Sourav Ganguly: ఆ ముగ్గురూ ఇప్పుడున్న ఆటగాళ్ల కంటే తక్కువ సంపాదించారు: గంగూలీ
సునీల్ గావస్కర్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్ వంటి భారత మాజీ ఆటగాళ్లు ప్రస్తుత భారత ఆటగాళ్లు సంపాదించినంత డబ్బు సంపాదించలేకపోయారని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అన్నారు. కానీ, వాళ్లందరికీ బాగా ఆడాలనే ఆకలి ఉండేదని దాదా పేర్కొన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: సునీల్ గావస్కర్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్ వంటి భారత మాజీ ఆటగాళ్లు ప్రస్తుత భారత ఆటగాళ్లు సంపాదించినంత డబ్బు సంపాదించలేకపోయారని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అన్నారు. కానీ, వాళ్లందరికీ బాగా ఆడాలనే ఆకలి ఉండేదని దాదా పేర్కొన్నాడు. ఆటగాడి ప్రదర్శనతో డబ్బుకు ముడిపెట్టలేమని వివరించాడు. ఆటగాళ్లు డబ్బు కోసం మాత్రమే ఆడరని, సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవడం, భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నామని గర్వంగా చెప్పుకోవడం కోసం కూడా ఆడతారని గంగూలీ అభిప్రాయపడ్డాడు. భారత టీ20 లీగ్ మీడియా హక్కులు రూ.48,390 కోట్ల భారీ మొత్తానికి అమ్ముడైన అనంతరం గంగూలీ ఈ వ్యాఖ్యలు చేశాడు.
‘మొట్ట మొదటి విషయం ఏంటంటే.. డబ్బు అనేది ఆటతీరుకు సంబంధించినది కాదు. సునీల్ గావస్కర్ కాలం నుంచి చూసుకుంటే అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్ వరకు.. ఇప్పుడున్న ఆటగాళ్లు పొందుతున్న డబ్బుకు దగ్గరగా కూడా సంపాదించలేదు. కానీ, వారికి మంచి ప్రదర్శన చేయాలనే ఆకలి ఉండేది’ అని గంగూలీ వ్యాఖ్యానించారు. ‘మీడియా హక్కుల కోసం రెండేళ్ల క్రితమే ప్రణాళిక మొదలైంది. భారత క్రికెట్కు ఈ సంవత్సరం చాలా గొప్పది. భారత టీ20 లీగ్ని విజయవంతంగా పూర్తి చేశాం. అభిమానులతో స్టేడియాలు నిండిపోయాయి. ఇది చాలా పెద్ద డీల్. ద్వైపాక్షిక సిరీస్లు కొనసాగుతాయి. అవి ప్రపంచంలోని ఇతర దేశాలు ఆదాయాన్ని సంపాదించడానికి ఉద్దేశించినవి. వచ్చే రెండేళ్లపాటు భారత టీ20 లీగ్ ప్రస్తుత మాదిరిగానే (74 మ్యాచ్లు) కొనసాగుతుంది’ అని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.