Football Match: ఫుట్బాల్ మ్యాచ్లో తొలిసారి వైట్కార్డ్.. దేనికి సంకేతం?
ఫుట్బాల్ ఆటలో ఇప్పటిదాకా ఎల్లో, రెడ్ కార్డులను మాత్రమే చూసిన ప్రేక్షకులు.. తొలిసారి రిఫరీ వైట్ కార్డును చూపించడంతో ఫుట్బాల్ అభిమానుల్లో చర్చ మొదలైంది. ఇంతకీ ఫుట్బాల్ ఆటలో వైట్ కార్డును దేనికి సంకేతంగా చూపిస్తారో తెలుసా..?
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ఆదరణ కలిగిన ఆటల్లో ఫుట్బాల్ (Football) ముందు వరుసలో ఉంటుంది. సాధారణంగా ఫుట్బాల్లో ఎవరైనా ఆటగాడు తప్పుచేస్తే ఎల్లో (Yellow Card) లేదా రెడ్ కార్డు (Red Card)లను రిఫరీ చూపిస్తారు. ఆటగాళ్లు ఏదైనా తప్పు చేస్తే తొలిసారి హెచ్చరికగా ఎల్లో కార్డును, ఆట నిబంధనలను విరుద్ధంగా ప్రవర్తించినందుకు ఆటగాడిని బయటికి వెళ్లమని సూచిస్తూ రెడ్ కార్డును రిఫరీ ఉపయోగిస్తారు. తాజాగా జరిగిన ఓ ఫుట్బాల్ మ్యాచ్లో రిఫరీ వైట్ ( White Card) కార్డును ఉపయోగించడం చర్చనీయాంశమైంది. 1970లో ప్రారంభమైన ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup)లో ఈ కార్డుల నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎల్లో, రెడ్ కార్డులను మాత్రమే ప్రేక్షకులు ఎక్కువగా చూశారు. కానీ, తొలిసారి వైట్ కార్డు చూపించడంతో ఫుట్బాల్ అభిమానుల్లో చర్చ మొదలైంది. ఇంతకీ ఫుట్బాల్ ఆటలో వైట్ కార్డును దేనికి సంకేతంగా చూపిస్తారో తెలుసుకుందాం.
బెన్ఫికా, స్పోర్టింగ్ లిస్బన్ జట్ల మధ్య జరుగుతున్న మహిళల క్వార్టర్ ఫైనల్ మ్యాచ్కు పోర్చుగల్కు చెందిన కాట్రినా కంపోస్ రిఫరీగా వ్యవహరిస్తున్నారు. ఈ మ్యాచ్లో బెనిఫికా 3-0 ఆధిక్యంగా కొనసాగుతుండగా ప్రేక్షకుల మధ్యలో ఓ వ్యక్తి ఆకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడు. అతనికి వైద్య సహాయం అందించేందుకు రెండు జట్లకు చెందిన వైద్యులు స్టాండ్స్లోకి చేరుకుని చికిత్స అందిస్తారు. వైద్యుల సేవలకు అభినందనగా రిఫరీ వైట్ కార్డును చూపించారు. ఇరు జట్ల బృందాలు ప్రదర్శించిన క్రీడాస్ఫూర్తికి నిదర్శనంగా రిఫరీ వైట్ కార్డును చూపించారు.
ఫుట్బాల్ ఆటలో వైట్ కార్డును పోర్చుగల్ నేషనల్ ప్లాన్ ఫర్ ఎథిక్స్ ఇన్ స్పోర్ట్స్ (PNED) ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. ఆటలో ఇరు జట్ల ఆటగాళ్లు లేదా సిబ్బంది క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తే వారికి అభినందగా రిఫరీ వైట్ కార్డును చూపించవచ్చు. దాంతోపాటు ఆటగాడు గాయపడితే కంకషన్ ప్లేయర్ వచ్చేందుకు వైట్కార్డ్ ఉపయోగించవచ్చు. ప్రస్తుతం ఈ నిబంధనను పోర్చుగీస్ ఫుట్బాల్ ఫెడరేషన్ ( FPF) ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు. త్వరలోనే అంతర్జాతీయ ఆటలో సైతం దీన్ని ప్రవేశపెట్టనున్నారు. అయితే, ఈ మ్యాచ్లో బెన్ఫికా జట్టు స్పోర్టింగ్ లిస్బన్పై 5-0 తేడాతో విజయం సాధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
ఎప్పుడూ కూల్గా కనిపించే ఎంఎస్ ధోనీ (MS Dhoni) గురించి ఎవరికీ తెలియని ఓ విషయాన్ని సురేశ్ రైనా ఇటీవల బయటపెట్టాడు. -
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టే ఆలోచన లేదని వెస్టిండీస్ మాజీ ఆటగాడు సునీల్ నరైన్ (Sunil Narine) అన్నాడు. -
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
ముంబయి ఇండియన్స్ గురించి భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు ఇప్పటికీ రోహిత్ శర్మ (Rohit Sharma)నే కెప్టెన్గా భావిస్తున్నారని వ్యాఖ్యానించాడు. -
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్లో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఎవరైతే బాగుంటారు. -
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. -
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?