Ganguly: వారిని పంపాలా వద్దా అనేది సెలక్టర్ల నిర్ణయం
ఇంగ్లాండ్ పర్యటనలో గాయపడిన యువ ఓపెనర్ శుభ్మన్గిల్ స్థానంలో మరో ఇద్దరిని పంపించాలని అభ్యర్థన వచ్చిన నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ స్పందించారు. అది సెలెక్టర్ల నిర్ణయమని స్పష్టం చేశారు. గాయపడిన గిల్ స్థానంలో పృథ్వీ షా,
బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ
కోల్కతా: ఇంగ్లాండ్ పర్యటనలో గాయపడిన యువ ఓపెనర్ శుభ్మన్గిల్ స్థానంలో మరో ఇద్దరిని పంపించాలని అభ్యర్థన వచ్చిన నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ స్పందించారు. అది సెలెక్టర్ల నిర్ణయమని స్పష్టం చేశారు. గాయపడిన గిల్ స్థానంలో పృథ్వీ షా, దేవ్దత్ పడిక్కల్ను పంపాలని టీమ్ఇండియా మేనేజర్ గిరిశ్ డోంగ్రే గతనెల చివర్లో సెలెక్షన్ కమిటికి మెయిల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ చేతన్ శర్మ నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదు. దీంతో అది మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే గురువారం 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న గంగూలీ మీడియాతో ముచ్చటించారు. షా, పడిక్కల్ను అక్కడికి పంపడమనేది కమిటీ నిర్ణయమని తేల్చిచెప్పారు.
మరోవైపు పృథ్వీషా, పడిక్కల్ ప్రస్తుతం శిఖర్ ధావన్ నేతృత్వంలోని టీమ్ఇండియా జట్టులో శ్రీలంక పర్యటనలో కొనసాగుతున్నారు. ఈ నెల 13 నుంచి భారత్ ఆ జట్టుతో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. అలాగే కోహ్లీ నేతృత్వంలోని మరో టీమ్ఇండియా ఆగస్టు 4 నుంచి ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ ఆడాల్సి ఉంది. అక్కడ ఇప్పటికే గిల్ కాకుండా కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, అభిమణ్యు ఈశ్వరన్ లాంటి ఓపెనర్లు ఉన్నారు. అలాంటప్పుడు మళ్లీ ఇద్దరిని కొత్తగా ఇంగ్లాండ్కు ఎందుకు పంపాలన్నది సెలెక్షన్ కమిటీ వాదనగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే వారు మౌనంగా ఉన్నారనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక ఈ ఏడాది కరోనా వైరస్ కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయిన ఐపీఎల్ 14వ సీజన్ను తిరిగి యూఏఈలో నిర్వహిస్తామని గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈసారి ఏం జరగదని, తాము అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం టీ20 ప్రపంచకప్పై స్పందించిన దాదా.. ఆ మెగా టోర్నీని భారత్లో నిర్వహించకపోవడం బాధాకరమే అయినా ఎవరూ ఇలాంటి విపత్తును ఊహించలేదని విచారం వ్యక్తం చేశారు. ఇవి అనుకోని పరిస్థితులని వివరించారు. గతేడాది జరగాల్సిన టీ20 ప్రపంచకప్ వైరస్ కారణంగా ఈ ఏడాదికి వాయిదా పడిందని, ఇప్పుడు కూడా అలా జరిగితే క్రికెట్కు తీవ్ర నష్టం వాటిల్లుతుందని అన్నారు. అందువల్లే ఇక్కడి నుంచి తరలించి యూఏఈలో నిర్వహిస్తున్నట్లు దాదా పేర్కొన్నారు. చివరగా తన ఆరోగ్యం గురించి మాట్లాడిన ఆయన.. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నట్లు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
భళా పంత్!
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
-
గంజాయి మిల్క్షేక్!.. మత్తు ముఠాల నయా దందా
-
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
-
అధిక సమయం ఆన్లైన్లో ఉంటే.. పిల్లలు బడికి గైర్హాజరయ్యే ముప్పు అధికం
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)