11.2 ఓవర్లలో..
ఎలాంటి డ్రామా లేదు. నాలుగో రోజు పోరాడిన బంగ్లాకు ఆఖరి రోజు టీమ్ఇండియా ఎలాంటి అవకాశం లేదు. కేవలం 11.2 ఓవర్లలోనే మిగతా నాలుగు వికెట్లు పడగొట్టి తొలి టెస్టులో ఘనవిజయం సాధించింది.
చివరి రోజు బంగ్లా ఇన్నింగ్స్కు తెర
తొలి టెస్టులో భారత్ ఘనవిజయం
ఎలాంటి డ్రామా లేదు. నాలుగో రోజు పోరాడిన బంగ్లాకు ఆఖరి రోజు టీమ్ఇండియా ఎలాంటి అవకాశం లేదు. కేవలం 11.2 ఓవర్లలోనే మిగతా నాలుగు వికెట్లు పడగొట్టి తొలి టెస్టులో ఘనవిజయం సాధించింది.
టీమ్ఇండియా లాంఛనాన్ని ముగించింది. ఆఖరి రోజు బంతితో విజృంభించిన భారత్ మొదటి టెస్టులో 188 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను చిత్తు చేసింది. 513 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్నైట్ స్కోరు 272/6తో ఆదివారం ఇన్నింగ్స్ను కొనసాగించిన బంగ్లా.. ఎంతోసేపు నిలవలేదు. మరో 11.2 ఓవర్లలో మిగతా నాలుగు వికెట్లు కోల్పోయి 324 పరుగులకు ఆలౌటైంది. షకిబ్ 84 పరుగులు చేశాడు. అక్షర్ పటేల్ (4/77), కుల్దీప్ యాదవ్ (3/73) బంతితో రాణించారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ 404 పరుగులు చేయగా.. బంగ్లా 150కే కుప్పకూలింది. భారత్ 258/2 వద్ద రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. మ్యాచ్లో ఎనిమిది వికెట్లు పడగొట్టడంతోపాటు విలువైన పరుగులు సాధించిన కుల్దీప్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు. ఈ విజయంతో టీమ్ఇండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో ఒక స్థానం ఎగబాకి మూడో స్థానానికి చేరుకుంది. రెండో టెస్టు ఈ నెల 22న మొదలవుతుంది.
బంగ్లా చకచకా: నాలుగో రోజు పోరాటం చూశాక ఆఖరి రోజు బంగ్లా ఎలా ఆడుతుందన్న ఆసక్తి ఏర్పడింది. కానీ భారత బౌలర్లు ఆ జట్టుకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. చకచకా మిగతా నాలుగు వికెట్లు పడగొట్టి మ్యాచ్ను ముగించారు. మెహదీ హసన్తో కలిసి ఇన్నింగ్స్ కొనసాగించిన షకిబ్.. ధాటిగా బ్యాటింగ్ చేశాడు. ఎటాకింగ్ గేమ్తో ఎడా పెడా ఫోర్లు, సిక్స్లు కొట్టాడు. మెహదీ హసన్ (13) మాత్రం త్వరగా పెవిలియన్ చేరాడు. ఓవర్నైట్ స్కోరుకు కేవలం నాలుగు పరుగులు జోడించిన అతణ్ని.. ఆఖరి రోజు మూడో ఓవర్లో సిరాజ్ ఔట్ చేశాడు. అక్షర్ బౌలింగ్లో సిక్స్తో షకిబ్ అర్ధశతకం పూర్తి చేశాడు. అయితే స్లాగ్ స్వీప్కు ప్రయత్నించిన అతణ్ని బంగ్లా స్కోరు 320 వద్ద కుల్దీప్ బౌల్డ్ చేశాడు. ఎబాదత్ (0)ను కూడా కుల్దీప్ ఔట్ చేయగా.. తైజుల్ (0)ను అక్షర్ బౌల్డ్ చేయడంతో బంగ్లా ఇన్నింగ్స్ ముగిసింది.
భారత్ తొలి ఇన్నింగ్స్: 404;
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: 150
భారత్ రెండో ఇన్నింగ్స్: 258/2 డిక్లేర్డ్
బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్: నజ్ముల్ (సి) పంత్ (బి) ఉమేశ్ 67; జాకిర్ హసన్ (సి) కోహ్లి (బి) అశ్విన్ 100; యాసిర్ అలీ (బి) అక్షర్ 5; లిటన్ దాస్ (సి) ఉమేశ్ (బి) కుల్దీప్ 19; ముష్ఫికర్ (బి) అక్షర్ 23; షకిబ్ (బి) కుల్దీప్ 84; నురుల్ (స్టంప్డ్) పంత్ (బి) అక్షర్ 3; మెహదీ హసన్ (సి) ఉమేశ్ (బి) సిరాజ్ 13; తైజుల్ (బి) అక్షర్ 4; ఎబాదత్ (సి) శ్రేయస్ (బి) కుల్దీప్ 0; ఖాలెద్ నాటౌట్ 0; ఎక్స్ట్రాలు 6 మొత్తం: (113.2 ఓవర్లలో ఆలౌట్) 324; వికెట్ల పతనం: 1-124, 2-131, 3-173, 4-208, 5-234, 6-238, 7-283, 8-320, 9-324; బౌలింగ్: సిరాజ్ 19-4-67-1; ఉమేశ్ యాదవ్ 15-3-27-1; అశ్విన్ 23-7-75-1; అక్షర్ పటేల్ 32.2-10-77-4; కుల్దీప్ 20-3-73-3
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)