RCB:వచ్చే సీజన్కి ఆర్సీబీ డివిలియర్స్ని రిటైన్ చేసుకోదు:గంభీర్
వచ్చే ఐపీఎల్ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) గ్లెన్ మ్యాక్స్వెల్ని జట్టులో కొనసాగించాలని భావిస్తే.. ఏబీ డివిలియర్స్ని రిటైన్ (అంటిపెట్టుకోవడం) చేసుకోకపోవచ్చని భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఈ సీజన్లో ఆర్సీబీ తరఫున అత్యధిక పరుగులు (513)
ఇంటర్నెట్ డెస్క్: వచ్చే ఐపీఎల్ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) గ్లెన్ మ్యాక్స్వెల్ని జట్టులో కొనసాగించాలని భావిస్తే.. ఏబీ డివిలియర్స్ని రిటైన్ చేసుకోకపోవచ్చని భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఈ సీజన్లో ఆర్సీబీ తరఫున అత్యధిక పరుగులు (513) చేసిన మ్యక్సీకి ఆ జట్టులో మంచి భవిష్యత్తు ఉందని, 37 ఏళ్ల డివిలియర్స్కు ఈ అవకాశం లేదని గంభీర్ అన్నాడు. వచ్చే సీజన్లో డివిలియర్స్ని బెంగళూరు రిటైన్ చేసుకోదని భావిస్తున్నారా? అని అడిగిన ప్రశ్నకు..‘అవును. రిటైన్ చేసుకోదు. గ్లెన్ మ్యాక్స్వెల్కి ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. కాబట్టి అతడి రిటైన్ చేసుకుంటుందని అనుకుంటున్నా. డివిలియర్స్కి ఈ అవకాశం లేదు’అని సమాధానమిచ్చాడు. ఆర్సీబీ మ్యాక్స్వెల్తోపాటు విరాట్ కోహ్లి, యుజువేంద్ర చాహల్ని రిటైన్ చేసుకోవాలనుకుంటున్నట్లు గౌతీ పేర్కొన్నాడు.
దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ 2011లో ఆర్సీబీ జట్టులో చేరాడు.ఇప్పటివరకు 184 మ్యాచ్లు ఆడిన ఏబీ.. 5162 పరుగులు సాధించాడు. ఈ సీజన్లో డివిలియర్స్ 313 పరుగులు చేశాడు. ఇందులో అత్యధికంగా తొలి దశలో చేసినవే. ఇదిలా ఉండగా, సోమవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో కోల్కతా చేతిలో బెంగళూరు ఓటమిపాలైంది. ఆర్సీబీ కెప్టెన్గా విరాట్ కోహ్లికి అదే చివరి మ్యాచ్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా