WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్.. భారత్కు వికెట్ కీపర్ ఎవరు? సన్నీ కీలక సూచనలు
వరుసగా రెండోసారి కూడా ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ (WTC Final)కు టీమ్ఇండియా వెళ్లింది. ఈసారైనా ఛాంపియన్గా నిలవాలని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే, ప్రత్యర్థి ఆసీస్ను తక్కువగా అంచనా వేయకూడదు. పేస్ పిచ్లపై చెలరేగుతుంది. అందుకే, జట్టు ఎంపికలో టీమ్ఇండియా (Team India) జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇంటర్నెట్ డెస్క్: బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో (Border - Gavaskar Trophy)ఆసీస్పై నాలుగు టెస్టుల సిరీస్ను 2-1 ఆధిక్యంతో టీమ్ఇండియా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతోపాటు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్కూ చేరింది. జూన్ 7 నుంచి లండన్ వేదికగా ఆస్ట్రేలియాతోనే భారత్ (IND vs AUS) తలపడనుంది. అయితే కీలకమైన పోరుకు ముందే టీమ్ఇండియా పలు విషయాలపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. అందులో తొలుత కీపర్గా ఎవరు ఉంటారు..? అనేది అభిమానుల్లో మెదిలే మొదటి ప్రశ్న. ఎందుకంటే రెగ్యులర్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురై విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇక ఆసీస్తో టెస్టు సిరీస్లో ఆడిన తెలుగు కుర్రాడు కేఎస్ భరత్ గొప్పగా ప్రభావం చూపలేకపోయినా.. ఫర్వాలేదనిపించాడు. ఈ సమయంలో క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ కీలక సూచనలు చేశాడు.
ఇటీవల బ్యాటింగ్లో విఫలమవుతున్న కేఎల్ రాహుల్ను తీసుకోవాలని సన్నీ సూచించాడు. గత సీజన్లో (2021) రాహుల్ ప్రదర్శనను బట్టి కీపర్ -బ్యాటర్గా అక్కరకొస్తాడని చెప్పాడు. ‘‘వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్ను డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ కోసం పరిగణనలోకి తీసుకుంటే.. అతడితో ఐదు లేదా ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయించొచ్చు. అప్పుడు మిడిలార్డర్లో బ్యాటింగ్ విభాగం బలంగా ఉంటుంది. ఇంగ్లాండ్లోని లార్డ్స్లో కేఎల్ సెంచరీ కూడా చేశాడు. తుది జట్టును ఎంపిక చేసుకునేటప్పుడు దీనిని కూడా గమనించాలి’’ అని గావస్కర్ తెలిపాడు.
ఆసీస్తో తొలి రెండు టెస్టుల్లో రాహుల్ విఫలం కావడంతో అతడి స్థానంలో శుభ్మన్ గిల్కు టీమ్ఇండియా మేనేజ్మెంట్ అవకాశం ఇచ్చింది. గిల్ ఓపెనింగ్ బ్యాటరే కానీ, వికెట్ కీపర్ కాదు. కేఎస్ భరత్ను కొనసాగిస్తే మంచిదనే వాదనా వచ్చింది. ఎలాగూ శ్రేయస్ గాయం నుంచి కోలుకుని వస్తాడో లేదో తెలియదు. కాబట్టి, అతడి స్థానంలో కేఎల్ రాహుల్కు అవకాశం ఇస్తే మంచిదని క్రీడా విశ్లేషకులు సూచించారు. రాహుల్కు టెస్టుల్లో వికెట్ కీపింగ్ అనుభవం తక్కువనే చెప్పాలి. కీలకమైన పోరులో అతడికి అలాంటి బాధ్యతలను అప్పగించడమూ సరైంది కాదనే భావనా అభిమానుల్లో నెలకొంది. అయితే, టీమ్ఇండియా ఏం చేస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.