IPL Final: ఐపీఎల్‌ ‘ఫైనల్‌’ డే.. సందడి చేసే సెలబ్రెటీలు వీరే!

ఐపీఎల్ ఫైనల్‌ మ్యాచ్‌కు (IPL 2023) ముందు అభిమానుల కోసం పెద్దఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పలువురు సెలబ్రెటీలతో కార్యక్రమాలకు ఏర్పాట్లు చేశారు.

Published : 27 May 2023 02:04 IST

ఇంటర్నెట్ డెస్క్: దాదాపు రెండు నెలలపాటు అభిమానులను అలరించిన ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ 2023 సీజన్‌ (IPL 2023) ముగింపు దశకు చేరింది. రెండో క్వాలిఫయర్‌లో ముంబయిని ఓడించి గుజరాత్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మే 28న ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్‌ ఫైనల్‌కు చేరింది. అయితే, ముగింపు కార్యక్రమాలను అట్టహాసంగా నిర్వహించేందుకు ఐపీఎల్ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా మే 28న ఆదివారం ఫైనల్‌ మ్యాచ్‌ ప్రారంభానికి ముందే సెలబ్రెటీలతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు. 

ప్రముఖ ర్యాపర్ కింగ్‌, డీజే న్యూక్లెయ, సింగర్లు డివైన్, జొనిత గాంధీ ప్రదర్శనలు ఇస్తారని ఐపీఎల్‌ నిర్వాహకులు వెల్లడించారు. సాయంత్రం 4 గంటల నుంచే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఫైనల్‌ మ్యాచ్‌ రాత్రి 7.30 గంటలకు మొదలవుతుంది. గత రెండు సీజన్లలో కరోనా కారణంగా ప్రారంభ, ముగింపు కార్యక్రమాల్లేవు. దీంతో ఈసారి అభిమానులు, ప్రేక్షకుల కోసం భారీగానే కార్యక్రమాలను నిర్వహించాలని బీసీసీఐ, ఐపీఎల్‌ అడ్వైజరీ కమిటీ నిర్ణయించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని