IND vs SL : లంకతో తొలి టెస్టు.. టీమ్ఇండియాకు జట్టు కూర్పే అసలైన సవాల్
శ్రీలంకతో స్వదేశంలో టెస్టు సిరీస్కు టీమ్ఇండియా సన్నద్ధమవుతోంది. వన్డేలు, టీ20 మ్యాచ్లతో...
శ్రీలంకతో నేటి నుంచి తొలి టెస్టు ప్రారంభం
ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంకతో స్వదేశంలో టెస్టు సిరీస్కు టీమ్ఇండియా సన్నద్ధమవుతోంది. వన్డేలు, టీ20 మ్యాచ్లతో బిజీగా గడిపిన భారత ఆటగాళ్లు సుదీర్ఘ ఫార్మాట్లోనూ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. శుక్రవారం (మార్చి 4) నుంచి మొహాలీ వేదికగా తొలిపోరు ప్రారంభం కానుంది. ఈ క్రమంలో జట్టు కూర్పు ఎలా ఉండనుందో అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఓపెనింగ్ జోడీ.. మిడిలార్డర్లో ఆదుకునే బ్యాటర్లు.. బౌలర్లు ఎవరనే విషయాలను అంచనా వేద్దాం..
మిడిలార్డరే కీలకం
గత దశాబ్దకాలంగా ఓపెనర్లు మారుతున్నారేమో కానీ.. మిడిలార్డర్లో మాత్రం వారిద్దరే కీలకం. ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా.. ఆ ‘ఇద్దరు’ ఎవరనేది.. ఛెతేశ్వర్ పుజారా, అజింక్య రహానె. వీరి ఇద్దరికి ముందు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. తర్వాత రిషభ్ పంత్, అశ్విన్, రవీంద్ర జడేజా ఇన్నింగ్స్ను నిలబెడుతూ వచ్చారు. అయితే గత రెండేళ్ల నుంచి ఫామ్తో తంటాలుపడుతున్న పుజారా, రహానెలకు శ్రీలంకతో టెస్టు సిరీస్కు జట్టులో స్థానం దక్కలేదు. వీరి స్థానంలో కుర్రాళ్లు మయాంక్ అగర్వాల్, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్,హనుమ విహారిలకు అవకాశం కల్పించింది. కెరీర్లో ఆడిన తొలి టెస్టులోనే శతకం, హాఫ్ సెంచరీలతో చెలరేగిన శ్రేయస్ తన స్థానాన్ని పదిలం చేసుకోవాలని ఆశిస్తున్నాడు. దక్షిణాఫ్రికా సిరీస్లో తనకొచ్చిన ఛాన్స్ విహారి పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. మరి ఈసారి ఎలా రాణిస్తాడో చూడాలి.
ఓపెనర్లుగా ఎవరు వస్తారో..?
ప్రస్తుత టీమ్ఇండియా జట్టులో ఓపెనర్లకు కొదవలేదు. మయాంక్ అగర్వాల్, శుభ్మన్ గిల్తోపాటు ఫస్ట్క్లాస్ క్రికెట్లో అదరగొట్టిన ప్రియాంక్ పంచాల్ సిద్ధంగా ఉన్నారు. అయితే టీమ్ఇండియా సారథి రోహిత్ శర్మ కూడా ఓపెనింగ్ చేయగలడు. ఈ క్రమంలో ఓపెనర్లుగా జట్టు యాజమాన్యం ఎవరిని పంపిస్తుందో కూడా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఓ వైపు మయాంక్ అగర్వాల్ మాత్రం పక్కాగా కనిపిస్తుండగా.. మరొక ఓపెనర్ ఎవరనేది తేలాల్సి ఉంది. తుది జట్టులో ఆరు బ్యాటర్లు, ఐదుగురు బౌలర్లతో దిగాలనుకుంటే ప్రియాంక్ పంచాల్, హనుమ విహారి, శుభమన్ గిల్, కేఎస్ భరత్లలో ఒకరికి మాత్రమే అవకాశం దక్కుతుంది. హనుమ విహారి/శుభ్మన్ని తీసుకుంటే మిడిలార్డర్లో అక్కరకొస్తారు. అప్పుడు మయాంక్తోపాటు రోహిత్ శర్మ ఇన్నింగ్స్ను ప్రారంభించే అవకాశం లేకపోలేదు. ఇక వందో టెస్టు మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లీ వన్డౌన్లో..తర్వాత శ్రేయస్ అయ్యర్, విహారి/గిల్, రిషభ్ పంత్ ఉండనే ఉన్నారు.
బౌలర్లు ఐదుగురా.. ఆరుగురా..?
గతంలో స్వదేశం వేదికగా భారత్ సిరీస్లను ఆడేటప్పుడు స్పిన్నర్లకు అధిక ప్రాధాన్యమిచ్చేది. అయితే ఇప్పుడు స్పిన్న్తోపాటు ఫాస్ట్ బౌలింగ్ పిచ్లనూ రూపొందిస్తూ ప్రత్యర్థులకు సవాల్ విసురుతోంది. ఎందుకంటే ఇప్పుడు నాణ్యమైన పేసర్లు భారత్ సొంతం. ఐదుగురు బౌలర్లలో ముగ్గురు స్పిన్నర్లు - ఇద్దరు ఫాస్ట్బౌలర్లు లేదా.. ఇద్దరు స్పిన్నర్లు-ముగ్గురు ఫాస్ట్బౌలర్లతో టీమ్ఇండియా బరిలోకి దిగడంపైనా జట్టు యాజమాన్యం ఆలోచించే అవకాశం ఉంది. భారత జట్టుకు అసలైన ఇద్దరు టాప్ స్పిన్నర్లు అయిన రవీంద్ర జడేజా, రవి చంద్రన్ అశ్విన్ బ్యాటింగ్ చేయగలిగే సమర్థులు. అందుకే ఇద్దరు స్పిన్నర్లతో ఆడేటప్పుడు ప్రత్యేకంగా ఎవరినీ తీసుకోనక్కర్లేదు. అప్పుడు ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు బుమ్రా, సిరాజ్, షమీకి తుది జట్టులో స్థానం కల్పించొచ్చు. అశ్విన్ ఫిట్నెస్ సాధించకపోతే.. ముగ్గురు స్పిన్నర్లను తీసుకోవాలంటే మాత్రం చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ వైపు మొగ్గు చూపే అవకాశం లేకపోలేదు. అప్పుడు షమీ/సిరాజ్లలో ఒకరిని తప్పించాల్సి ఉంటుంది.
లంకతో టెస్టులకు టీమ్ఇండియా:
రోహిత్ శర్మ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ప్రియాంక్ పంచాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహరి, శుభమన్ గిల్, రిషభ్ పంత్ (వికెట్కీపర్), కేఎస్ భరత్, అశ్విన్, రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, బుమ్రా (వైస్ కెప్టెన్), షమి, సిరాజ్, ఉమేశ్ యాదవ్, సౌరభ్ కుమార్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి.
తాజా వార్తలు (Latest News)
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్