Kohli: కోహ్లీకి విశ్రాంతి ఎందుకు..? తీసుకున్నా ప్రయోజనం ఉండదు: మాజీ సెలెక్టర్
బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ వైఫల్యం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఇంగ్లాండ్తో రెండో వన్డేలోనూ కోహ్లీ (16) మరోసారి విఫలమయ్యాడు. ఈ క్రమంలో విరాట్పై...
ఇంటర్నెట్ డెస్క్: బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ వైఫల్యం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఇంగ్లాండ్తో రెండో వన్డేలోనూ కోహ్లీ (16) మరోసారి విఫలమయ్యాడు. ఈ క్రమంలో విరాట్పై విమర్శలు తీవ్రస్థాయిలో వస్తున్నాయి. క్రికెట్కు కొంతకాలం విరామం తీసుకొని మళ్లీ రావాలని మాజీలు మైకెల్ వాన్, ఆశిశ్ నెహ్రా సూచించారు. అయితే టీమ్ఇండియా మాజీ సెలెక్టర్ శరణ్దీప్ సింగ్ మాత్రం విభిన్నంగా స్పందించాడు. విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకోవాలని చాలా మంది ఎందుకు చెబుతున్నారో తనకు అర్థం కావడం లేదన్నాడు. ఒకవేళ విరామం తీసుకున్నా ఫామ్పరంగా ఎలాంటి మార్పు రాదని పేర్కొన్నాడు.
‘‘అసలు నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే..? విశ్రాంతి అంటే ఏమిటి...?ఎప్పుడు తీసుకోవాలి..? వందల పరుగులు చేసినప్పుడే విశ్రాంతి గురించి ఆలోచించాలి. ఒక వేళ విరాట్ గత మూడు నెలల్లో నాలుగైదు సెంచరీలు చేసి అలసిపోతే.. అప్పుడు విరామం తీసుకొనే స్వేచ్ఛ ఉండేది. భారత టీ20 లీగ్కు ముందు విరాట్ ఆడింది కేవలం రెండు టెస్టులు మాత్రమే. లీగ్ తర్వాత దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కూడా ఆడలేదు. విశ్రాంతి తీసుకొన్నాడు. మైదానం బయట కూర్చోవడం, విశ్రాంతి తీసుకోవడం వల్ల విరాట్ ఫామ్లోకి వచ్చేందుకు పెద్దగా ఉపయోగపడదు’’ అని శరణ్దీప్ సింగ్ వివరించాడు.
అప్పుడు నేను ఇచ్చిన సూచనలు పనిచేశాయి: ముస్తాక్ అహ్మద్
చాలా రోజుల కిందట విరాట్ కోహ్లీకి తాను ఇచ్చిన పలు సూచనలు బాగా పనిచేశాయని పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ ముస్తాక్ అహ్మద్ గుర్తు చేసుకొన్నాడు. ‘‘ఒకసారి జిమ్లో విరాట్ కోహ్లీ శిక్షణ తీసుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో నేనూ అక్కడికి వెళ్లా. అప్పుడే విరాట్ నా దగ్గరకు వచ్చాడు. ఇద్దరం మాట్లాడుకుంటూ ఉండగా.. అతడికి కొన్ని సూచనలు చేశా. తొలి పదిహేను పరుగుల వరకు ఫ్రంట్ఫుట్ స్ట్రైట్గా ఉండాలని చెప్పా. బంతిని డ్రైవ్ షాట్ కొట్టేటప్పుడు కాలు కూడా ఆ వైపు ఉండేలా చూసుకోవాలని సూచించా. లేకపోతే బంతి బ్యాట్కు అవుట్సైడ్ ఎడ్జ్ తీసుకొనే ప్రమాదం ఉందని వివరించా. దాంతో ఇది చాలా మంచి పాయింట్ అని నాతో అన్నాడు. తప్పకుండా దీనిపై ప్రాక్టీస్ చేస్తానని చెప్పాడు. ఆ తర్వాత కొన్ని మ్యాచుల్లో విరాట్ ఇదే పద్ధతిని అమలు చేయడం చూశా’’ అని ముస్తాక్ వివరించాడు.
కోహ్లీ ఫామ్ గురించే ఎందుకు అడుగుతారు..? : బట్లర్
ఫామ్లేక ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లీకి ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ మద్దతుగా నిలిచాడు. ఎన్నో ఏళ్లపాటు భారీగా పరుగులు చేసిన కోహ్లీ ప్రదర్శనపై ఇప్పుడు ప్రతి ఒక్కరూ ప్రశ్నించడం ఎందుకో తనకు అర్థం కావడం లేదని ఆక్షేపించాడు. అతడు కూడా మనిషేనని, తప్పకుండా ఫామ్ అందుకుంటాడని బట్లర్ చెప్పాడు. ప్రత్యర్థి జట్టు కెప్టెన్గా తమపై ఆడకుండా ఉంటే బాగుంటుందని మాత్రం కోరుకుంటానని తెలిపాడు. విరాట్ అంటే ఏంటో అతడి గణాంకాలే చెబుతాయని, ఎన్నో మ్యాచ్లను గెలిపించాడని బట్లర్ గుర్తు చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
ఐపీఎల్లో చెన్నై జట్టును తక్కువ చేయడం సరికాదని భారత మాజీ క్రికెటర్ శివరామకృష్ణన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. -
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
పొట్టి కప్ కోసం జట్టు ఎంపికపై ఇప్పటి వరకు తానెవరినీ కలవలేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్పష్టం చేశాడు. -
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
భారీ విజయంతో దిల్లీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగు పర్చుకుంది. సొంతమైదానంలోనే గుజరాత్ను చిత్తు చేసి ఈ సీజన్ ఐపీఎల్లో దిల్లీ మూడో విజయాన్ని నమోదు చేసింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
మొన్న కంగనపై.. నేడు ఎన్కౌంటర్పై.. వరుస వివాదాల్లో సుప్రియ శ్రీనేత్
-
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
-
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
-
ఫస్ట్ టైమ్ ఓటర్లకు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఆఫర్
-
పెద్ద కోటల్లో ఉండే జగన్.. ఎన్నికల వేళ బయటకు వస్తున్నారు: షర్మిల
-
ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి: సుప్రీంకోర్టు