Team India: నేనూ భారత జట్టులో అన్యాయానికి గురైన బాధితుడినే: టీమ్ఇండియా దిగ్గజ కీపర్
టీమ్ఇండియా క్రికెట్లో తానూ అన్యాయానికి గురైన బాధితుడినేనని 1983 ప్రపంచకప్ జట్టు సభ్యుడు, దిగ్గజ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణి పేర్కొన్నాడు...
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా క్రికెట్లో తానూ అన్యాయానికి గురైన బాధితుడినేనని 1983 ప్రపంచకప్ జట్టు సభ్యుడు, దిగ్గజ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణి పేర్కొన్నాడు. తాజాగా అతడు వృద్ధిమాన్ సాహాకు అండగా నిలుస్తూ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల సాహా టీమ్ఇండియా జట్టులో చోటు కోల్పోవడంతో పాటు ఓ జర్నలిస్టు నుంచి బెదిరింపులకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఓ క్రీడా ఛానెల్తో మాట్లాడిన కిర్మాణి అతడికి అండగా నిలుస్తూ భారత క్రికెట్లో తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నాడు.
‘సాహాకు టీమ్ఇండియా జట్టులో ఇతర ఆటగాళ్ల నుంచి గట్టి పోటీ ఉంది. వాళ్లంతా ఐపీఎల్, ఇతర మ్యాచ్ల్లో రాణిస్తూ ప్రత్యామ్నాయంగా వస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సాహా కచ్చితంగా బాధలో ఉన్నాడు. కానీ, ప్రతి ఆటగాడు ఇలాంటి ఎత్తుపల్లాలు ఎదుర్కోక తప్పదు. ఒక ఆటగాడి గురించి జట్టు యాజమాన్యం, సెలెక్షన్ కమిటీ ఏమనుకుంటుందో మనకు తెలియదు. గతంలో నేను కూడా అన్యాయానికి గురైన ఓ బాధితుడిగానే మిగిలిపోయా. కానీ, దీని గురించి ఎవరూ మాట్లాడరు. నా విషయంలో ఏం జరిగిందో కూడా తెలియదు. నా కెరీర్ అత్యుత్తమ దశలో ఉండగానే అలా జరిగిపోయింది. నా వైపు నుంచి ఎలాంటి తప్పు లేకున్నా జట్టు నుంచి తొలగించారు. ఆ సమయంలో నాకు ప్రత్యామ్నాయ ఆటగాడు కూడా లేడు’ అని మాజీ కీపర్ చెప్పుకొచ్చాడు.
‘నేను టీమ్ఇండియా తరఫున 88 టెస్టులు ఆడాను. వన్డేల్లో ఎన్నో సందర్భాల్లో జట్టును ఆదుకున్నాను. అయితే, నేను జట్టులో మంచి ప్రదర్శన చేయడం లేదని వార్తా పత్రికల్లో తప్పుడు కథనాలు వచ్చాయి. మైదానంలో స్లిప్లో నా పక్కనుండే ఆటగాళ్లు క్యాచ్లు వదిలేస్తే నా ఫొటోలు ప్రచురించి ఆ తప్పులను నా ఖాతాలో వేసేవారు’ అని కిర్మాణీ వాపోయాడు. అలాగే తనది ఎప్పుడూ పోరాడే మనస్తత్వం అని, అందుకే తిరిగి జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలని చూసినట్లు చెప్పాడు. తన సొంత రాష్ట్రం కర్ణాటక జట్టులో ఆడాలనుకున్నానని, కానీ.. ఆ జట్టు నుంచి తనను తొలగించారని మాజీ కీపర్ వివరించాడు. దాంతోనే తాను రైల్వే జట్టులో ఆడాల్సి వచ్చిందన్నాడు. అప్పడు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ తన వద్దకు వచ్చి.. ‘నువ్వు రైల్వే జట్టు తరఫున ఎలా ఆడతావో చూస్తా’నని బెదిరించినట్లు కూడా కిర్మాణి గుర్తుచేసుకున్నాడు. ప్రపంచకప్ గెలిచిన జట్టులోని సభ్యుడితో ఇలాగేనా మాట్లాడేది అని అతడు విచారం వ్యక్తం చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
బెంగళూరు - కోల్కతా జట్ల మధ్య ఆసక్తికర పోరు నేడు. ఇరు జట్లలోనూ కీలక ఆటగాళ్లు ఉన్నారు. -
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
బెంగళూరు, కోల్కతా జట్ల మధ్య మ్యాచ్ నేపథ్యంలో అందరి దృష్టి ఇద్దరి క్రికెటర్లపైనే ఉంది. -
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
ధోనీతో తనకున్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో రవీంద్ర జడేజా గుర్తు చేసుకున్నాడు. -
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?