IPL 2021: పంజాబ్ నెగ్గినా ఇంటికే
ఐపీఎల్ సీజన్ను పంజాబ్ విజయంతో ముగించింది. ఆఖరి లీగ్ మ్యాచ్లో సమష్టిగా రాణించిన ఆ జట్టు చెన్నై సూపర్కింగ్స్ను ఓడించింది. రాహుల్ మెరుపు ఇన్నింగ్స్తో ఆ జట్టు గెలుపులో కీలకపాత్ర
చెన్నైపై గెలుపు
చెలరేగిన రాహుల్
ఐపీఎల్ సీజన్ను పంజాబ్ విజయంతో ముగించింది. ఆఖరి లీగ్ మ్యాచ్లో సమష్టిగా రాణించిన ఆ జట్టు చెన్నై సూపర్కింగ్స్ను ఓడించింది. రాహుల్ మెరుపు ఇన్నింగ్స్తో ఆ జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు. అయితే ఈ మ్యాచ్లో గెలిచినా.. రాజస్థాన్ రాయల్స్ను కోల్కతా నైట్రైడర్స్ చిత్తుగా ఓడించడంతో పంజాబ్ (14 మ్యాచ్ల్లో 12 పాయింట్లు) ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతయ్యాయి. మరోవైపు రెండో అంచెలో వరుసగా నాలుగు విజయాలతో ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరిన ధోని సేన..
హ్యాట్రిక్ ఓటమితో (14 మ్యాచ్ల్లో 18 పాయింట్లు) లీగ్ దశను ముగించింది.
దుబాయ్: పంజాబ్ కింగ్స్కు అదిరే విజయం.. గురువారం జరిగిన పోరులో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో చెన్నైని చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 134 పరుగులు చేసింది. డుప్లెసిస్ (76; 55 బంతుల్లో 8×4, 2×6) టాప్ స్కోరర్గా నిలిచాడు. అర్ష్దీప్ సింగ్ (2/35), జోర్డాన్ (2/20) ప్రత్యర్థిని కట్టడి చేశారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కేఎల్ రాహుల్ (98 నాటౌట్; 42 బంతుల్లో 7×4, 8×6) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో లక్ష్యాన్ని పంజాబ్ కేవలం 13 ఓవర్లలో 4 వికెట్లే కోల్పోయి ఛేదించింది. చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ (3/28) ఒక్కడే రాణించాడు.
రాహుల్.. ఫటాఫట్: పంజాబ్ ఛేదనలో రాహుల్ ఆటే హైలైట్. గెలుపు మాత్రమే కాకుండా జట్టు ఓవరాల్ రన్రేట్ పెంచాలన్న లక్ష్యంతో ఆరంభం నుంచే చెన్నై బౌలర్లపై అతడు ఎదురుదాడి చేశాడు. తొలి ఓవర్లోనే రెండు ఫోర్లతో జోరు షురూ చేసిన కేఎల్.. ఆ తర్వాత టాప్గేర్లోకి వెళ్లిపోయాడు. స్వీప్, గ్లాన్స్, పుల్ షాట్లతో చెన్నై బౌలర్లను ఆటాడుకున్నాడు. శార్దూల్ ఠాకూర్ ఒకే ఓవర్లో మయాంక్ (12), సర్ఫ్రాజ్ (0) వికెట్లు తీసినా.. రాహుల్ మాత్రం తగ్గలేదు. శార్దూల్ బౌలింగ్నే ఫ్లిక్తో ఓ అద్భుతమైన సిక్స్ కొట్టిన కేఎల్.. దీపక్ చాహర్ వేసిన ఓ ఫుల్ బంతిని మోకాళ్లు వంచుతూ మరో చూడచక్కని సిక్స్ బాదేశాడు. ఈ క్రమంలోనే అతడు 25 బంతుల్లోనే అర్ధసెంచరీ మార్కు అందుకున్నాడు. పది ఓవర్లకు పంజాబ్ స్కోరు 92 పరుగులు అయితే అందులో రాహుల్ వాటానే 63 పరుగులంటే అతడెంత ధాటిగా ఆడాడో అర్ధం చేసుకోవచ్చు. సిక్స్లే లక్ష్యం అన్నట్లు అతడు ఆడడంతో పంజాబ్ దాదాపు పది రన్రేట్తో దూసుకెళ్లింది. పదకొండో ఓవర్లో దీపక్ బౌలింగ్లో మరో సిక్స్ అందుకున్న రాహుల్.. ఆ తర్వాత బ్రావో బౌలింగ్లో రెండు సిక్స్లు లాగించాడు. ఈ రెండు సిక్స్లలో తొలి సిక్స్ను మణికట్టు ఉపయోగిస్తూ చాలా సులభంగా ఫ్లిక్తో స్టాండ్స్లోకి పంపాడు. ఈ ఒక్క ఓవర్లోనే బ్రావో 20 పరుగులు ఇచ్చుకున్నాడు. 13 ఓవర్ తొలి బంతికి మార్క్రమ్ (13) వెనుదిరిగినా.. మరో కళ్లుచెదిరే సిక్స్తో రాహుల్ మ్యాచ్ను ఘనంగా ముగించాడు.
డుప్లెసిస్ ఒక్కడే: అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన చెన్నై ఇన్నింగ్స్ అంతా డుప్లెసిస్ చుట్టే తిరిగింది. పంజాబ్ బౌలర్ల దెబ్బకు 61 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన జట్టును డుప్లెసిస్ ఆదుకున్నాడు. చివరి వరకు క్రీజులో నిలిచిన అతడు అర్ధసెంచరీ చేయడమే కాక.. జట్టుకు గౌరవప్రదమైన స్కోరు సాధించిపెట్టాడు. జడేజా (15 నాటౌట్)తో కలిసి అతడు ఆరో వికెట్కు విలువైన 67 పరుగులు జత చేశాడు.
చెన్నై ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) షారుక్ఖాన్ (బి) అర్ష్దీప్ 12; డుప్లెసిస్ (సి) రాహుల్ (బి) షమి 76; మొయిన్ అలీ (సి) రాహుల్ (బి) అర్ష్దీప్ 0; ఉతప్ప (సి) హర్ప్రీత్ (బి) జోర్డాన్ 2; రాయుడు (సి) అర్ష్దీప్ (బి) జోర్డాన్ 4; ధోని (బి) రవి బిష్ణోయ్ 12; జడేజా నాటౌట్ 15; బ్రావో నాటౌట్ 4; ఎక్స్ట్రాలు 9 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 134
వికెట్ల పతనం: 1-18, 2-29, 3-32, 4-42, 5-61, 6-128
బౌలింగ్: షమి 4-0-22-1; హర్ప్రీత్ బ్రార్ 4-0-22-0; అర్ష్దీప్ సింగ్ 4-0-35-2; జోర్డాన్ 3-0-20-2; రవి బిష్ణోయ్ 4-0-25-1; హెన్రిక్స్ 1-0-9-0
పంజాబ్ ఇన్నింగ్స్: రాహుల్ నాటౌట్ 98; మయాంక్ ఎల్బీ (బి) శార్దూల్ 12; సర్ఫ్రాజ్ (సి) డుప్లెసిస్ (బి) శార్దూల్ 0; షారుక్ ఖాన్ (సి) బ్రావో (బి) దీపక్ చాహర్ 8; మార్క్రమ్ (సి) ధోని (బి) శార్దూల్ 13; హెన్రిక్స్ నాటౌట్ 3; ఎక్స్ట్రాలు 5 మొత్తం: (13 ఓవర్లలో 4 వికెట్లకు) 139
వికెట్ల పతనం: 1-46, 2-46, 3-80, 4-126
బౌలింగ్: దీపక్ చాహర్ 4-0-48-1; హేజిల్వుడ్ 3-0-22-0; శార్దూల్ ఠాకూర్ 3-0-28-3; జడేజా 1-0-9-0; బ్రావో 2-0-32-0
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘యానిమల్’ టూ ‘రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ