షాక్: ఐసోలేషన్కు ఐదుగురు టీమ్ ఇండియా క్రికెటర్లు
టీమ్ఇండియాకు చెందిన ఐదుగురు క్రికెటర్లను ఐసోలేషన్కు పంపించారు. మెల్బోర్న్లోని ఓ హోటల్లో కలిసి భోజనం చేయడంతో ఇతర క్రికెటర్లతో వారిని దూరంగా ఉంచినట్టు తెలిసింది. పైగా వారు బయోబుడగ నిబంధనలు ఉల్లంఘించారో లేదో క్రికెట్ ఆస్ట్రేలియా, బీసీసీఐ సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నట్టు...
బుడగ నిబంధనల ఉల్లంఘనపై బీసీసీఐ, సీఏ దర్యాప్తు
మెల్బోర్న్: టీమ్ఇండియాకు చెందిన ఐదుగురు క్రికెటర్లను ఐసోలేషన్కు పంపించారు. మెల్బోర్న్లోని ఓ హోటల్లో కలిసి భోజనం చేయడంతో ఇతర క్రికెటర్లతో వారిని దూరంగా ఉంచినట్టు తెలిసింది. పైగా వారు బయోబుడగ నిబంధనలు ఉల్లంఘించారో లేదో క్రికెట్ ఆస్ట్రేలియా, బీసీసీఐ సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.
నూతన సంవత్సరం సందర్భంగా రోహిత్ శర్మ, రిషభ్ పంత్, శుభ్మన్ గిల్, పృథ్వీషా, నవదీప్ సైని మెల్బోర్న్లోని ఓ హోటల్కు వెళ్లి భోజనం చేశారు. అక్కడే ఉన్న భారత అభిమాని ఒకరు వీరి చిత్రాలు, వీడియోలను తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. వారి బిల్లు కట్టడమే కాకుండా పంత్ను కౌగిలించుకున్నానని వ్యాఖ్యానించాడు. ఇది వివాదాస్పదం కావడంతో ఆ అభిమాని క్షమాపణలు కోరాడు. తన డబ్బులను రోహిత్ శర్మ చెల్లించాడని తెలిపాడు.
‘ఐదుగురు ఆటగాళ్లను భారత్, ఆస్ట్రేలియా జట్ల నుంచి వేరు చేశాం. అయితే కొవిడ్-19 నిబంధనలను అనుసరించి వారు సాధన చేస్తారు. భారత, ఆసీస్ జట్లలోని మిగతా ఆటగాళ్ల భద్రతను దృష్టిలో పెట్టుకొనే ఇలా చేశాం’ అని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. ‘వారు బయటకు వెళ్లినప్పుడు బయోబుడగ నిబంధనల ఉల్లంఘన జరిగిందో లేదో తెలుసుకొనేందుకు బీసీసీఐ, సీఏ దర్యాప్తు చేపట్టాయి. టెస్టు సిరీసు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే ఐదుగురిని విడదీశాం’ అని వెల్లడించింది.
ప్రస్తుతం బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భారత్, ఆస్ట్రేలియా చెరో మ్యాచ్ గెలిచాయి. సిరీసు 1-1తో సమం కావడంతో సిడ్నీలో జరిగే మూడో టెస్టుపై అందరి దృష్టి నెలకొంది. మెల్బోర్న్తో పోలిస్తే సిడ్నీ నగరంలో కొవిడ్ కేసుల ఉద్ధృతి ఎక్కువగా ఉంది. దాంతో ఆ నగరంలో ఆంక్షలు ఎక్కవగా ఉన్నాయి. కానీ మెల్బోర్న్కు సంబంధించినంత వరకు ఆటగాళ్లు బయటకు వెళ్లి ఆహారం తీసుకోవచ్చు. అయితే ఇండోర్లో కాకుండా ఔట్డోర్లో మాత్రమే ఆహార పదార్థాలు భుజించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ విషయంలో స్పష్టత లేదు.
ఇవీ చదవండి
దాదాకు గుండెపోటు
అభిమాని సర్ప్రైజ్: బాగోదన్న రోహిత్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. -
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
క్షమాపణలు యాడ్ సైజ్లోనే ప్రచురించారా? పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!