Hardik Pandya:‘ కెప్టెన్గా హార్దిక్ పేరును ఎవరు తెస్తున్నారో అర్థం కావడం లేదు’
హార్దిక్ పాండ్యకు కెప్టెన్సీ అంశంపై పాకిస్థాన్ మాజీ ఆటగాడు సల్మాన్ భట్ మాట్లాడాడు. టీ20 ప్రపంచకప్ గెలవకపోయినంత మాత్రాన రోహిత్ శర్మను భారత కెప్టెన్గా తొలగిస్తారని తానైతే భావించడం లేదన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్లో టీమ్ఇండియా సెమీస్లోనే ఇంటిముఖం పట్టడంతో బీసీసీఐ ప్రక్షాళనకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీని రద్దు చేస్తూ కొత్త సెలక్షన్ కమిటీ ఎంపిక కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. టీమ్ఇండియా కెప్టెన్సీలో కూడా మార్పులకు బీసీసీఐ యోచిస్తోందని వార్తలొస్తున్నాయి. మూడు ఫార్మాట్లలో కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మని టీ20ల్లో సారథిగా తొలగించి ఆ బాధ్యతలను హార్దిక్ పాండ్యకు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. పొట్టి ఫార్మాట్లో రోహిత్ వారసుడిగా హార్దిక్కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగిస్తే బాగుంటుందని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యకు కెప్టెన్సీ అంశంపై పాకిస్థాన్ మాజీ ఆటగాడు సల్మాన్ భట్ మాట్లాడాడు. టీ20 ప్రపంచకప్ గెలవకపోయినంత మాత్రాన రోహిత్ శర్మను భారత కెప్టెన్గా తొలగిస్తారని తానైతే భావించడం లేదన్నాడు.
‘అసలు హార్దిక్ని కెప్టెన్గా ఎవరు ముందుకు తీసుకువస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. పాండ్య టాలెంటెడ్ క్రికెటరే. అందులో సందేహం లేదు. భారత టీ20 లీగ్లో గుజరాత్ను తొలి సీజన్లోనే ఛాంపియన్గా నిలిపాడు. అలా అనుకుంటే రోహిత్ శర్మ కూడా తన జట్టుకి ఐదుసార్లు కప్ని అందించాడు కదా. కొన్ని మ్యాచ్ల్లో బాగా ఆడినంత మాత్రాన అతడికి సారథ్య బాధ్యతలు అప్పగించాలనేది సరైన వాదన కాదు. క్రికెట్ గురించి సరైన అవగాహన లేనివారే ఈ విధంగా మాట్లాడతారు. ప్రపంచకప్లో 12 జట్లు ఆడాయి. ఒక్క కెప్టెన్ మాత్రమే ఆ ట్రోఫీని సాధించాడు. మిగిలిన 11 జట్లు ఓడిపోయాయి. అలా అని ఆ 11 జట్ల కెప్టెన్లను మారుస్తారా?’ అని సల్మాన్ భట్ తన యూ ట్యూబ్ ఛానల్లో ప్రశ్నించాడు.
టీ20 ప్రపంచకప్ రెండో సెమీస్లో ఇంగ్లాండ్ చేతిలో ఓటమి తర్వాత టీమ్ఇండియా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. అక్కడ కివీస్తో మూడేసి టీ20లు, వన్డేలు ఆడనుంది. ఈ పర్యటనకు కెప్టెన్ రోహిత్ శర్మతో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్కు విశ్రాంతినిచ్చారు. దీంతో టీ20లకు హార్దిక్ పాండ్య, వన్డేలకు శిఖర్ ధావన్కు కెప్టెన్గా నియమించారు. తొలి టీ20 వర్షం కారణంగా రద్దవగా.. ఆదివారం రెండో టీ20 జరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!