IPL 2021: గర్జించిన గబ్బర్.. దుమ్మురేపిన డుప్లెసిస్..
క్రికెట్ ప్రేమికులకు ఎంతో ఇష్టమైన ఐపీఎల్ పండగ మళ్లీ వచ్చేసింది. యూఏఈ వేదికగా ఆదివారం ఐపీఎల్-14 సీజన్ రెండో దశ ప్రారంభంకానుంది.తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడబోతున్నాయి. ఇదిలా ఉండగా, ఈ సీజన్ మొదటి
తొలి దశలో పరుగుల వరద పారించిన ఆటగాళ్లు వీరే..
ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్ ప్రేమికులకు ఎంతో ఇష్టమైన ఐపీఎల్ పండగ మళ్లీ వచ్చేసింది. యూఏఈ వేదికగా ఆదివారం ఐపీఎల్-14 సీజన్ రెండో దశ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడబోతున్నాయి. ఇప్పటికే ఈ సీజన్ మొదటి దశలో చాలా మ్యాచ్లు హోరాహోరీగా జరిగాయి. కొంతమంది ఆటగాళ్లు ఫోర్లు, సిక్స్లు అలవోకగా బాదుతూ పరుగుల వరద పారించారు. మరి ఆ ఆటగాళ్లు ఎవరో ఓ లుక్కేద్దాం.
గర్జించిన గబ్బర్సింగ్: భారత క్రికెటర్లలో ‘గబ్బర్ సింగ్’ అనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు శిఖర్ ధావన్. ఈ ఐపీఎల్ సీజన్లో దిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న గబ్బర్.. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఎనిమిది మ్యాచ్ల్లో 54.28 సగటుతో 380 పరుగులు చేసి ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అంతేకాదు అత్యధిక ఫోర్లు (43) బాదిన ఆటగాడిగానూ నిలిచాడు. అత్యధికంగా 92 పరుగులు వ్యక్తిగత స్కోరు సాధించాడు. మరి మొదటి దశలో గర్జించిన గబ్బర్.. రెండో దశలో ఎలా ఆడతాడోనని అతడి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కేఎల్ కమాల్: ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో పంజాబ్ కింగ్స్ జట్టు అంతగా రాణించలేదు. ఎనిమిది మ్యాచ్లు ఆడి మూడింటిలో మాత్రమే నెగ్గింది. ఈ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ మాత్రం మంచి ప్రదర్శన కనబరిచాడు. ఇప్పటివరకు ఏడు మ్యాచ్లు ఆడిన కేఎల్.. 66.20 సగటుతో 331 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. అత్యధిక సిక్సర్లు (16) బాదిన ఆటగాడు కూడా కేఎల్ రాహులే. నాలుగు అర్ధ శతకాలు కూడా బాదాడు. రెండో దశలోనూ రాహుల్ ఇదే జోరు కొనసాగించి జట్టును విజయాల బాట పట్టించాలని పంజాబ్ కింగ్స్ అభిమానులు కోరుకుంటున్నారు.
దుమ్మురేపిన డుప్లెసిస్: చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు డుప్లెసిస్ ఈ సీజన్లో దుమ్మురేపాడు. ప్రతి మ్యాచ్లోనూ నిలకడగా పరుగులు చేస్తూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఇప్పటివరకు ఏడు మ్యాచులు ఆడిన డుప్లెసిస్..64.00 సగటుతో 320 పరుగులు చేశాడు. అత్యధికంగా 95 పరుగుల వ్యక్తిగత స్కోరును సాధించాడు. సీఎస్కేకు కీలకమైన ఈ ఆటగాడు రెండో దశలో కొన్ని మ్యాచ్లకు దూరమయ్యే అవకాశం ఉంది. ఇటీవల ముగిసిన కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో ఓ జట్టుతో మ్యాచ్ ఆడుతున్నప్పుడు డుప్లెసిస్కు గాయమైంది. ఇతడు గాయం నుంచి త్వరగా కోలుకుని మ్యాచ్లు ఆడాలని సీఎస్కే అభిమానులు కోరుకుంటున్నారు.
పృథ్వీ ‘షో’: టీమ్ఇండియా యువ ఆటగాడు పృథ్వీ షా.. ఐపీఎల్లో దిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్లు ఆడిన పృథ్వీ.. 38.50 సగటుతో 308 పరుగులు సాధించాడు. ఓపెనర్గా బరిలోకి దిగే ఈ యువ బ్యాట్స్మన్.. జట్టు మంచి ఆరంభాలు అందించాడు. కోల్కతాతో జరిగిన మ్యాచ్లో ఒకే ఓవర్లో ఆరు ఫోర్లు బాది అందరి దృష్టినీ ఆకర్షించాడు. మరి రెండో దశలోనూ పృథ్వీ.. ఇదే జోరును కొనసాగిస్తాడో లేదో చూడాలి.
శాంసన్ మెరుపులు: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్.. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో మంచి ప్రదర్శన కనబరిచాడు. ఏడు మ్యాచ్లు ఆడిన సంజూ.. 46.16 సగటు, 145.78 స్ట్రైక్ రేట్తో 277 పరుగులు సాధించాడు. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 54 బంతుల్లో మూడంకెల స్కోరును అందుకున్నాడు. ఈ మ్యాచ్లో 63 బంతులను ఎదుర్కొని 119 పరుగులు చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్