Sakibul Gani : ఈ ‘గని’ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు..
క్రికెట్లోకి అడుగు పెడుతూనే సంచలనంగా మారాలని ప్రతి క్రికెటర్ భావిస్తాడు. తొలి మ్యాచ్లోనే ...
ఇంటర్నెట్ డెస్క్, ప్రత్యేకం : క్రికెట్లోకి అడుగు పెడుతూనే సంచలనంగా మారాలని ప్రతి క్రికెటర్ భావిస్తాడు. తొలి మ్యాచ్లోనే తన మార్క్ను చూపించాలని తహతహలాడతాడు. జాతీయ జట్టులోకి అడుగు పెట్టాలంటే ఫస్ట్క్లాస్ క్రికెట్లో అద్భుత ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. మొదటి మ్యాచ్ అనగానే కాస్త కంగారు పడటం మామూలే. అయితే బిహార్కు చెందిన ఓ కుర్రాడు మాత్రం అరంగేట్ర మ్యాచ్లోనే త్రిశతకం సాధించి ప్రపంచ రికార్డును స్థాపించాడు. ఇంతకీ ఎవరా యువ ఆటగాడు.. అతడి గురించి ప్రత్యేక కథనం మీ కోసం..
సకిబుల్ గని.. ఈ 23 ఏళ్ల యువకుడి పేరు నిన్నటి నుంచి మార్మోగిపోతోంది. ఎందుకో తెలుసా.. అంతర్జాతీయంగా తన మొదటి ఫస్ట్క్లాస్ మ్యాచ్లోనే త్రిశతకం బాదిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. రంజీ ట్రోఫీ మ్యాచ్లో బిహార్కు చెందిన సకిబుల్ గని మిజోరం జట్టుపై 405 బంతుల్లో 341 పరుగులు (56 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి చరిత్ర సృష్టించాడు. ఫస్ట్క్లాస్ అరంగేట్ర మ్యాచ్లోనే ఆ ఘనత అందుకున్న మొదటి ఆటగాడిగా ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్ అరంగేట్ర మ్యాచ్లో అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా గత రికార్డు కూడా భారత క్రికెటర్ పేరు మీదే ఉంది. 2018లో మధ్యప్రదేశ్ ఆటగాడు అజయ్ రొతేరా హైదరాబాద్పై 267 పరుగులు చేశాడు. ఇప్పుడా రికార్డును సకిబుల్ తిరగరాశాడు. అయితే దీని వెనుక కఠోర శ్రమ, కోచ్ అజయ్ రాత్రా, సోదరుడు ఫైజల్ గని సహకారం ఉంది.
కోచ్ రాత్రా గుర్తించడంతో...
2018-19 సీజన్లో సీకే నాయుడు ట్రోఫీ కోసం సెలెక్షన్ జరుగుతోంది. అప్పుడు టీమ్ఇండియా మాజీ వికెట్ కీపర్ అజయ్ రాత్రా బిహార్ కోచ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ‘‘పట్నాలోని మొయిన్ ఉల్ హక్ స్టేడియంలో మొదటసారి గని ఎలాంటి భయం లేకుండా స్ట్రోక్ప్లే ఆడటం చూశా. క్లాసైన ఆటను ఆడుతున్నాడు. వెంటనే స్థానిక మ్యాచుల్లో అతడి స్కోరు వివరాలను పరిశీలించా. అతడు టాప్ఆర్డర్ నుంచి ఆరో స్థానం వరకు బ్యాటింగ్ చేయగలడు’’ అని రాత్రా వివరించారు. ఆ సీజన్లో 57.08 సగటుతో 685 పరుగులు చేసి బిహార్ అండర్-23 జట్టులో టాప్ స్కోరర్గా నిలిచాడన్నారు. ‘ఆ సీజన్లో అతడు వెయ్యికిపైగా పరుగులు చేస్తాడని భావించా. కొన్నిసార్లు 30 లేదా 40 పరుగులకే అనవసరంగా వికెట్ను సమర్పించుకునేవాడు. క్రీజ్లో ఎక్కువ సమయం ఉండాలని మాత్రమే సూచించా. అయితే వయసు ప్రభావంతో కాస్త దూకుడుకు పోయి వికెట్ ఇచ్చేవాడు’’ అని అప్పటి సంగతులను గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం రాత్రా అసోం రంజీ జట్టుకు కోచ్గా ఉన్నారు. ఇప్పటికీ మేమిద్దరం టచ్లోనే ఉన్నామని, ఇలాంటి ఫీట్ను గని సాధించడం ఎంతో ఆనందంగా ఉందని రాత్రా తెలిపారు.
తండ్రి వద్దని వారించినా.. సోదరుడి తోడ్పాటుతో
సకిబుల్ గనికి తండ్రి మహమ్మద్ మనన్ గని నుంచి ప్రతిఘటన తప్పలేదు. క్రికెట్ను కెరీర్గా ఎంచుకోవద్దని వారించేవారు. అయితే సకిబుల్ సోదరుడు ఫైజల్ గని మాత్రం ప్రోత్సహిస్తూ అండగా నిలిచారు. ఫైజల్ గని కూడా రాష్ట్రస్థాయి క్రికెటర్. సకిబుల్లోని టాలెంట్ను కోచ్ అజయ్ రాత్రా గుర్తించి మంచి వేదికను అందిస్తే.. తమ్ముడి ఎదుగుదలకు ఫైజల్ గని ఎంతో తోడ్పాటునందించారు. ‘‘ స్వతహాగా నేనూ క్రికెటర్నే. 2009-10 సీజన్లో బిహార్ తరఫున కూచ్ బెహర్ (అండర్-19) ట్రోఫీ ఆడాను. అదేవిధంగా విజ్జీ ట్రోఫీకి ఈస్ట్ జోన్ సారథిగా బాధ్యతలు నిర్వర్తించా. అయితే బిహార్లో క్రికెట్కు భవిష్యత్తు లేకపోవడంతో ఆటకు వీడ్కోలు పలికేశా. నేను ఆపేసినా నా సోదరుడు ఒక్క ట్రైనింగ్ సెషన్ను కూడా మిస్ కాకూడదని భావించా. అందుకే అతడిని రాంచీ పంపించి ఝార్ఞండ్ తరఫున ఆడించేందుకు నిర్ణయం తీసుకున్నా’’ అని 29 ఏళ్ల ఫైజల్ వెల్లడించారు. ప్రస్తుతం ఫైజల్ మోతిహరిలో స్పోర్ట్స్ షాప్ను నడిపిస్తున్నారు.
ఇదీ కుటుంబ నేపథ్యం..
సకిబుల్ తండ్రి మహమ్మద్ మనన్ గని ఓ రైతు. ఆయనకు నలుగురు కుమారులు. అందులో సకిబుల్ చివరివాడు. గని సోదరులందరూ ఏదొక స్థాయి వరకు క్రికెట్ ఆడినవారే కావడం విశేషం. ‘‘ మాకు కాస్త పొలం ఉంది. దీంతో మా నాన్న అందరూ చదువుకోవాలని చెప్పేవారు. లేకపోతే ఆయనకు వ్యవసాయ పనుల్లో సహాయం చేయాలనేవారు. దానికీ ఆయన వద్ద కారణాలు ఉన్నాయి. బిహార్ తరఫున క్రికెట్లో రాణించినవారి పరిస్థితి గురించి చాలా విన్నారు’’ అని ఫైజల్ గని తెలిపారు. సకిబుల్ ప్రదర్శనను గమనించిన దిల్లీ క్యాపిటల్స్ పరీక్షించేందుకు ముంబయికి రావాలని సూచించింది. అయితే ఐపీఎల్ ఆక్షన్లో సకిబుల్ పేరు నమోదు కాలేదు. దీనికి ఎలాంటి బాధ లేదని, ట్రయల్స్ కోసం డీసీ పిలవడం సకిబుల్ను ఎంతో ఆనందానికి గురి చేసిందని ఫైజల్ వివరించారు. తాము ఎప్పటికీ అజయ్ రాత్రా సర్కి రుణపడి ఉంటామని, వ్యక్తిగతంగా ఆసక్తి చూపి మరీ సకిబుల్ బ్యాటింగ్లోని లోపాలను సరిదిద్దారని ఫైజల్ పేర్కొన్నారు.
గనిని అభినందించిన సచిన్
ప్రపంచ రికార్డును నమోదు చేసిన సకిబుల్ గనిని క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ అభినందించాడు. ‘కంగ్రాట్స్ గని.. అరంగేట్రంలోనే రంజీ మ్యాచ్లో అద్భుత ప్రదర్శన చేశావు. అలాగే కొనసాగు’’ అని ట్వీట్ చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీవీ అంపైర్ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం.. విరాట్ కోహ్లీకి జరిమానా
కోల్కతాతో జరిగిన మ్యాచ్లో టీవీ అంపైర్ తీసుకున్న నిర్ణయంపై బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాడు. దీంతో అతడికి ఐపీఎల్ నిర్వాహకులు జరిమానా విధించారు. -
‘మామయ్య కుటుంబాన్ని గ్యాంగ్స్టర్లు చంపేశారు’.. ఐపీఎల్ నిష్క్రమణపై రైనా స్పష్టత
Suresh Raina: ఐపీఎల్ 2020 సీజన్ నుంచి ఆకస్మికంగా వైదొలగడంపై సురేశ్ రైనా ఎట్టకేలకు స్పష్టతనిచ్చాడు. బంధువులు హత్యకు గురవడం వల్లే స్వదేశానికి తిరిగి రావాల్సి వచ్చిందని వెల్లడించాడు. -
అతడో ‘లెర్నింగ్ మెషిన్’.. గుకేశ్పై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో టైటిల్ నెగ్గిన భారత యువ చెస్ ప్లేయర్ గుకేశ్ విజయంపై పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు. -
వరుస ఓటములతో డీలా.. బెంగళూరుకు ఇంకా ప్లేఆఫ్స్ అవకాశాలు ఉన్నాయా..?
ఈ సీజన్లో బెంగళూరు పేలవమైన ప్రదర్శనతో తీవ్రంగా నిరాశపరుస్తోంది. ఆడిన ఎనిమిదింట్లో ఏడు ఓడి.. ప్లేఆఫ్స్ అవకాశాలకు దాదాపు దూరమైంది . -
ఇకనైనా బౌండరీ లైన్ల పరిధిని పెంచండి..: సునీల్ గావస్కర్
ఐపీఎల్ జరిగే కొద్దీ బ్యాటర్ల హవానే కొనసాగుతోంది. బౌలర్లు చేష్టలుడిగి చూసేందుకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఎదురైంది. -
సామ్ కరన్కు 50 శాతం.. డుప్లెసిస్కు రూ. 12 లక్షల ఫైన్
ఆదివారం జరిగిన రెండు మ్యాచుల్లో.. ఇద్దరు కెప్టెన్లకు జరిమానా విధిస్తూ ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ నిర్ణయం తీసుకుంది. -
వారికి పార్టీలు ఎక్కువ.. అందుకే ఒక్క టైటిలూ లేదు: సురేశ్ రైనా
చెన్నై జట్టు విజయవంతంగా కొనసాగడంలో సురేశ్ రైనా కూడా కీలక పాత్ర పోషించాడు. ధోనీ తర్వాత ఆ జట్టు అభిమానులు ఎక్కువగా ఇష్టపడేది క్రికెటర్ రైనానే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విశేషాలను వెల్లడించాడు. -
200+ స్కోరు... చాలడం లేదు బాసూ!
ఐపీఎల్ 17వ సీజన్లో మ్యాచ్లు చివరి బంతి వరకూ రసవత్తరంగా సాగుతున్నాయి. భారీ స్కోరు చేసినా గెలుస్తామనే నమ్మకం చివరి వరకూ జట్లకు రావడం లేదు. -
కోల్కతాతో మ్యాచ్.. చర్చకు దారితీసిన కోహ్లీ ఔట్ వివాదం!
కోల్కతా నిర్దేశించిన భారీ లక్ష్య ఛేదనలో చివరి వరకూ వచ్చిన బెంగళూరు కేవలం ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది. అయితే, విరాట్ కోహ్లీ ఔట్ నిర్ణయంపై వివాదాస్పదమైంది. -
కోహ్లీ ఆగ్రహానికి కారణమదే.. రూల్ ప్రకారం వెళ్లక తప్పదు: డుప్లెసిస్
ఐపీఎల్ 17వ సీజన్లో ఇంటిముఖం పట్టే తొలి జట్టుగా బెంగళూరు నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వరుసగా ఆరో ఓటమితో ప్లే ఆఫ్స్కు దాదాపు దూరమైనట్లే. -
యంగ్ ‘క్యాండిడేట్’గా గుకేశ్.. చరిత్ర సృష్టించిన చెస్ ప్లేయర్
భారత యువ చెస్ ప్లేయర్ గుకేశ్ మరో రికార్డు సృష్టించాడు. అత్యంత పిన్న వయసులోనే ‘క్యాండిడేట్స్’ విజేతగా నిలిచాడు. -
బెంగళూరు ఓటమి నం.7
బ్యాటర్ కర్ణ్ శర్మ, బౌలర్ స్టార్క్. 6 బంతుల్లో 21 పరుగులు కావాలి. ఆర్సీబీ పనైపోయిందనే అనుకున్నారంతా. కానీ అనూహ్యం.. నాలుగు బంతుల్లో మూడు సిక్సర్లు బాదేశాడు కర్ణ్. 2 బంతుల్లో 3 చేస్తే చాలు బెంగళూరుదే విజయం. -
143.. అయినా కష్టంగా!
ఓవైపు కొన్ని జట్లు సిక్సర్ల మోత మోగించేస్తూ 250 పైచిలుకు స్కోర్లు నమోదు చేస్తున్న ఈ ఐపీఎల్లో ఆదివారం పంజాబ్ కింగ్స్ ప్రత్యర్థికి 143 పరుగుల లక్ష్యమే నిర్దేశించింది. -
కోహ్లీకి కోపమొచ్చింది
కోల్కతాతో మ్యాచ్లో కోహ్లీకి కోపమొచ్చింది. ఆడిన ఆరు బంతుల్లోనే రెండు సిక్సర్లు, ఓ ఫోర్ కొట్టిన అతను ఛేదనలో దూకుడు ప్రదర్శించాడు. -
ఆర్సీబీ ఇంటికే!
ఐపీఎల్- 17వ సీజన్లో ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలవబోతున్నట్లే! 8 మ్యాచ్ల్లో ఓ విజయం, 7 ఓటములతో 2 పాయింట్లు మాత్రమే సాధించిన ఆ జట్టు.. పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. -
టైటిల్ దిశగా గుకేశ్
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో సంచలన ప్రదర్శనతో సాగిపోతున్న భారత యువ సంచలనం గుకేశ్ టైటిల్కు చేరువయ్యాడు. మరో రౌండ్ మాత్రమే మిగిలివున్న ఈ టోర్నీలో గ్రాండ్మాస్టర్ గుకేశ్ ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. -
తిరుగులేని వెర్స్టాపెన్
ఫార్ములావన్ స్టార్ రేసర్, డిఫెండింగ్ ఛాంపియన్ మ్యాక్స్ వెర్స్టాపెన్కు తిరుగులేదు. అద్భుత ప్రదర్శన కొనసాగుతున్న ఈ రెడ్బుల్ రేసర్ ఈ సీజన్లోనూ వరుస విజయాలు నమోదు చేస్తున్నాడు. -
ఒలింపిక్స్కు బల్రాజ్, అక్ష్దీప్, ప్రియాంక
ప్రపంచ ఆసియా ఓసియానియా ఒలింపిక్, పారాలింపిక్ అర్హత రెగెట్టా టోర్నీలో భారత రోయింగ్ ఆటగాడు బల్రాజ్ పన్వర్ సత్తాచాటాడు. దక్షిణ కొరియాలో జరుగుతున్న ఈ పోటీల్లో పురుషుల సింగిల్ స్కల్ 2000 మీటర్ల విభాగంలో బల్రాజ్ మూడో స్థానంలో నిలిచి పారిస్ ఒలింపిక్స్ బెర్తు దక్కించుకున్నాడు. -
పారాలింపిక్స్కు వెంకటనారాయణ
నంద్యాల జిల్లా ప్యాపిలి పట్టణానికి చెందిన రోయర్ కొంగనపల్లె వెంకటనారాయణ పారాలింపిక్స్కు అర్హత సాధించాడు. -
టెన్నిస్కు ముగురుజ వీడ్కోలు
రెండుసార్లు గ్రాండ్స్లామ్ ఛాంపియన్ గార్బైన్ ముగురుజ (స్పెయిన్) టెన్నిస్కు వీడ్కోలు పలికింది. ‘‘రిటైర్ కావడానికి ఇదే మంచి సమయమని భావిస్తున్నా. -
సంక్షిప్త వార్తలు(5)
బిష్కెక్ ప్రపంచ క్వాలిఫయర్స్లో భారత రెజ్లర్లు ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయకపోవడంతో టర్కీలో జరిగే ఆఖరి క్వాలిఫయర్స్ కోసం మరోసారి ట్రయల్స్ నిర్వహించి జట్టును ఎంపిక చేయాలని రెజ్లింగ్ సమాఖ్య యోచిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఐపీఎల్ పాయింట్లు పంచి పెడతాం అన్నట్లు ఉంది.. మాజీ క్రికెటర్ సెటైర్
-
విశాఖ - బెంగళూరు మధ్య 20 వేసవి ప్రత్యేక రైళ్లు.. శని, ఆదివారాల్లోనే..!
-
భావోద్వేగ మూల్యం చెల్లించుకున్నా - బాక్సర్ విజేందర్ సింగ్
-
ఘనంగా ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం.. వెంకయ్యనాయుడుకు ‘పద్మవిభూషణ్’ ప్రదానం
-
‘ఇలాంటి సీఎంను చూసి గర్విస్తున్నా’.. యోగిపై ప్రధాని ప్రశంసలు