Fabiflu: ఉచితంగా పంచాడని గంభీర్పై నజర్
టీమ్ఇండియా మాజీ క్రికెటర్, లోక్సభ సభ్యుడు గౌతమ్ గంభీర్ (భాజపా) ఫాబి ప్లూ ఔషధాలను ఉచితంగా పంచడం రాజకీయ దుమారం...
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా మాజీ క్రికెటర్, లోక్సభ సభ్యుడు గౌతమ్ గంభీర్ (భాజపా) ఫాబి ప్లూ ఔషధాలను ఉచితంగా పంచడం రాజకీయ దుమారం రేపుతోంది. నగరంలో ఔషధాల కొరత ఉంటే అతడికి అవెలా లభ్యమయ్యాయని కాంగ్రెస్, ఆమ్ఆద్మీ పార్టీలు విమర్శిస్తున్నాయి. ఇలా అనధికారికంగా పంచుతున్నందు వల్లే దుకాణాల్లో ఔషధాల కొరత ఏర్పడుతోందా? అని ఆరోపిస్తున్నాయి. కాగా ఈ అంశాన్ని రాజకీయం చేయొద్దని, పోలీసులకు అన్ని వివరాలు అందించానని గౌతీ స్పష్టం చేశాడు.
దేశ రాజధాని దిల్లీలో కొవిడ్ పరిస్థితి అందరికీ తెలిసిందే. రోజురోజుకూ అక్కడ కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రాణవాయువు, ఔషధాలు, పడకల కొరతతో బాధితులు ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 25న గౌతీ ఓ ట్వీట్ చేశాడు. ‘మనుగడ సాగించాలంటే మనమంతా ఒకరికొకరం అండగా నిలవాలి. దిల్లీలో వీలైనంత మందికి ఫాబీ ఫ్లూ అందించనున్నాం. జీజీఎఫ్ కార్యాలయంలో రేపు ఉదయం 10 నుంచి 4 గంటల వరకు ఉచితంగా అందిస్తాం. దయచేసి ఆధార్, ప్రిస్క్రెప్సన్ తీసుకురండి. ప్రాణవాయువు సిలిండర్లూ అందిస్తాం’ అని పోస్ట్ చేశాడు.
గంభీర్ తన స్వచ్ఛంద సంస్థ ద్వారా ఫాబి ఫ్లూ పంచడాన్ని ఇతర రాజకీయ పక్షాలు విమర్శించాయి. రాష్ట్రంలో ఔషధాల కరవు ఉంటే ఫాబి ఫ్లూను ఎలా పంచుతున్నాడంటూ ప్రశ్నించాయి. ‘ఇలాంటి అనధికార పంపిణీయే ఔషధ దుకాణాల్లో ఫాబీ ఫ్లూ కొరతకు కారణమవుతోందా?’ అని కాంగ్రెస్ నేత దుర్గేశ్ పాఠక్ ట్వీట్ చేశారు. దిల్లీ పోలీసులు సైతం అన్ని ఔషధాలు ఎలా తెచ్చారని ప్రశ్నించారు.
‘ఫాబి ఫ్లూ పంపిణీ అంశాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేయొద్దు. దిల్లీ పోలీసులు మమ్మల్ని ప్రశ్నించారు. మేం అన్ని వివరాలను వారికి అందించాం. నా శక్తి మేరకు దిల్లీ ప్రజలకు సేవ చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటా’ అని గౌతీ మే 14న ట్వీట్ చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి