Hardik Pandya: హార్దిక్ టీ20 జట్టులోకి వస్తాడు.. అయితే: గౌతమ్ గంభీర్
భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య ఫిట్నెస్పైనా, తిరిగి జట్టులోకి చోటుపై చర్చ కొనసాగుతూనే ఉంది. వెన్నునొప్పితో బాధపడిన...
ఇంటర్నెట్ డెస్క్: భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య ఫిట్నెస్పైనా, తిరిగి జట్టులోకి చోటుపై చర్చ కొనసాగుతూనే ఉంది. వెన్నునొప్పితో బాధపడిన హార్దిక్ ఐపీఎల్లోనూ, టీ20 ప్రపంచకప్లోనూ బౌలింగ్ చేయలేదు. స్పెషలిస్ట్ బ్యాటర్గా మాత్రమే సేవలందించాడు. అయితే బ్యాటింగ్లోనూ పెద్దగా రాణించిందేమీ లేదు. టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఎంపిక చేసిన సందర్భంగా చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ మాట్లాడుతూ.. హార్దిక్ బౌలింగ్ చేస్తాడని పేర్కొన్నాడు. అయితే బౌలింగ్ చేయకపోగా.. బ్యాటింగ్లోనూ విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో కివీస్తో మూడు టీ20ల సిరీస్కు హార్దిక్ను జట్టు సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. మరోవైపు యువక్రికెటర్ల నుంచి కూడా పోటీ ఎక్కువైంది. వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ నాటికి ఫిట్నెస్ సాధించి.. బౌలింగ్ చేయగలిగితేనే జట్టులో స్థానం దక్కే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యకు మాజీ క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్ బాసటగా నిలిచాడు. హార్దిక్ తప్పకుండా టీ20 జట్టులోకి వస్తాడనే ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే హార్దిక్ తన ఫిట్నెస్ను మెరుగుపరుచుకోవాలని, బౌలింగ్ చేయగలగాలని అభిప్రాయపడ్డాడు. ఒకవేళ హార్దిక్ ప్లేస్ను భర్తీ చేస్తే.. ఆ ఆటగాళ్లకు కుదురుకునేందుకు కొంత సమయం ఇవ్వాలని, అప్పుడే వారేంటో తెలుసుకోవచ్చని గంభీర్ పేర్కొన్నాడు.
‘‘జట్టులోని ఆరో స్థానం (హార్దిక్ పాండ్య బ్యాటింగ్ ఆర్డర్)లో ఆటగాడి మార్పు ఒక్క రోజులో అయ్యేది కాదు. హార్దిక్ను పరిగణనలోకి తీసుకోకుండా ఉండలేం. ఒకవేళ హార్దిక్ ఫిట్నెస్ సాధించి రెగ్యులర్గా బౌలింగ్ చేస్తే మాత్రం జట్టులోకి వచ్చేందుకు తప్పకుండా అవకాశాలు ఇవ్వాలి. ఇప్పటికీ అతడు యువకుడే కావడం మరో సానుకూలాంశం. ’ అని గంభీర్ విశ్లేషించాడు. అలానే ఇతర ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తే మాత్రం ఎక్కువ సమయం ఇవ్వాలని పేర్కొన్నాడు. అప్పుడే సదరు ఆటగాడి సామర్థాన్ని అంచనా వేసేందుకు వీలు కలుగుతుందని చెప్పాడు. ప్రతి సిరీస్కూ జట్టును మారుస్తూ ఉంటే మాత్రం.. తుది 11 మందిని ఎంచుకోవడానికి ఇబ్బంది పడాల్సి ఉంటుందని వివరించాడు. ప్రస్తుతం ప్రతి ఆటగాడికి ప్రత్యామ్నాయం ఉన్నందున జట్టులో ఎవరూ శాశ్వతం కాదని స్పష్టం చేశాడు. అయితే ఆటగాళ్లకు మన క్రికెట్ బోర్డు అండగా నిలవాలని గంభీర్ సూచించాడు.
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు