సిరీస్ పట్టేస్తారా?
తొలి టీ20లో నెగ్గినా.. జట్టు ప్రదర్శన అంత ఆశాజనకంగా అయితే లేదు. మెరుగుపడాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి.
లంకతో భారత్ రెండో టీ20 నేడు
రాత్రి 7 నుంచి
ఒక్క రోజే విరామం. అంతలోనే భారత్, శ్రీలంక జట్లు మరో టీ20 సమరానికి సిద్ధమైపోయాయి. వేదిక ముంబయి నుంచి పుణెకు మళ్లింది. గురువారమే రెండో టీ20. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన తొలి టీ20లో రెండు పరుగుల తేడాతో గట్టెక్కిన టీమ్ఇండియా.. ఈసారి సాధికారికమైన ఆటతో మ్యాచ్ను నెగ్గి సిరీస్ను సొంతం చేసుకోవాలని చూస్తోంది.
పుణె: తొలి టీ20లో నెగ్గినా.. జట్టు ప్రదర్శన అంత ఆశాజనకంగా అయితే లేదు. మెరుగుపడాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. బ్యాటింగ్లో బాగా తడబడ్డ భారత్.. చివర్లో దీపక్ హుడా, అక్షర్ల మెరుపులు లేకుంటే స్వల్ప స్కోరుకు పరిమితం అయ్యేదే. ఇక బౌలర్లు ఆరంభంలో బాగా బౌలింగ్ చేసి, మధ్యలో పట్టు కోల్పోయే బలహీనతను కొనసాగించారు. లంక ఈ మ్యాచ్లో విజయానికి చేరువగా వెళ్లి త్రుటిలో ఓడింది.
కుర్రాళ్లు సత్తాచాటాలి: లేక లేక అవకాశాలు అందుకున్న యువ బ్యాటర్లు ఈ మ్యాచ్లో సత్తా చాటలేకపోయారు. టెస్టులు, వన్డేల్లో సత్తా చాటుకుని మంగళవారమే టీ20 అరంగేట్రం చేసిన శుభ్మన్ తీవ్రంగా నిరాశ పరిచాడు. 7 పరుగులకే వెనుదిరిగాడు. అతను క్రీజులో ఉన్నంతసేపు నెమ్మదిగా ఆడడం పట్ల విమర్శలు వ్యక్తమయ్యాయి. అతను ఓ పెద్ద ఇన్నింగ్స్ ఆడడమే కాక, స్ట్రైక్ రేట్ కూడా మెరుగ్గా ఉండేలా చూసుకోవడం అవసరం. ఇక చాన్నాళ్ల తర్వాత తుది జట్టులోకి వచ్చిన సంజు శాంసన్ కూడా అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. అతను గాయపడడంతో రుతురాజ్, రాహుల్ త్రిపాఠిల్లో ఒకరికి తుది జట్టులో చోటు దక్కొచ్చు. ఇక భీకర ఫామ్తో సిరీస్లో బరిలోకి దిగిన కొత్త వైస్ కెప్టెన్ సూర్యకుమార్ కూడా ముంబయిలో విఫలమయ్యాడు. అతడి నుంచి అభిమానులు 360 డిగ్రీ మెరుపులను ఆశిస్తున్నారు. ఓపెనర్ ఇషాన్ కిషన్, కెప్టెన్ హార్దిక్లతో పాటు దీపక్ హుడా, అక్షర్ పటేల్ తొలి టీ20లో చక్కటి ఇన్నింగ్స్ ఆడారు. బౌలింగ్లో అరంగేట్ర బౌలర్ శివమ్ మావితో పాటు ఉమ్రాన్ మాలిక్ సత్తా చాటారు. మరో పేసర్ హర్షల్ పటేల్ రెండు వికెట్లు పడగొట్టినా.. ఎప్పట్లాగే ఎక్కువ పరుగులు ఇచ్చేశాడు. తిరిగి తుది జట్టులో చోటు దక్కించుకున్న సీనియర్ స్పిన్నర్ చాహల్.. పూర్తిగా తేలిపోయాడు. వికెట్ పడగొట్టలేదు. ధారాళంగా పరుగులిచ్చేశాడు. అక్షర్ పటేల్ చివరి ఓవర్లో ఆకట్టుకున్నా.. మొత్తంగా అతడి బౌలింగ్ ప్రదర్శన అంత గొప్పగా లేదు. బ్యాటర్లు, బౌలర్లు పట్టు వదలకుండా నిలకడగా రాణిస్తేనే సిరీస్ విజయం సొంతమవుతుంది.
స్పిన్తో జాగ్రత్త: ప్రస్తుత లంక జట్టుతో అంత తేలిక కాదని టీమ్ఇండియాకు తొలి టీ20లో బాగానే అర్థమై ఉంటుంది. ఆ జట్టు బౌలర్లు ఎంతో మెరుగైన ప్రదర్శన చేశారు ముంబయిలో. ముఖ్యంగా స్పిన్నర్లు హసరంగ, తీక్షణ, ధనంజయ బాగా ఇబ్బంది పెట్టారు. పుణె పిచ్ కూడా స్పిన్కు సహకరించేదే కావడంతో వీరితో జాగ్రత్తగా ఉండాల్సిందే. బ్యాటింగ్లో కెప్టెన్ శానక, వికెట్ కీపర్ కుశాల్ మెండిస్లతోనే ప్రధానంగా ముప్పు పొంచి ఉంది. తొలి టీ20లో విఫలమైనప్పటికీ నిశాంక, అసలంక, రాజపక్స ప్రమాదకారులే. పుణె పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తూనే బ్యాటింగ్కూ అనుకూలిస్తుందని అంచనా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
ముంబయి ఇండియన్స్ గురించి భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు ఇప్పటికీ రోహిత్ శర్మ (Rohit Sharma)నే కెప్టెన్గా భావిస్తున్నారని వ్యాఖ్యానించాడు. -
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్లో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఎవరైతే బాగుంటారు. -
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. -
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?