FIFA World Cup 2022: ‘బిష్ఠ్’తో మెస్సి .. అందుకే అలా..
ఫైనల్లో ఫ్రాన్స్పై విజయం తర్వాత ప్రపంచకప్ను అందుకోవడానికి ముందు అర్జెంటీనా కెప్టెన్ లియొనెల్ మెస్సి ప్రత్యేక వస్త్రాన్ని ధరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
దోహా: ఫైనల్లో ఫ్రాన్స్పై విజయం తర్వాత ప్రపంచకప్ను అందుకోవడానికి ముందు అర్జెంటీనా కెప్టెన్ లియొనెల్ మెస్సి ప్రత్యేక వస్త్రాన్ని ధరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వేదికపై ఫిఫా అధ్యక్షుడు ఇన్ఫాంటినో సమక్షంలో ఖతార్ చక్రవర్తి షేక్ తమీమ్ బిన్ హమద్ ఈ వస్త్రాన్ని అతనికి తొడిగించారు. మరి అసలు ఆ వస్త్రం ఏమిటీ అంటే.. అది ఖతార్ సంప్రదాయ ‘బిష్ఠ్’. ప్రత్యేక సందర్భాల్లో రాజ కుటుంబీకులు, రాజకీయ నేతలు, మత గురువులు, ధనికులు తదితరులు దీన్ని ధరిస్తారు. దీన్ని వేసుకోవడం వల్ల హుందాగా, ప్రత్యేకంగా కనిపిస్తారు. ప్రపంచకప్ అందుకోవడం మెస్సికి ప్రత్యేక సందర్భం కాబట్టి అతనికి దీన్ని అందించారు.
అరబ్ యుద్ధ వీరులకు, రాజు వంశస్థులకూ ఈ వస్త్రాన్ని బహూకరిస్తారని కొంతమంది చెబుతున్నారు. కప్పు గెలిచిన మెస్సి.. ఫుట్బాల్ కింగ్గా మారాడు కాబట్టి అతనికి దీన్ని ప్రత్యేకంగా అందించారని అంటున్నారు. ‘‘అధికారిక, ప్రత్యేక కార్యక్రమాల్లో ఈ వస్త్రాన్ని ధరిస్తారు. ఇది మెస్సి సంబరాల సందర్భం. అందుకే అతనికి దీన్ని బహూకరించాం. అరబ్, ముస్లిమ్ సంప్రదాయాలను ప్రపంచానికి చాటేందుకు ఈ మెగా టోర్నీ మాకు అవకాశాన్ని కల్పించింది’’ అని ఖతార్ టోర్నీ నిర్వాహక కమిటీ కార్యదర్శి హసన్ అల్ థవాడి పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.