IND vs AUS: ఆసీస్ను బెంబేలెత్తించిన బౌలర్లు.. భారత్ లక్ష్యం 189
తొలి వన్డే మ్యాచ్లో (IND vs AUS) భారత బౌలర్లు అదరగొట్టేశారు. ఆసీస్ను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. షమీ, సిరాజ్ కీలక వికెట్లను తీసి ఆసీస్ను దెబ్బ కొట్టారు.
ఇంటర్నెట్ డెస్క్: సుదీర్ఘ టెస్టు సిరీస్ అనంతరం జరుగుతున్న వన్డే సిరీస్లోనూ భారత బౌలర్లు అదరగొట్టారు. ముంబయి వేదికగా జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్లో ఆసీస్ను 188 పరుగులకే ఆలౌట్ చేశారు. మహమ్మద్ షమీ (3/17), సిరాజ్ (3/29) చెలరేగగా.. జడేజా 2, హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ తీశారు. టాస్ నెగ్గి భారత కెప్టెన్ హార్దిక్ పాండ్య బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్కు సహకరించినట్లు అనిపించిన పిచ్.. మ్యాచ్ జరిగే కొద్దీ బౌలింగ్కు అనుకూలంగా మారింది.
మిచెల్ ఒక్కడే..
బౌలింగ్ ప్రారంభించిన భారత్కు రెండో ఓవర్లోనే వికెట్ దక్కింది. అయితే ఆసీస్ కెప్టెన్ స్టీవ్స్మిత్ (22)తో కలిసి మిచెల్ మార్ష్ (81) దూకుడుగా ఆడాడు. వీరిద్దరూ రెండో వికెట్కు 72 పరుగులు జోడించారు. స్మిత్ ఔటైనప్పటికీ.. లబుషేన్ (15), జోష్ ఇంగ్లిస్ (26)తో కలిసి మార్ష్ ఇన్నింగ్స్ను నడిపించాడు.
అయితే 128/2 స్కోరుతో ఉన్న ఆసీస్.. భారత బౌలర్ల దెబ్బకు 60 పరుగులకే చివరి ఎనిమిది వికెట్లను కోల్పోవడం విశేషం. సిరాజ్, షమీ తమ రెండో స్పెల్లో నిలకడగా వికెట్లు తీసి ఆసీస్పై ఒత్తిడి పెంచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.