IND vs SA : బవుమా, డస్సెన్‌ అద్భుత శతకాలు.. భారత్‌కు భారీ లక్ష్యం

పార్ల్‌ వేదికగా జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో భారత్‌కు దక్షిణాఫ్రికా ..

Published : 19 Jan 2022 18:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దక్షిణాఫ్రికాలోని పార్ల్‌ వేదికగా జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో భారత్‌కు దక్షిణాఫ్రికా 297 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. కెప్టెన్‌ బవుమా (110: 8 ఫోర్లు), మిడిలార్డర్‌ బ్యాటర్‌ డస్సెన్ (129*: 9 ఫోర్లు, 4 సిక్సర్లు) ధాటిగా ఆడటంతో సౌతాఫ్రికా 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. ఓపెనర్లు డికాక్ (27) ఫర్వాలేదనిపించగా.. మలన్ (6), మార్‌క్రమ్ (4) విఫలమయ్యారు. అయితే స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు పడినా.. బవుమా, డస్సెన్ మాత్రం స్కోరు బోర్డును నడిపించారు. ఈ క్రమంలో ఇద్దరూ శతకాలు చేసేశారు. నాలుగో వికెట్‌కు 204 పరుగులను జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. భారత బౌలర్లు ఎంత శ్రమించినా.. ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడారు. టీమ్‌ఇండియా బౌలర్లలో బుమ్రా 2, అశ్విన్‌ ఒక వికెట్ తీశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని