Virat Kohli : విరాట్లా సుదీర్ఘ ఫామ్లేమి.. వారికి ఎందుకు ఉండదంటే..?
విరాట్ కోహ్లీ.. ఈ పేరు గత కొన్నిరోజులుగా మారుమోగుతోంది. ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న..
వివరించిన పాక్ మాజీ పేసర్ ఆకిబ్ జావెద్
ఇంటర్నెట్ డెస్క్: విరాట్ కోహ్లీ.. ఈ పేరు గత కొన్నిరోజులుగా వార్తల్లో నిలుస్తోంది. ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న కోహ్లీ మూడేళ్ల కాలంలో ఒక్క శతకమూ బాదలేదు. అడపాదడపా అర్ధశతకాలను సాధిస్తున్నా.. తన స్థాయికి తగ్గ ఆట మాత్రం ఆడటం లేదనే వాదన బలంగా ఉంది. మరోవైపు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్, ఇంగ్లాండ్ మాజీ సారథి జో రూట్, కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ నిలకడగా ఆడుతుండటంతో విరాట్ ఫామ్పై చర్చ కొనసాగుతోంది. 2019 వరకు పరుగుల రారాజుగా కీర్తింపబడిన కోహ్లీ ర్యాంకింగ్స్లోనూ కిందికి జారిపోయాడు. ఈ క్రమంలో విరాట్, అజామ్, విలియమ్సన్, రూట్ బ్యాటింగ్ శైలిపై పాక్ మాజీ పేసర్ ఆకిబ్ జావెద్ స్పందించాడు. ‘గొప్ప ఆటగాళ్ల’ జాబితాలో రెండు రకాల ప్లేయర్లు ఉంటారని పేర్కొన్నాడు.
‘‘గ్రేట్ ప్లేయర్లు రెండు రకాలు. ఒకరేమో బలహీనత వద్ద ఆగిపోయేవారు. కొన్ని ప్రాంతాల్లో పడే బంతులను ఆడటంలో ఇబ్బంది పడేవాళ్లు. అలాంటి వారు మిగతా అన్ని బంతులను ఈజీగా ఆడేస్తారు. ఆ ఒక్క చోట మాత్రమే ఇబ్బంది పడతారు. ఇక మరొక రకం.. సాంకేతికంగా అద్భుతంగా ఆడేవారు.. వారి బలహీనతలను కనిపెట్టడం కాస్త కష్టం. బాబర్, కేన్, రూట్ అలాంటి కోవకు చెందినవారు కోహ్లీ చాలాసార్లు ఆఫ్ స్టంప్ ఆవల వేసిన బంతులకు దొరికిపోయాడు. జేమ్స్ అండర్సన్ బౌలింగ్లో ఇలానే పెవిలియన్కు చేరాడు. ఒకవేళ కోహ్లీ కానీ తన తీరును మార్చుకుంటే నేను తప్పకుండా మ్యాచ్లు చూస్తా. శరీరానికి దూరంగా వెళ్లే వాటిని ఆడేందుకు ప్రయత్నించకూడదు. టెక్నిక్ను అందిపుచ్చుకుంటే మాత్రం సమస్యలన్నీ తీరిపోతాయి. సుదీర్ఘ ఇన్నింగ్స్లను ఆడటం మొదలుపెడితే మాత్రం కోహ్లీని ఆపడం ఎవరి తరమూ కాదు’’ అని జావెద్ తెలిపాడు.
ఆసియా కప్లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్లో ఎవరు ఆధిక్యం సాధిస్తారనేదానిపైనా జావెద్ వివరించాడు. ‘‘విరాట్ కోహ్లీ ఆత్మవిశ్వాసంతో లేకపోతే మాత్రం భారత్పై పాక్ ఆధిక్యం కనబరుస్తుంది. గత టీ20 ప్రపంచకప్లో ఓటమిలానే మరోసారి టీమ్ఇండియాకు పరాభవం తప్పదు. కోహ్లీ పరుగులు సాధిస్తే మాత్రం పాక్కు ఓటమిబాట తప్పదు. అంతేకాకుండా కోహ్లీ ఆడకపోతే మాత్రం అనేక ప్రశ్నలు తలెత్తుతాయి. ‘ఇంకా ఎందుకు అతడిని ఆడిస్తున్నారు’.. కోహ్లీ స్థానంలో దీపక్ హుడాను ఆడించొచ్చు కదా..? ఇలా వస్తాయి. అయితే యూఏఈ పిచ్లు బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి విరాట్ తప్పకుండా ఫామ్లోకి వస్తాడని నేను భావిస్తున్నా’ అని జావెద్ వివరించాడు. యూఏఈ వేదికగా ఆగస్ట్ 28న ఆసియా కప్లో భాగంగా పాక్తో భారత్ తలపడనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
క్రికెటర్లు తాము కొట్టే షాట్.. లేదా తీసే వికెట్ జీవితాంతం మరిచిపోకుండా ఉంటారు. అలాంటి అనుభవం పంజాబ్ బ్యాటర్ అశుతోష్ శర్మకూ ఎదురైంది. -
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. తన సొంత మైదానంలో లఖ్నవూ జట్టు చెన్నైను ఢీకొట్టనుంది. -
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..