
RCB:వచ్చే సీజన్కి ఆర్సీబీ డివిలియర్స్ని రిటైన్ చేసుకోదు:గంభీర్
ఇంటర్నెట్ డెస్క్: వచ్చే ఐపీఎల్ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) గ్లెన్ మ్యాక్స్వెల్ని జట్టులో కొనసాగించాలని భావిస్తే.. ఏబీ డివిలియర్స్ని రిటైన్ చేసుకోకపోవచ్చని భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఈ సీజన్లో ఆర్సీబీ తరఫున అత్యధిక పరుగులు (513) చేసిన మ్యక్సీకి ఆ జట్టులో మంచి భవిష్యత్తు ఉందని, 37 ఏళ్ల డివిలియర్స్కు ఈ అవకాశం లేదని గంభీర్ అన్నాడు. వచ్చే సీజన్లో డివిలియర్స్ని బెంగళూరు రిటైన్ చేసుకోదని భావిస్తున్నారా? అని అడిగిన ప్రశ్నకు..‘అవును. రిటైన్ చేసుకోదు. గ్లెన్ మ్యాక్స్వెల్కి ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. కాబట్టి అతడి రిటైన్ చేసుకుంటుందని అనుకుంటున్నా. డివిలియర్స్కి ఈ అవకాశం లేదు’అని సమాధానమిచ్చాడు. ఆర్సీబీ మ్యాక్స్వెల్తోపాటు విరాట్ కోహ్లి, యుజువేంద్ర చాహల్ని రిటైన్ చేసుకోవాలనుకుంటున్నట్లు గౌతీ పేర్కొన్నాడు.
దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ 2011లో ఆర్సీబీ జట్టులో చేరాడు.ఇప్పటివరకు 184 మ్యాచ్లు ఆడిన ఏబీ.. 5162 పరుగులు సాధించాడు. ఈ సీజన్లో డివిలియర్స్ 313 పరుగులు చేశాడు. ఇందులో అత్యధికంగా తొలి దశలో చేసినవే. ఇదిలా ఉండగా, సోమవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో కోల్కతా చేతిలో బెంగళూరు ఓటమిపాలైంది. ఆర్సీబీ కెప్టెన్గా విరాట్ కోహ్లికి అదే చివరి మ్యాచ్.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.