Wimbledon: జకోవిచ్, ఫెదరర్ మళ్లీ..
2019 వింబుల్డన్ ఫైనల్ గుర్తుందా? స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్, సెర్బియా వీరుడు నొవాక్ జకోవిచ్ మధ్య అద్భుత పోరాటాన్ని అభిమానులు అంత తేలిగ్గా మరిచిపోరు. అయిదు సెట్ల హోరాహోరీ పోరులో జకోవిచ్...
వింబుల్డన్లో పోటీపడే అవకాశం
వేర్వేరు పార్శ్వాల్లో దిగ్గజ ఆటగాళ్లు
లండన్: 2019 వింబుల్డన్ ఫైనల్ గుర్తుందా? స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్, సెర్బియా వీరుడు నొవాక్ జకోవిచ్ మధ్య అద్భుత పోరాటాన్ని అభిమానులు అంత తేలిగ్గా మరిచిపోరు. అయిదు సెట్ల హోరాహోరీ పోరులో జకోవిచ్ రెండు మ్యాచ్ పాయింట్లు కాచుకుని అప్పుడు టైటిల్ గెలిచాడు. ఏడాది విరామం తర్వాత జరుగుతున్న వింబుల్డన్లో మరోసారి ఫెదరర్, జకోవిచ్ మధ్య ఫైనల్ పోరాటం అభిమానులకు కనువిందు చేసే అవకాశముంది. ఈసారి వీరిద్దరు వేర్వేరు పార్శ్వాల్లో టైటిల్ కోసం పోటీపడనున్నారు. శుక్రవారం వింబుల్డన్ నిర్వాహకులు డ్రా విడుదల చేశారు. తొలి రౌండ్లో టాప్సీడ్ జకోవిచ్ వైల్డ్ కార్డు ఎంట్రీ 19 ఏళ్ల జాక్ డ్రేపర్తో ఆడనున్నాడు. ఆరో సీడ్ రోజర్ ఫెదరర్ ఫ్రాన్స్ ఆటగాడు అడ్రియన్ మనారినోతో తొలి పోరు ఆడనున్నాడు. 13వసారి వింబుల్డన్ ఫైనల్ చేరుకోవాలంటే మాత్రం అతడు డానియెల్ మెద్వెదెవ్, అలెగ్జాండర్ జ్వెరెవ్లను దాటాలి. రెండుసార్లు ఛాంప్ ఆండీ ముర్రే (బ్రిటన్) 24వ సీడ్ నికోల్జ్ బసిలాష్విలితో తొలి రౌండ్లో పోటీపడనున్నాడు. జకోవిచ్, ముర్రే సెమీస్లో ఎదురుపడొచ్చు. నం.3 నాదల్, నం.5 డొమినిక్ థీమ్ వింబుల్డన్ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. మహిళల విభాగంలో 24వ గ్రాండ్స్లామ్ వేటలో ఉన్న సెరెనా విలియమ్స్ తొలి రౌండ్లో 100వ ర్యాంక్ క్రీడాకారిణి అలెక్జాండ్ర సాస్నోవిచ్తో తలపడనుంది. క్వార్టర్స్లో టాప్సీడ్ ఆష్ బార్టీ, అయిదో సీడ్ బియాంకా ఆండ్రెస్కూ.. అయిదో సీడ్ ఎలీనా స్వితోలినాతో ఆరోసీడ్ సెరెనా ఢీకొనే అవకాశముంది. సోమవారం వింబుల్డన్ ఆరంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ సిమోనా హలెప్ గాయం కారణంగా టోర్నీకి దూరమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. -
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
-
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!