Womens IPL: మహిళల ఐపీఎల్.. 25న ఐదు ఫ్రాంచైజీల పేర్లు వెల్లడి!
మహిళల ఐపీఎల్ (ipl 2023) కోసం బీసీసీఐ కీలక చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఫ్రాంచైజీల కోసం బిడ్డింగ్లను ఆహ్వానించిన బీసీసీఐ (bcci) మరో ముందుడగు వేసింది. ఫ్రాంచైజీల పేర్లను వెల్లడించేందుకు సిద్ధమవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: మహిళల ఐపీఎల్ (womens ipl 2023) కోసం బీసీసీఐ (bcci) ముమ్మరంగా చర్యలు చేపట్టింది. ఐపీఎల్లో పాల్గొనే ఐదు ఫ్రాంచైజీలను జనవరి 25న బీసీసీఐ ఎంపిక చేయనుంది. ఫ్రాంచైజీలకు సంబంధించిన ఆర్థిక బిడ్లను ఇప్పటికే బీసీసీఐ సీల్ చేసింది. అదే రోజు వీటిని తెరవనుంది. అయితే బీసీసీఐ ‘‘అత్యున్నత ద్రవ్య ప్రతిపాదనను అంగీకరించాల్సిన అవసరం లేదు’’ అని టెండర్ పత్రంలో తెలిపింది. డబ్ల్యూఐపీఎల్(WIPL) ఐదు ఫ్రాంచైజీలను, వేదికలను సొంతం చేసుకోవడానికి బీసీసీఐ గతవారం బిడ్లను ఆహ్వానిస్తూ టెండర్ విడుదల చేసింది. బిడ్డర్లు ఒకటి కంటే ఎక్కువ ఫ్రాంచైజీలకు, నగరాలకు పోటీ పడవచ్చు. కానీ అంతిమంగా విజయవంతమైన బిడ్డర్కు ఒక ఫ్రాంచైజీ మాత్రమే దక్కుతుంది.
ఒకే వేదిక కోసం రెండు అత్యధిక బిడ్లు ఒకే ధర నిర్ణయిస్తే బీసీసీఐ మళ్లీ బిడ్ నిర్వహిస్తుంది. రెండు వేదికలకు ఇద్దరు బిడ్డర్లు అత్యధిక ధరతో బిడ్ వేస్తే ఆ ఉత్తర్వులను నిర్ణయించే విచక్షణాధికారం బీసీసీఐకి ఉంటుంది. ఒక బిడ్డర్ ఒకటి కంటే ఎక్కువ వేదికలకు ఎక్కువ మొత్తంతో బిడ్ వేస్తే వేదికను నిర్ణయించే స్వేచ్ఛ బీసీసీఐకి ఉంటుంది.
2023 నుంచి 2025 వరకు మూడు సీజన్లలో ఒక్కో జట్టుకు 22 మ్యాచ్లు నిర్వహించే అవకాశం ఉంది. లీగ్ దశలో ఒక్కో టీమ్ 20 మ్యాచులు ఆడనుంది. అగ్రస్థానంలో ఉండే జట్టు నేరుగా ఫైనల్కి వెళ్తుంది. రెండు, మూడు స్థానాల్లో ఉండే జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడతాయి. అందులో విజయం సాధించిన జట్టు తుది పోరుకు అర్హత సాధిస్తుంది. మహిళల ఐపీఎల్ నిర్వహణకు మార్చి నెల అనువుగా ఉంటుందని బీసీసీఐ తెలిపింది. 2026 సీజన్ నుంచి టోర్నమెంట్లో 33 నుంచి 34 మ్యాచులు నిర్వహిస్తారని సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.