AP News: ఏపీ సీఎం జగన్‌ను కలిసిన కుంబ్లే

దిగ్గజ స్పిన్నర్‌, టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ అనిల్‌ కుంబ్లే సోమవారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన కుంబ్లే సీఎంతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు...

Updated : 06 Jul 2021 12:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దిగ్గజ స్పిన్నర్‌, టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ అనిల్‌ కుంబ్లే సోమవారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన కుంబ్లే.. సీఎంతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలు ఇద్దరి మధ్యా చర్చకు వచ్చాయి. ఏపీలో స్పోర్ట్స్‌ యూనివర్శిటీ నెలకొల్పితే తన వంతు సహకారం అందిస్తానని కుంబ్లే జగన్‌తో చెప్పారు. క్రీడా సామగ్రి తయారీ ఫ్యాక్టరీని పెట్టే అంశంపైనా దృష్టిసారించాలని కోరారు. ప్రస్తుతం జలంధర్, మీరట్‌ లాంటి నగరాల నుంచే అన్నిరకాల క్రీడా సామాగ్రిని తెచ్చుకోవాల్సి వస్తోందని, ఇక్కడ ఫ్యాక్టరీ పెడితే అందరికీ అందుబాటులో ఉంటుందని మాజీ కెప్టెన్‌ వివరించారు. దీనికి సంబంధించి సహకారాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు జగన్‌తో చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని