Yoga: తొలి యోగాసన ప్రపంచ ఛాంపియన్షిప్.. ఎక్కడ? ఎప్పుడంటే?
యోగాని ప్రపంచానికి పరిచయం చేసిన భారత్.. తొలిసారిగా యోగాసన ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలను నిర్వహించనుంది. వచ్చే ఏడాది జూన్లో ఒడిశాలోని భువనేశ్వర్లో ఈ పోటీలను నిర్వహించనున్నట్లు ది నేషనల్ యోగాసన స్పోర్ట్స్ ఫెడరేషన్(ఎన్వైఎస్ఎఫ్) వెల్లడించింది ఈ యోగా పోటీల కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు
దిల్లీ: యోగాని ప్రపంచానికి పరిచయం చేసిన భారత్.. తొలిసారిగా యోగాసన ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలను నిర్వహించనుంది. వచ్చే ఏడాది జూన్లో ఒడిశాలోని భువనేశ్వర్లో ఈ పోటీలను నిర్వహించనున్నట్లు ది నేషనల్ యోగాసన స్పోర్ట్స్ ఫెడరేషన్(ఎన్వైఎస్ఎఫ్) వెల్లడించింది ఈ యోగా పోటీల కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది. ‘‘భారత్.. తొలిసారిగా ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ను నిర్వహించనుంది. జూన్ 2022లో జరగబోయే ఈ టోర్నీ భారతదేశ ప్రాచీన క్రీడను ప్రపంచానికి చూపించబోతుంది’’అని ఎన్వైఎస్ఎఫ్ అధ్యక్షుడు ఉదిత్ సేథ్ అన్నారు. యోగాసన పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్న ఒడిశా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ ఏడాది జరిగిన ఖేల్ ఇండియా యూత్ గేమ్స్లో యోగాను కూడా చేర్చిన విషయం తెలిసిందే. మహిళలు, పురుషులు రెండు విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఆ పోటీలు విజయవంతం కావడంతో ప్రత్యేకంగా యోగాసన పోటీల్ని అంతర్జాతీయంగా.. అన్ని కేటగిరిల్లో నిర్వహించేందుకు, ఈ క్రీడోత్సవానికి ఆర్థిక సాయం చేసేందుకు కేంద్రం సమ్మతించింది. ప్రపంచమంతా ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో జూన్లో యోగాసన ప్రపంచ ఛాంపియన్షిప్ నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయి. పోటీల్లో విజేతలను యోగా దినోత్సవం నాడు ప్రకటించే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.