స్పందించలేదు.
కాగా.. బ్యాడ్మింటన్లో ప్రపంచ నంబరు 6 ఆటగాడైన లక్ష్య.. బుధవారమే రాష్ట్రపతి చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకున్నాడు. 2021లో ప్రపంచ ఛాంపియన్షిప్ టోర్నీలో కాంస్య పతకం సాధించిన ఈ స్టార్ షట్లర్.. ఈ ఏడాది ఆరంభంలో భారత్ సాధించిన చారిత్రక థామస్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు