ధోనీకి 10కి 4 మార్కులే: వీరూ
ప్రపంచంలోనే అత్యుత్తమ ఫినిషర్గా పేరుపొందిన ఎంఎస్ ధోనీ ఏడో స్థానంలో బ్యాటింగ్కు రావడంలో అర్థంలేదని టీమ్ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. పరుగులు చేయకుండా ఔటైనా తప్పులేదన్నాడు. కనీసం ముందుగా వచ్చి మిగతా ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపడం సారథిగా...
మహీ పరుగులతో జట్టుకు ప్రయోజనమేంటన్న గౌతీ
ఇంటర్నెట్డెస్క్: ప్రపంచంలోనే అత్యుత్తమ ఫినిషర్గా పేరుపొందిన ఎంఎస్ ధోనీ ఏడో స్థానంలో బ్యాటింగ్కు రావడంలో అర్థంలేదని టీమ్ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. పరుగులు చేయకుండా ఔటైనా తప్పులేదన్నాడు. కనీసం ముందుగా వచ్చి మిగతా ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపడం సారథిగా అతడి కర్తవ్యమని సూచించాడు. ఆఖరి ఓవర్లో చేసిన పరుగులతో జట్టుకు ఏం లాభం జరిగిందని ప్రశ్నించాడు. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో గౌతీ మాట్లాడాడు.
రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో మహీ ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. 217 పరుగుల లక్ష్య ఛేదనలో అనుభవం లేని సామ్ కరణ్, రుతురాజ్ను ముందుగా పంపించాడు. జట్టు విజయానికి 38 బంతుల్లో 103 పరుగులు అవసరమైన దశలో ధోనీ క్రీజులోకి వచ్చాడు. చివరి వరకూ సింగిల్స్కే పరిమితం అయ్యాడు. ఆఖరి ఓవర్లో మాత్రం వరుసగా మూడు సిక్సర్లు బాదినా అప్పటికే ఓటమి ఖరారైపోయింది.
‘నిజం చెప్పాలంటే ధోనీ ఏడో స్థానంలో బ్యాటింగుకు రావడం ఆశ్చర్యం కలిగించింది. కరణ్, రుతురాజ్ను ముందు పంపించడంలో అర్థంలేదు. అలా చేస్తే ముందుండి నడిపించడం ఎలా అవుతుంది? మహీ ఆఖరి ఓవర్లో చేసిన పరుగులతో ఏం ప్రయోజనం? అవి వ్యక్తిగత పరుగులే అవుతాయి. ముందుగా వచ్చి ఔటైనా ఫర్వాలేదు. సారథి ముందుండి నడిపిస్తేనే జట్టు ప్రేరణ పొందుతుంది. సురేశ్ రైనా లేని సమయంలో కరణ్, రుత్రాజ్ను ముందుగా పంపించి నీకన్నా అత్యుత్తమం అన్న భావాన్ని ప్రజల్లో కలిగిస్తున్నావు’ అని గంభీర్ అన్నాడు.
మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం గౌతీ తరహా వ్యాఖ్యలే చేశాడు. రాజస్థాన్ మ్యాచ్లో మహీ సారథ్యం అంత బాగాలేదని ‘క్రిక్బజ్’ కార్యక్రమంలో అన్నాడు. భారీ లక్ష్య ఛేదనలో ఏడో స్థానంలో ఎందుకు వచ్చాడో అర్థం కాలేదని పేర్కొన్నాడు. మ్యాచ్లో అతడి సారథ్యానికి 10కి 4 మార్కులే వేస్తానని వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
David Warner: దిల్లీ ఆటగాడు డేవిడ్ వార్నర్.. భారత గుర్తింపు కార్డు ఆధార్ కోసం పరిగెడుతున్నాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో అతడు హిందీలో మాట్లాడటం విశేషం. -
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
సెంచరీతో చెన్నైపై భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో లఖ్నవూ బ్యాటర్ స్టాయినిస్ కీలక పాత్ర పోషించాడు. ఒకదశలో ఓడిపోతామని భావించిన ఆ జట్టును చివరి వరకూ క్రీజ్లో ఉండి విజయతీరాలకు చేర్చాడు. -
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
చెన్నై కెప్టెన్ రుతురాజ్ సెంచరీతో అలరించినా.. లఖ్నవూ జట్టే విజయం సాధించింది. మార్కస్ స్టాయినిస్ కీలకమైన శతకంతో తన జట్టును గెలిపించాడు. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
-
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి