Gautam Gambhir: క్రికెట్లో ‘హీరో ఆరాధన’ వల్లే ఇలాంటి సమస్యలు.. గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే భారత మాజీ ఓపెనర్ గంభీర్.. ఈసారి క్రికెట్లో ‘హీరో ఆరాధన’ గురించి మాట్లాడాడు. ఒకరిని ఆరాధించడం వల్ల మరొకరి ఘనతలను గుర్తించడంలేదని వ్యాఖ్యానించాడు..........
ఇంటర్నెట్ డెస్క్: ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే భారత మాజీ ఓపెనర్ గంభీర్.. ఈసారి క్రికెట్లో ‘హీరో ఆరాధన’ గురించి మాట్లాడాడు. ఒకరిని ఆరాధించడం వల్ల మరొకరి ఘనతలను గుర్తించడంలేదని వ్యాఖ్యానించాడు. ఆసియా కప్లో అఫ్గానిస్థాన్పై విరాట్ కోహ్లీ, భువనేశ్వర్ కుమార్ ప్రదర్శనలను ఉదాహరణగా చెప్పడం గమనార్హం.
ఆసియా కప్ సూపర్-4లో ఓటములతో ఫైనల్కు చేరుకోలేకపోయిన టీమ్ఇండియా.. అఫ్గాన్తో జరిగిన మ్యాచ్లో చెలరేగింది. అంతర్జాతీయ క్రికెట్లో దాదాపు 1000 రోజుల తర్వాత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. 122 పరుగులతో టీ20ల్లో మొట్టమొదటి శతకం నమోదు చేశాడు. దీంతో ప్రస్తుత, మాజీ క్రికెటర్లతోపాటు నెటిజన్లు కోహ్లీపై ప్రశంసలు కురిపించారు. కాగా ఇదే విషయంపై గంభీర్ తాజాగా మాట్లాడాడు. కోహ్లీనే అందరూ కొనియాడారని.. ఫలితంగా అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్ల ప్రదర్శన చేసిన భువనేశ్వర్ కుమార్ ఘనతను ఎవరూ గుర్తించలేదన్నాడు. ‘హీరో ఆరాధన’ కారణంగానే ఇలాంటి సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నాడు.
‘కోహ్లీ సెంచరీ కొట్టిన మ్యాచ్లోనే మీరట్ అనే చిన్న పట్టణం నుంచి వచ్చిన యువకుడు (భువనేశ్వర్ కుమార్) ఐదు వికెట్లు తీశాడు. కానీ ఎవరూ అతడి గురించి మాట్లాడలేదు. ఇది చాలా దురదృష్టకరం. 4 ఓవర్లు వేసి 5 వికెట్లు తీస్తే అతడిని ఎవరూ గుర్తించలేదు. కానీ కోహ్లీ శతకం చేస్తే దేశమంతటా సంబరాలు చేసుకొన్నారు. హీరో ఆరాధన నుంచి బయటపడాలి. హీరోలుగా ఆరాధించడం మానేయాలి అది క్రికెట్ అయినా, రాజకీయాలైనా. ఆటగాళ్లను కాకుండా జట్టు మొత్తాన్ని అభిమానించాలి’ అని ఓ వార్తాసంస్థ అడిగిన ప్రశ్నకు గంభీర్ ఈ విధంగా సమాధానమిచ్చాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టే ఆలోచన లేదని వెస్టిండీస్ మాజీ ఆటగాడు సునీల్ నరైన్ (Sunil Narine) అన్నాడు. -
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
ముంబయి ఇండియన్స్ గురించి భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు ఇప్పటికీ రోహిత్ శర్మ (Rohit Sharma)నే కెప్టెన్గా భావిస్తున్నారని వ్యాఖ్యానించాడు. -
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్లో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఎవరైతే బాగుంటారు. -
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. -
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!