ICC U19 World Cup 2024: అండర్ -19 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది
యువ క్రికెటర్ల కోసం మరో మెగా టోర్నీ సిద్ధమవుతోంది. అయితే ఇది 2024 ఆరంభంలో ప్రారంభం కానుంది. అండర్ -19 ప్రపంచ కప్ షెడ్యూల్ను తాజాగా ఐసీసీ ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: సీనియర్ల వన్డే ప్రపంచకప్ ముగిసిన రెండు నెలల్లోనే మరో టోర్నీ అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. కొత్త ఏడాదిలో (2024) జనవరి 13 నుంచి ఫిబ్రవరి 4 వరకు అండర్ -19 వరల్డ్ కప్ జరగనుంది. తాజాగా ఐసీసీ ఈ షెడ్యూల్ను విడుదల చేసింది. పదిహేనో ఎడిషన్కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుంది. శ్రీలంక - జింబాబ్వే జట్ల మధ్య తొలి మ్యాచ్తో టోర్నీ ప్రారంభం కానుంది.
డిఫెండింగ్ ఛాంపియన్ అయిన భారత్ తన తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్తో జనవరి 14న తలపడనుంది. మొత్తం 16 జట్లు నాలుగు గ్రూప్లుగా విడిపోయి టైటిల్ కోసం పోరాడనున్నాయి. గ్రూప్ Aలో యువ భారత్ ఆడనుంది. లీగ్ దశలో బంగ్లాదేశ్ (జనవరి 14న), యూఎస్ఏ (18న), ఐర్లాండ్ (20న)తో టీమ్ ఇండియా మ్యాచ్లు ఆడుతుంది. నాలుగు గ్రూప్ల నుంచి టాప్ -3 జట్లు సూపర్ సిక్స్కు అర్హత సాధిస్తాయి. మళ్లీ రెండు గ్రూప్లుగా విడిపోయి తలపడతాయి. ఆయా గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన నాలుగు జట్లు సెమీస్కు చేరుకుంటాయి. ఆ తర్వాత ఫైనల్కు చేరే జట్లేవో ఈ నాలుగింటిలోనే తేలుతాయి. జనవరి 6 నుంచి 12 వరకు వార్మప్ మ్యాచ్లు జరుగుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Team India: పెళ్లిపీటలెక్కబోతున్న భారత్ ఫాస్ట్ బౌలర్
టీమ్ ఇండియా ఫాస్ట్ బౌలర్ ముకేశ్ కుమార్ పెళ్లిపీటలెక్కబోతున్నాడు. ఈ మేరకు బీసీసీఐ అతడికి సెలవులు మంజూరు చేసింది. -
Bumrah: బుమ్రా ముంబయి ఇండియన్స్ను వీడతాడా? సోషల్ మీడియాలో అన్ఫాలో చేసిన స్టార్ పేసర్
ముంబయి ఇండియన్స్ను ఆ జట్టు స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఇన్స్టాగ్రామ్లో అన్ ఫాలో చేశాడు. దీంతో అతడు ముంబయి జట్టుని వీడతాడని ప్రచారం జరుగుతోంది. -
Australia: మిగిలిన టీ20లకు ఆసీస్ జట్టులో భారీ మార్పులు..!
టీమ్ ఇండియాతో జరుగుతున్న టీ20 సిరీస్కు ఆసీస్ జట్టులో భారీ మార్పులు చోటు చేసుకొన్నాయి. అరడజను మంది ఆటగాళ్లు స్వదేశానికి పయనమవుతున్నారు. -
Cameron Green: గ్రీన్ కోసం రూ.17.5 కోట్లా?.. ఆర్సీబీ వ్యూహమేంటీ?
Cameron Green IPL: బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉన్న ఆర్సీబీ.. పేసర్ మీద కాకుండా బ్యాటింగ్ ఆల్రౌండర్ అయిన గ్రీన్పై ఇంతలా ఖర్చు పెట్టడం సరైందేనా? -
ఐపీఎల్ వాళ్లకు చేదు.. ఇంగ్లాండ్ ఆటగాళ్లకు అచ్చిరాని ఇండియన్ లీగ్
-
Pat Cummins: నా చరమాంకంలోనూ ‘కోహ్లీ వికెట్టే’ గుర్తొస్తుంది: కమిన్స్
ప్రపంచకప్ ఫైనల్ (ODI Worldcup 2023 Final)లో కోహ్లీ (Virat Kohli) వికెట్ తీయడం తనకు అద్భుతమైన క్షణమని ఆసీస్ కెప్టెన్ కమిన్స్ (Pat Cummins) అన్నాడు. తన చివరి క్షణాల్లోనూ ఆ వికెట్టే గుర్తొస్తుందన్నాడు. -
Australia: ఆస్ట్రేలియాకు ప్రపంచకప్ను అందించిన ఆ ఒక్క మీటింగ్..!
ప్రపంచకప్లో తొలుత ఎదురైన ఓటముల నుంచి ఎలా బయటపడ్డామనే రహస్యాన్ని ఆస్ట్రేలియా జట్టు కోచ్ ఆండ్రూ మెక్డొనాల్డ్ బయటపెట్టాడు. కేవలం ఒక్క మీటింగ్ జట్టు ఆటతీరును మార్చేసిందన్నాడు. -
Ravi Shastri: 2024 పొట్టి కప్పులో భారత్ గట్టి పోటీదారు: రవిశాస్త్రి
వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్లో భారత జట్టు గట్టి పోటీదారుగా బరిలో దిగుతుందని మాజీ చీఫ్ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. యువ ప్రతిభావంతులకు టీమ్ఇండియా కేంద్రంగా మారిందని అతను అభిప్రాయపడ్డాడు. -
India vs Australia: సిరీస్పై భారత్ కన్ను
ప్రపంచకప్ మిగిల్చిన నిరాశ నుంచి బయటపడుతూ తొలి రెండు టీ20ల్లో అదరగొట్టిన టీమ్ఇండియా.. రెట్టించిన ఉత్సాహంతో ఉంది. అదే జోరును కొనసాగిస్తూ రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే సిరీస్ను చేజిక్కించుకోవాలన్నదే లక్ష్యం. -
Hardik Pandya: వారసుడు ఇతనేనా?
అతడి కోసం గత వేలంలో రూ.17.5 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్న ఆల్రౌండర్ను వదులుకుంది. అతడి కోసం రూ.15 కోట్లు చెల్లించింది. -
గుజరాత్ కెప్టెన్గా శుభ్మన్
గుజరాత్ టైటాన్స్ కొత్త కెప్టెన్గా శుభ్మన్ గిల్ నియమితుడయ్యాడు. ఈ టీమ్ఇండియా యువ సంచలనం వచ్చే ఏడాది ఐపీఎల్లో టైటాన్స్ను నడిపించనున్నాడు. -
రోహిత్ రాయుడు సెంచరీ వృథా
విజయ్ హజారె ట్రోఫీ వన్డే క్రికెట్ టోర్నీలో హైదరాబాద్కు తొలి పరాజయం ఎదురైంది. వరుసగా రెండు విజయాలతో జోరుమీదున్న హైదరాబాద్ను ఛత్తీస్గఢ్ నిలువరించింది. -
బంగ్లా - కివీస్ తొలి టెస్టు నేటి నుంచే
సొంతగడ్డపై న్యూజిలాండ్తో రెండు టెస్టుల సిరీస్లో తలపడేందుకు బంగ్లాదేశ్ సై అంటోంది. మంగళవారం నుంచే తొలి టెస్టు. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2023- 2025 చక్రంలో ఈ రెండు జట్లకిదే తొలి మ్యాచ్. -
ముంబయితో ఎన్నో జ్ఞాపకాలు
ముంబయి ఇండియన్స్ జట్టుతో ఎన్నో జ్ఞాపకాలున్నాయని, తిరిగి జట్టుతో చేరడం బాగుందని హార్దిక్ తెలిపాడు. 2015లో ముంబయితోనే ఐపీఎల్ ప్రయాణాన్ని ప్రారంభించిన అతను.. -
IPL-2024: ఐపీఎల్లో ఆడాలని ఉంది: పాకిస్థాన్ బౌలర్
ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన ఐపీఎల్లో ఆడాలని ఉందని పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ (Hasan Ali) తన మనసులోని మాటను బయటపెట్టాడు.


తాజా వార్తలు (Latest News)
-
Rat Hole Mining: నిషేధించిన విధానమే.. 41మందిని కాపాడింది!
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Uttarakhand Tunnel: ఆపరేషన్ టన్నెల్.. క్షేమంగా బయటపడిన 41 మంది కూలీలు
-
1 నుంచి TCS బైబ్యాక్.. 20 శాతం ప్రీమియంతో షేర్ల కొనుగోలు
-
Team India: పెళ్లిపీటలెక్కబోతున్న భారత్ ఫాస్ట్ బౌలర్
-
Uttarakhand Tunnel: ఎట్టకేలకు బాహ్య ప్రపంచంలోకి.. సొరంగం నుంచి సురక్షితంగా బయటికొస్తున్న కూలీలు