T20 Worldcup : ప్రపంచకప్లో టీమిండియా ఓటమికి 5 కారణాలివేనా!
మొన్నటివరకు సూపర్ స్టార్లు... ఇప్పుడు డీలా స్టార్లు అవ్వడానికి కారణాలు ఇవేనా
ఒక కట్టెను చేత్తో విరగ్గొట్టొచ్చు... అదే పది కట్టెల్ని మోపుగా కడితే విరచడం కష్టం! ఇది మన చిన్నతనం నుంచి పెద్దలు చెబుతున్న మాట.
ఇప్పుడు దీనిని క్రికెట్లో టీమిండియాకు అన్వయిస్తే... ఒక కట్టెను విరగొట్టలేం... అదే పది కట్టెల్ని కలిపి ఇస్తే ఎంచక్కా విరిచేయొచ్చు!
టీ20 ప్రపంచకప్లో భారత జట్టు ప్రదర్శన చూస్తే... ఎవరన్నా ఈ మాటే చెబుతారు. మొన్నటివరకు ఒక్కొక్కరు ఐపీఎల్లో ఆడి సూపర్ అనిపించుకున్నారు. ఇప్పుడు కలసి టీ20 ప్రపంచకప్ ఆడి ఉసూరుమనిపిస్తున్నారు. భారత్ దారుణ పరాజయాలకు కారణాలేంటి అని ఆలోచిస్తే... ఓ ఐదు బలంగా కనిపిస్తున్నాయి!
1. వాళ్లు ఆడతారులే
టీ20 ప్రపంచకప్ ముందు భారత జట్టులోని ఆటగాళ్లంతా అక్కడే ఉండి ఐపీఎల్ ఆడారు. వందల సంఖ్యలో పరుగులు చేసి, తామెందుకు మేటి క్రికెటర్లో చూపించారు. విరాట్ కోహ్లీ (405), రోహిత్ శర్మ (381), కేఎల్ రాహుల్ (626), సూర్య కుమార్ యాదవ్ (317), రిషబ్ పంత్ (419), ఇషాన్ కిషన్ (241), రవీంద్ర జడేజా (227) పరుగుల వరద పారించారు. అయితే వీరంతా కలిపి జట్టుగా ఆడుతున్నప్పుడు వెనకాల వచ్చేవాళ్లు ఆడతారులే... అనేలా బ్యాట్లకు రెస్ట్ ఇచ్చారు అనొచ్చు. పాకిస్థాన్తో మ్యాచ్లో కోహ్లీ (57), పంత్ (39) రాణించినా జట్టుకు అవసరమైనన్ని కావు. ఇక న్యూజిలాండ్తో మ్యాచ్లో టాప్ ఆర్డర్ పరుగుల గురించి చర్చే అనవసరం. హార్దిక్ పాండ్య (23), రవీంద్ర జడేజా (26)లేకపోతే మన జట్టు స్కోరు బోర్డు 100 దాటేది కాదు.
క్రికెట్ అనేది టీమ్ గేమ్ అని అందరూ చెబుతారు. మన స్టార్ క్రికెటర్లు దాన్ని వేరేలా అర్థం చేసుకున్నారేమో. ఎవరికి వారు, చెత్త షాట్లు కొట్టి మరీ ఔటయ్యారు. ఈ మాట కెప్టెన్ విరాట్ కోహ్లీనే అంటున్నాడు. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. మొన్నటి వరకు పరుగుల వరద పారించిన మన స్టార్లు మసకబారి నిస్తేజంగా డగౌట్లకు వచ్చేస్తున్నారు. పట్టుమని పాతిక బంతులు ఎదుర్కోవడం లేదంటేనే పరిస్థితి తెలుసుకోవచ్చు. ఓపెనింగ్ జోడీ కుదురుకోకపోవడంతో మిడిలార్డర్ మీద ఒత్తిడి పడుతోంది. అక్కడ అంతటి ఘనుడు లేకపోవడం పెద్ద లోటు. ఇక ఆల్రౌండర్ పాండ్య ముచ్చట పాతదే.
2. బౌలింగ్లోనూ అంతే
ఈ ప్రపంచకప్లో తొలి రెండు మ్యాచ్ల్లో భారత ఓటమికి కారణం బ్యాటర్ల మీద నెట్టేయడం కనిపిస్తోంది. అయితే మొత్తం తప్పు వారిదేనా అంటే కాదని అంటున్నారు క్రికెట్ పండితులు. దీనికి ఉదాహరణకు పాకిస్థాన్ మ్యాచ్లో మన వాళ్ల బౌలింగ్ తీరు ఉదహరిస్తున్నారు. ఒక్కటంటే ఒక్క వికెట్ తీయలేకపోవడం మన బౌలర్ల అప్రోచ్ సరిగా లేదు అనడానికి నిదర్శనం అని చెబుతున్నారు. ఇక రెండో మ్యాచ్ న్యూజిలాండ్తో జరిగినప్పుడు ఒక్క బుమ్రాలోనే వికెట్లు తీయాలనే జీల్ కనిపించింది. మిగిలిన వారి విషయంలో అలాంటి దృక్పథమే లేదు అంటున్నారు నెటిజన్లు.
ఈ టోర్నీలో భారత తురుపుముక్క అని అందరూ భావించిన వరుణ్ చక్రవర్తి ఆశించిన మేర ప్రదర్శన ఇవ్వడం లేదు. పరుగుల వరదను నియంత్రిస్తున్నా... మిస్టరీ స్పిన్నర్ అనే పేరును సార్థకం చేసుకునేలా విచిత్ర బంతులు వేసి వికెట్లు తీయలేకపోతున్నాడు. రవీంద్ర జడేజా పరిస్థితీ ఇంతే. ఏమాత్రం వికెట్లు తీసే బంతులు అతని నుంచి కనిపించలేదు. ఇక పేసర్ల సంగతి చూస్తే... మహ్మద్ షమీ దారుణంగా విఫలమవుతున్నాడు. భువనేశ్వర్ పూర్తిగా పట్టుతప్పిపోయాడు. పాకిస్థాన్ మ్యాచ్లో బుమ్రా అస్సలు స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వనేలేదు. శార్దూల్ ఠాకూర్ కివీస్ మ్యాచ్లో తన ప్రదర్శనతో వాళ్లకు విజయం వేగవంతం చేశాడని అభిమానులు తిట్టిపోస్తున్నారు.
3. ముందే కాడి వదిలేశాడా
టీమిండియాలో కింగ్, రన్ మెషీన్, ఛేజింగ్ స్టార్ అంటూ విరాట్ కోహ్లీకి చాలా పేర్లు ఉన్నాయి. మనకు చాలా ఏళ్లుగా వీలు కాని విదేశీ టూర్ల విజయాలు అందించిన కెప్టెన్సీ అతనిది. అయితే గత కొన్ని నెలలుగా పరిస్థితులు మారిపోయాయి. లక్ష్యాలను ఛేదించడంలో కోహ్లీ ఏ మాత్రం పరుగులు చేయలేకపోతున్నాడు. తన బ్యాటింగ్లో పట్టు తగ్గిందనే విషయం అతనికీ తెలిసి... ప్రపంచకప్ తర్వాత కెప్టెన్సీ వదులుకుంటా అని ప్రకటించేశాడు. దీంతో ఈ సారి కసిగా ఆడి కప్ తెస్తాడేమో అనుకున్నారంతా. కానీ పరిస్థితి చూస్తుంటే ముందే కాడి వదిలేశాడా అనిపిస్తోంది. తక్కువ స్కోరు ఛేజింగ్ మ్యాచ్ల్లో కోహ్లీ ఉంటే ఆ జోష్ వేరే ఉంటుంది. కానీ ప్రపంచకప్లో అది మిస్ అయ్యింది.
4. అలసట నిజమేనా...
ఐసీసీ టోర్నీల్లో భారత జట్టు ఘోర పరాజయానికి అలసట కారణమవ్వొచ్చు అని అక్కడక్కడా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దానికి కారణం ఐపీఎల్ అనే మాటలూ వినొచ్చు. అయితే ఇది నిజమేనా... అలసట కారణంతోనే మన వాళ్లు మ్యాచ్లు సరిగ్గా ఆడటం లేదా అంటే... ఈ కారణం సరికాదనే చెప్పాలి. ఎందుకంటే ఐపీఎల్ సమయంలో కుటుంబానికి దూరంగా ఉండకుండా మొత్తం ఫ్యామిలీనే అక్కడికే తీసుకెళ్లిపోయారు. కాబట్టి వాళ్లకు హోం సిక్ లాంటివి కష్టమే. అలాగే ఇంతటి అలసట ఉంటే ఐపీఎల్ మ్యాచ్లు ఎలా ఆడినట్లు.
ఒకవేళ కొంతమంది అంటున్నట్లు అలసటే కారణం అనుకుంటే... బీసీసీఐ ఏం చేస్తున్నట్లు. టీమిండియా స్టార్ ఆటగాళ్లకు సరైన విశ్రాంతి ఉండేలా చర్యలు తీసుకుంటూ ఐపీఎల్ నిర్వహించాలి. ఐపీఎల్ కోసం ఏకంగా ఐసీసీ టోర్నీలను పణంగా పెట్టలేం కదా. కానీ గత కొన్నేళ్లుగా ఇలానే జరుగుతోంది. అయినా ఐపీఎల్ స్టైల్, టైమ్ మారడం లేదు. దీంతో ఒకవేళ అలసట, బయోబబుల్ కష్టాలు అనేది నిజమే అయితే... బీసీసీఐ దీనిపై సీరియస్గా ఆలోచించాలి. ఎందుకంటే బయోబబుల్ ఇంత త్వరగా క్రికెట్ను వదిలి పెట్టి వెళ్లేలా లేదు.
5. తప్పులు తెలుసుకోకపోవడం
జట్టుగా ఆడటం గురించి చెబుతున్నప్పుడు... తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పాం కదా. ఆ సమయం ఇదే. ‘‘ఆశ్చర్యంగా ఉంది. బ్యాట్తో కానీ.. బంతితో కానీ తెగించి ఆడలేకపోయాం. నిజానికి రక్షించుకునేంత స్కోరు చేయలేదు కానీ.. కనీసం పోరాడలేకపోయాం. భారత జట్టుకు ఆడుతుంటే భారీ అంచనాలుంటాయి. అంతేకాదు తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. జట్టుగా ఆడి దీన్ని అధిగమించాలి. కానీ గత రెండు మ్యాచ్ల్లో ఆ పని చేయలేకపోయాం. ఈ టోర్నీలో ఇంకా మ్యాచ్లు మిగిలున్నాయి. వాటిలోనైనా మెరుగ్గా ఆడాలని కోరుకుంటున్నాం’’ అని మ్యాచ్ తర్వాత కోహ్లీ చెప్పాడు.
మ్యాచ్ పరిస్థితి అర్థం చేసుకొని ఇలా చెప్పడం వరకు ఓకే. మరి తొలి మ్యాచ్కి, రెండో మ్యాచ్కి మధ్యలో వారం గ్యాప్ ఉంది. ఈ వారంలో టీమ్తోను, మెంటార్ మహేంద్రసింగ్ ధోనీతోను, కోచ్ రవి శాస్త్రితోను కూర్చుని తమ తప్పుల్ని చర్చించుకున్నారు. ఒకవేళ అదే జరిగి ఉంటే... తొలి మ్యాచ్లో చేసిన తప్పులే మళ్లీ చేసి రెండో మ్యాచ్లో ఎందుకు ఔట్ అవుతారు. కాబట్టి తప్పులు తెలుసుకోలేదు అనుకోవాలి, లేదంటే తెలుసుకున్నా వాటిని ఆచరణలో పెట్టి మార్చుకోలేకపోయారని భావించాలి.
ఆఖరిగా... ఈ టోర్నీలో ఇంకా మూడు మ్యాచ్లు మనకు మిగిలి ఉన్నాయి. అందులో అఫ్గానిస్థాన్ చాలా డేంజర్. పెద్ద జట్లకు, అందులోనూ మన లాంటి దెబ్బ తిన్న జట్లకు చావు దెబ్బ తీయడం వారికి అలవాటు. కాబట్టి ఎంత జాగ్రత్తపడితే అంత మంచిది. టీమ్ ఇండియా ఇకనైనా మేలుకో..!
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30 ఏళ్ల క్రితం సచిన్ ఆట మొదలైంది ఈ రోజే..!
సరిగ్గా ఇదే రోజు.. 30 ఏళ్ల క్రితం (మార్చి 27, 1994) మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ కెరీర్ మలుపు తిరిగింది. -
భారత్ - పాక్ ద్వైపాక్షిక సిరీస్ల నిర్వహణకు ఆసీస్ ఆసక్తి!
భారత్, పాక్ల మధ్య 2012-13 నుంచి ఇప్పటివరకూ ఎటువంటి ద్వైపాక్షిక సిరీస్లు జరగలేదు. ఈ తరుణంలో క్రికెట్ ఆస్ట్రేలియా మరోసారి తన ఆసక్తిని బయటపెట్టింది. -
కెప్టెన్సీ ఇచ్చారు సరే.. టైమూ ఇవ్వాలి కదా.. అల్లుడిని వెనకేసుకొచ్చిన షాహిద్ అఫ్రిది
పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది మరోసారి ఫైర్ అయ్యాడు. తన అల్లుడు షహీన్ను కెప్టెన్సీ నుంచి తప్పించనున్నారనే కథనాల నేపథ్యంలో స్పందించాడు. -
కెప్టెన్గా తొలిసారి గిల్కు రూ. 12 లక్షల జరిమానా.. పునరావృతమైతే ఒక మ్యాచ్ వేటు!
గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ (Shubman Gill) జరిమానా ఎదుర్కొన్నాడు. స్లో ఓవర్ రేట్ కారణంగా ఐపీఎల్ నిర్వాహకులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు., -
రెండు మ్యాచుల్లో ఒక్క బంతినీ ఎదుర్కోని ధోనీ.. కారణమేంటో చెప్పిన మైక్ హస్సీ!
ఈ ఐపీఎల్ సీజన్లో ధోనీ (MS Dhoni) బ్యాటింగ్ను చూసే అవకాశం ఇప్పటి వరకూ రాలేదు. తొలి రెండు మ్యాచుల్లోనూ మహీ వికెట్ కీపింగ్కే పరిమితమయ్యాడు. -
హైదరాబాద్ జట్టుకు తప్పని నిరీక్షణ.. కీలక స్పిన్నర్ మరో వారం దూరం!
ఓటమితో టోర్నీని ప్రారంభించిన రెండు జట్లు నేడు ఉప్పల్ వేదికగా తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్కు షాకింగ్ న్యూస్. టాప్ స్పిన్నర్ ఇంకా అందుబాటులోకి రాలేదు. -
ఇతరుల కెప్టెన్సీలో ఆడినా.. ధోనీ - రోహిత్ స్థాయి ఎప్పటికీ తగ్గదు: సిద్ధూ
హార్దిక్ పాండ్య నాయకత్వంలో ముంబయి తొలి మ్యాచ్లో ఓడిపోయింది. దీంతో అతడి సారథ్యంపైనా విమర్శలు వస్తున్నాయి. -
నేడు హైదరాబాద్తో ముంబయి మ్యాచ్.. చరిత్ర సృష్టించనున్న రోహిత్ శర్మ
హార్దిక్ పాండ్య సారథ్యంలోని ముంబయి బుధవారం హైదరాబాద్తో తలపడనుంది. ఈమ్యాచ్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మకు చాలా ప్రత్యేకం కానుంది. -
కొత్త రూల్స్ మాకు ఉపయోగం.. బ్యాటర్లు చిత్తే: దీపక్ చాహర్
గుజరాత్ను ఓడించడంలో చెన్నై బౌలర్ దీపక్ చాహర్, శివమ్ దూబె కీలక పాత్ర పోషించారు. -
వారిని చూస్తుంటే.. మా జట్టులో అదనంగా ఇద్దరు కుర్రాళ్లు ఉన్నట్టుంది: రుతురాజ్ గైక్వాడ్
వరుసగా రెండో విజయంతో చెన్నై జట్టు ఐపీఎల్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. -
చెన్నైదే చిందు
యువ కెప్టెన్ల పోరులో రుతురాజ్ గైక్వాడ్దే పైచేయి. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై ఖాతాలో వరుసగా రెండో విజయం. తొలి మ్యాచ్ను మించిన ప్రదర్శన చేస్తూ అన్ని రంగాల్లోనూ ఆధిపత్యం చలాయిస్తూ సూపర్కింగ్స్.. గుజరాత్ టైటాన్స్ను చిత్తుగా ఓడించింది. -
బోణీ కొట్టేదెవరో
కొత్త సారథులు.. సరికొత్త ఉత్సాహంతో బరిలో దిగిన సన్రైజర్స్ హైదరాబాద్, ముంబయి ఇండియన్స్ జట్లకు ఆరంభ మ్యాచ్ల్లో పరాజయాలు తప్పలేదు. -
టికెట్లో రామచంద్ర!
ఐపీఎల్-17 ఆతిథ్యానికి హైదరాబాద్ సిద్ధమైంది. రసవత్తర మ్యాచ్లకు వేదికగా నిలిచేందుకు ఉప్పల్ స్టేడియం ముస్తాబైంది. అటు సన్రైజర్స్ యాజమాన్యం.. ఇటు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) మ్యాచ్ల నిర్వహణ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాయి. -
రెండు నెలలు ఎందుకంటే..
విరాట్ కోహ్లి ఇటీవల రెండు నెలల క్రికెట్కు దూరంగా ఉన్నాడు. భార్య అనుష్క తమ రెండో బిడ్డకు జన్మనిచ్చిన నేపథ్యంలో కుటుంబంతో అతడు విలువైన సమయం గడిపాడు. -
భారత్కు అఫ్గాన్ షాక్
69 నిమిషాల వరకు మ్యాచ్లో ఆధిక్యం.. బంతిపై చక్కని నియంత్రణ! ప్రత్యర్థి గోల్పోస్టుపై వరుస దాడులు! ఇవన్నీ చూస్తే విజయం భారత్దే అనిపించింది. -
భారత క్రికెటర్లను మార్చింది కోహ్లినే
ఫిట్నెస్ను ఎంతో ప్రేమించే విరాట్ కోహ్లి భారత క్రికెటర్లందరిని తన బాటలో నడిపిస్తున్నాడని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ కొనియాడాడు. ఐపీఎల్ వ్యాఖ్యతగా ఉన్న కేపీ ఇలా వ్యాఖ్యానించాడు. -
గాయత్రి జోడీ ఓటమి
స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పుల్లెల గాయత్రి-ట్రీసా జాలీ జంటకు చుక్కెదురైంది. ఈ అయిదో సీడ్ జోడీ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. -
నవంబరు 22న పెర్త్లో..
ఆతిథ్య ఆస్ట్రేలియా, టీమ్ఇండియా మధ్య అయిదు టెస్టుల బోర్డర్-గావస్కర్ సిరీస్ నవంబరు 22న పెర్త్లో ఆరంభం కానుంది. రెండో టెస్టు డిసెంబరు 6 నుంచి జరుగుతుంది. -
శ్రీజకు కెరీర్ ఉత్తమ ర్యాంకు
భారత యువ టేబుల్ టెన్నిస్ స్టార్ ఆకుల శ్రీజ కెరీర్లో ఉత్తమ ర్యాంకు సాధించింది. తాజా ప్రపంచ టీటీ ర్యాంకింగ్స్ మహిళల సింగిల్స్లో ఈ తెలుగమ్మాయి 40వ ర్యాంకులో నిలిచింది. -
Rahane: రహానె కళ్లు చెదిరే క్యాచ్.. ముందుకు డైవ్ చేసి.. బంతిని ఒడిసి పట్టి
చెన్నై: ఐపీఎల్ 17వ సీజన్లో తన రెండో మ్యాచ్లో గుజరాత్ను చెన్నై చిత్తుగా ఓడించింది. 207 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన గుజరాత్ 143 పరుగులకే పరిమితమైంది. ఆ జట్టు 96 పరుగుల వద్ద తుషార్ దేశ్పాండే బౌలింగ్లో డేవిడ్ మిల్లర్ (21) ఔటయ్యాడు. మిల్లర్ కొట్టిన భారీ షాట్ను అజింక్య రహానె ముందుకు డైవ్ చేసి అద్భుతంగా క్యాచ్ను ఒడిసిపట్టాడు. ఇంకేందుకు ఆలస్యం వీడియో చూసేయండి..
తాజా వార్తలు (Latest News)
-
ఆరు నెలల్లో.. రూ.7.5 లక్షల కోట్ల రుణానికి కేంద్రం సిద్ధం
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
-
రిలయన్స్ జోరు.. మరోసారి ₹20 లక్షల కోట్లకు..
-
అత్యంత దగ్గరగా వచ్చిన రెండు విమానాలు.. ఎయిర్పోర్టులో ఆందోళనకర ఘటన
-
మహిళా ప్రయాణికురాలిపై కండక్టర్ దాడి.. సస్పెండ్ చేసిన అధికారులు
-
ఏపీలో భాజపా అసెంబ్లీ అభ్యర్థులు వీరే..