Virat Kohli: కోహ్లీ విషయంలో బీసీసీఐది పెద్ద పొరపాటే: పాక్ మాజీ కెప్టెన్
విరాట్ కోహ్లీని వన్డే సారథ్యం నుంచి తప్పించడంపై విమర్శలు కొనసాగుతూనే...
ఇంటర్నెట్ డెస్క్: విరాట్ కోహ్లీని వన్డే సారథ్యం నుంచి తప్పించడంపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. కోహ్లీ విషయంలో బీసీసీఐ అతిపెద్ద పొరపాటు చేసిందని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ వ్యాఖ్యానించాడు. తొలగించిన విధానం సరిగాలేదని పేర్కొన్నాడు. టీ20 సారథ్య బాధ్యతలకు కోహ్లీనే వీడ్కోలు చెప్పగా.. వన్డే కెప్టెన్సీ నుంచి బీసీసీఐ తప్పించింది. ఇక దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ అనంతరం సుదీర్ఘ ఫార్మాట్కూ గుడ్బై చెప్పేశాడు. విరాట్ తొలగింపు వ్యవహారం టీమ్ఇండియా క్రికెట్పై పెద్దగా ప్రభావం చూపకపోదని లతీఫ్ పేర్కొన్నాడు. ఆర్థిక శక్తితోపాటు సంక్షోభం తట్టుకొనేంత ప్రతిభ కలిగిన ఆటగాళ్లు బీసీసీఐ వద్ద ఉన్నారని తెలిపాడు.
‘‘ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు భారత క్రికెట్ చరిత్రలో పేలవ చిత్రాన్ని ఆవిష్కరించాయి. అయితే ఇవేవీ ప్రతికూల ప్రభావం చూపవు. ఐపీఎల్లో వారికి బలమైన పునాది ఉంది. అంతేకాకుండా టీమ్ఇండియా క్రికెట్ ఆర్థికంగా చాలా శక్తిమంతమైంది. అందుకే భారతీయ క్రికెట్ బ్రాండ్పై ఎటువంటి ప్రభావం చూపవు. అయితే ఇప్పుడంతా రోహిత్ శర్మ జట్టును ఎలా నడుపుతాడనే దానిపైనే దృష్టిసారించే అవకాశం ఉంది. రోహిత్కు తనదైన శైలి ఉంది. ఇప్పటికే ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ను ఛాంపియన్గా నిలబెట్టాడు. విరాట్ కోహ్లీ సారథిగా జట్టు సభ్యుల్లో ఉత్తేజం నింపేవాడు’’ అని చెప్పుకొచ్చాడు.
కోహ్లీని కెప్టెన్సీ నుంచి తొలగించిన విధానమే ఇప్పుడు చర్చకు దారితీసిందని లతీఫ్ అభిప్రాయపడ్డాడు. ‘‘వన్డే సారథ్యం నుంచి కోహ్లీని తప్పించడం సరైన మార్గంలో జరగలేదని భావిస్తున్నా. సుదీర్ఘకాలంపాటు కెప్టెన్గా సేవలు అందించి ఆ పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నప్పుడు లేకపోతే తొలగించాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు బోర్డు ఉన్నతాధికారులతో చర్చలు జరపకపోవడమనేది సాధ్యం కాదని వ్యక్తిగత అనుభవం ద్వారా తెలుసుకున్నా. నేను 2004లో కెప్టెన్సీ నుంచి దిగినప్పుడు మా బోర్డు ఛైర్మన్తో మాట్లాడాను. అలానే బీసీసీఐ కూడా ఆ మార్గంలో వెళ్లి ఉంటే ఏ సమస్యా ఉండేది కాదు. ఒక టీమ్కు కెప్టెన్ను మార్చడం కూడా తేలికైన విషయమేమీ కాదు’’ అని లతీఫ్ వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త కెప్టెన్.. కోటి ఆశలతో
2013లో ఐపీఎల్ అరంగేట్రం.. 2016లో ఛాంపియన్. స్టార్ ఆటగాళ్లతో ఒకప్పుడు కళకళలాడిన జట్టు. కానీ ఆ తర్వాత తడబాటు. ఒడుదొడుకుల ప్రయాణం. -
నా భుజాలపై రోహిత్ చేతులేసి..
జట్టు కెప్టెన్గా రోహిత్ లేనంత మాత్రాన ఏమీ మారదని, తన భుజాలపై చేతులేసి అతను నడిపిస్తాడని ముంబయి ఇండియన్స్ కొత్త సారథి హార్దిక్ పాండ్య అన్నాడు. -
కోహ్లి ముఖంలో ఆనందం చూశా
డబ్ల్యూపీఎల్ రెండో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచిన తర్వాత విరాట్ కోహ్లి ముఖంలో ఆనందం చూశానని కెప్టెన్ స్మృతి మంధాన వెల్లడించింది. -
సబ్స్టిట్యూట్గా వచ్చి గెలిపించాడు
శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ను బంగ్లాదేశ్ 2-1తో కైవసం చేసుకుంది. కంకషన్ సబ్స్టిట్యూట్గా వచ్చిన తంజిద్ హసన్ (84; 81 బంతుల్లో 9×4, 4×6) మెరుపులు మెరిపించడంతో సోమవారం ఆఖరిదైన మూడో వన్డేలో బంగ్లా 4 వికెట్ల తేడాతో నెగ్గింది. -
ఐపీఎల్ ఆరంభంలో పంత్కు కష్టమే
రోడ్డు ప్రమాదంలో గాయపడి 15 నెలల విరామం తర్వాత మైదానంలో అడుగు పెడుతున్న రిషబ్ పంత్కు.. ఈ ఐపీఎల్ ఆరంభంలో ఇబ్బందులు తప్పవని దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. -
ప్రపంచ రికార్డుతో అఖిల్కు పసిడి
భారత షూటర్ అఖిల్ షెరోన్ అదరగొట్టాడు. ఇప్పటికే పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానం గెలిచిన అతను.. తాజాగా పోలిష్ గ్రాండ్ ప్రి పోటీల్లో ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. -
శ్రేయస్ ఫిట్టే కానీ..
కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లో ఆడేందుకు ఫిట్నెస్తో ఉన్నట్లుగా బీసీసీఐ నిర్ధరించినట్లు తెలుస్తోంది. -
‘లక్ష్య’ జ్యోతికకు కాంస్యం
ఇండియా ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి దండి జ్యోతిక శ్రీ (ఆంధ్రప్రదేశ్) సత్తాచాటింది. -
బెంగళూరు జట్టుతో విరాట్
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఐపీఎల్ సన్నాహాలు మొదలుపెట్టాడు. -
కోహ్లీతో బ్యాటింగ్ అంటే..
కోహ్లితో కలిసి బ్యాటింగ్ చేయడం నమ్మశక్యం కాని అనుభూతి అని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ తెలిపాడు. -
అప్పుడే ఆటను వదిలేద్దామనుకున్నా..
క్రికెట్కు 2017లోనే ఆటకు వీడ్కోలు చెబుదామని అనుకున్నట్లు భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. -
సర్ఫరాజ్, జురెల్లకు బీసీసీఐ కాంట్రాక్టులు
భారత యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, వికెట్కీపర్ ధ్రువ్ జురెల్కు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులు లభించాయి. గ్రూప్-సిలో ఉన్న ఈ ఆటగాళ్లు ఫీజు కింద ఏడాదికి కోటి రూపాయలు పొందుతారు.