Mirabai chanu: కేక్, ఐస్క్రీమ్ కాదు.. ముందు పిజ్జా తింటా
పిజ్జా తిని చాలా రోజులైంది. ఇప్పటి వరకూ ఒక్క పిజ్జా తినలేదు
ఒలింపిక్స్ కోసం ఇష్టమైన పిజ్జాను పక్కనపెట్టా
ఇంటర్నెట్డెస్క్: లక్ష్యాలను చేరుకోవాలంటే ఇష్టమైనవన్నీ పక్కన పెట్టాలి. ఫోన్లు మాట్లాడటం, స్నేహితులతో ముచ్చట్లు, గంటల తరబడి నిద్ర .. ఇవన్నీ.. ఇక నోరూరించే వంటకాలు.. కళ్ల ముందు ఉన్నా సరే.. చేరుకోవాల్సిన గమ్యమే గుర్తుకు రావాలి. ఒలింపిక్స్లో వెయిట్ లిఫ్టింగ్లో రజతం సాధించిన మీరాబాయ్కి ఇష్టమైన ఓ ఆహారాన్ని నాలుగేళ్లు పక్కన పెట్టేశారు. మరి స్నాచ్లో 87 కిలోలు, క్లీన్ అండ్ జర్క్లో 115 కిలోలు.. మొత్తంగా 202 కిలోలు బరువు ఎత్తాలంటే మాటలా.. కచ్చితంగా కఠోర ఆహార నియమావళిని పాటించక తప్పదు. తాజాగా జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని మీరా ప్రస్తావించారు. నాలుగేళ్లగా ఒలింపిక్స్ కోసం ఇష్టమైన ఆహారాన్ని పక్కన పెట్టారు.. కేవలం సలాడ్తోనే సరిపెట్టుకున్నారు కదా.. మరి ఇప్పుడు ఇంటికెళ్లి.. ఐస్క్రీమ్, కేక్ తింటానంటే మీ కోచ్ అంగీకరిస్తారని అనుకుంటున్నారా అని ప్రశ్నించిగా .. వెంటనే నవ్వేస్తూ.. ‘‘ పిజ్జా తిని చాలా రోజులైంది. కఠోన సాధనలో భాగంగా ఒక్క పిజ్జా తినలేదు. ముందుగా నేను వెళ్లి చేసేది పిజ్జా తినడమే. కొంచెం కాదు. ఎక్కువే తింటా. ఈరోజు కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నా’’ అంటూ సమాధానమిచ్చింది. పిజ్జా పట్ల ఆమెకున్న ఇష్టాన్ని చూసి డామినొస్ పిజ్జా ఆమెకో లైఫ్టైమ్ గిఫ్ట్ ఇచ్చింది. ‘‘ మీరు కోట్లాది భారతీయుల కలల్ని నిజం చేశారు. అభినందనలు మీరా. ఇంతటి ఘనత సాధించిన మీకు మా డామినోజ్ ఇండియా తరఫు నుంచి జీవితకాలం ఉచితంగా పిజ్జా బహుమతిగా ఇస్తున్నాం’’ అని ప్రకటించింది.
కేవలం ఈ సంబరాలు కేవలం డామినోస్తోనే ఆగిపోలేదు. పాల ఉత్పత్తుల సంస్థ అమూల్ ఇండియా సైతం ఆమె విజయానికి గుర్తుగా మీరా మెడలో రజతం, ఎదురుగా బార్బెల్ ముందు నిలబడ్డ ఓ కార్టూన్ను ఇన్స్టాగ్రామ్ వేదికగా విడుదల చేసింది. ‘‘మేరా, తేరా, హమారా ఫేవరేట్ స్నాక్’’ (నాది, మీది, మనందరికి ఇష్టమైన స్నాక్) అంటూ క్యాప్షన్ను జత చేసి.. ఆమెకి అంకితమిస్తున్నట్లు పేర్కొంది..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’