రోడ్డెక్కిన కుస్తీ యోధులు
భారత రెజ్లింగ్లో కలకలం. రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపిస్తూ అనేకమంది అగ్రశ్రేణి రెజ్లర్లు అసాధారణ రీతిలో రోడ్డెక్కారు.
రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని వినేశ్ ఆరోపణ
డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు దిగిపోవాలంటూ నిరసన
భారత రెజ్లింగ్లో కలకలం. రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపిస్తూ అనేకమంది అగ్రశ్రేణి రెజ్లర్లు అసాధారణ రీతిలో రోడ్డెక్కారు. అతడు దిగిపోయేవరకు నిరసన కొనసాగుతుందని ప్రకటించారు. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించాడంటూ డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిపై వినేశ్ ఫొగాట్ తీవ్రమైన ఆరోపణలు చేసింది.
దిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా టోక్యో ఒలింపిక్ కాంస్య పతక విజేత బజ్రంగ్ పునియా, ప్రపంచ ఛాంపియన్షిప్ పతక విజేత వినేశ్ ఫొగాట్ సహా అనేక మంది మేటి రెజ్లర్లు దిల్లీలో నిరసనకు దిగారు. బ్రిజ్ భూషణ్ భాజపా ఎంపీ కూడా. జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగిన 30 మంది అథ్లెట్లలో బజ్రంగ్, వినేశ్తో పాటు రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్, ప్రపంచ ఛాంపియన్షిప్ పతక విజేత సరిత మోర్, సంగీత ఫొగాట్, సత్యవర్త్ మలిక్ కూడా ఉన్నారు. ‘‘మా పోరాటం ప్రభుత్వం లేదా క్రీడామంత్రిత్వ శాఖ లేదా భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్)పై కాదు. మా పోరాటం డబ్ల్యూఎఫ్ఐపైనే. మా పోరాటం ముగింపు వరకు కొనసాగుతుంది’’ అని బజ్రంగ్ పునియా అన్నాడు. ‘‘సమాఖ్య అధ్యక్షుణ్ని తొలగించేంత వరకు మేము ఎలాంటి అంతర్జాతీయ పోటీల్లో పోటీపడం. భారత రెజ్లింగ్ను కాపాడేందుకే ఈ పోరాటం. అధ్యక్షుణ్ని తప్పించేవరకు నిరసన కొనసాగిస్తాం. మాకు విదేశీ కోచ్ల మద్దతు లేదు. కానీ అధ్యక్షుడు తన అకాడమీలో మాత్రం విదేశీ కోచ్ను నియమించుకున్నాడు. అతడు రెజ్లర్లపై అసభ్య పదజాలాన్ని వాడాడు. దానికి సంబంధించిన వీడియోలు కూడా మా వద్ద ఉన్నాయి’’ అని అతడు చెప్పాడు. ‘‘దేశం తరఫున పతకాలు గెలవడానికి క్రీడాకారులు ఎంతో కృషి చేస్తున్నారు. మమ్మల్ని ఇబ్బందిపెట్టడం తప్ప సమాఖ్య చేసిందేమీ లేదు. అథ్లెట్లను వేధించడం కోసం అసంబద్ధమైన నిబంధనలు రూపొందించారు’’ అని సాక్షి మలిక్ ట్వీట్ చేసింది. ‘బాయ్కాట్ డబ్ల్యూఎఫ్ఐప్రెసిడెంట్’ అన్న హ్యాష్ట్యాగ్తో అన్షు మలిక్, సంగీత ఫొగాట్ కూడా దాదాపు ఇదే భావంతో ట్వీట్ చేశారు. బ్రిజ్ భూషణ్ 2011 నుంచి పదవిలో ఉంటున్నాడు. 2019 ఫిబ్రవరిలో మూడోసారి డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.
మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించాడు: బ్రిజ్ భూషణ్ చాలా ఏళ్లుగా మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నాడని వినేశ్ ఫొగాట్ ఆరోపించింది. ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షా వెంటనే జోక్యం చేసుకుని అతణ్ని పదవి నుంచి తప్పించాలని కోరింది. లఖ్నవూలో జాతీయ శిబిరంలో అనేక మంది కోచ్లు మహిళా రెజ్లర్లను లైంగిక దోపిడీ చేశారని చెప్పింది. బ్రిజ్ భూషణ్ తరఫున శిబిరంలో కొంతమంది మహిళలు.. రెజ్లర్లను సంప్రదించారని అంది. అయితే తాను మాత్రం ఎలాంటి లైంగిక వేధింపులకు గురికాలేదని 28 ఏళ్ల వినేశ్ స్పష్టం చేసింది. ఓ బాధితురాలు ఇప్పుడు నిరసనలో పాల్గొన్నదని తెలిపింది. ‘‘డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు తమను లైంగికంగా వేధించాడని కనీసం 10-20 మంది రెజ్లర్లు నాతో చెప్పారు. వాళ్ల తమ కథలను నాతో చెప్పారు. వారి పేర్లను ఇప్పుడు నేను వెల్లడించలేను. ప్రధానమంత్రి, హోమంత్రిని కలిసే అవకాశం వస్తే మాత్రం చెబుతా’’ అని జంతర్ మంతర్ వద్ద నాలుగు గంటలపాటు నిరసన వ్యక్తం చేసిన అనంతరం మీడియాతో వినేశ్ చెప్పింది. ‘‘డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడికి సన్నిహితులైన వ్యక్తుల నుంచి.. చంపేస్తామంటూ నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఇక్కడ నిరసనకు దిగిన వారిలో ఎవరికి ఎలాంటి హాని జరిగినా బాధ్యత బ్రిజ్ భూషణ్దే’’ అని వ్యాఖ్యానించింది. తాను ధైర్యంగా మాట్లాడడం వల్ల తనపై ‘క్రమశిక్షణ లేని అథ్లెట్’ అన్న ముద్ర వేశారని వినేశ్ అంది. టోక్యో ఒలింపిక్స్ సందర్భంగా అధికారిక జెర్సీని ధరించకపోవడంతో వినేశ్పై డబ్ల్యూఎఫ్ఐ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఆమెపై నిషేధం విధించింది. కానీ వినేశ్ క్షమాపణలు చెప్పడంతో నిషేధాన్ని తొలగించింది. తీవ్ర ఆరోపణల నేపథ్యంలో క్రీడల మంత్రిత్వ శాఖ స్పందించింది. 72 గంటల్లోగా వివరణ ఇవ్వాలని డబ్ల్యూఎఫ్ఐని ఆదేశించింది. వివరణ ఇవ్వకపోతే జాతీయ క్రీడా నియమావళి ప్రకారం సమాఖ్యపై చర్యలు తీసుకుంటామని చెప్పింది. బుధవారం ఆరంభంకావాల్సి ఉన్న జాతీయ శిబిరాన్ని క్రీడా మంత్రిత్వ శాఖ రద్దు చేసింది.
ఆరోపణల్లో నిజం లేదు: భూషణ్
తనపై వచ్చిన ఆరోపణలను బ్రిజ్ భూషణ్ తిరస్కరించాడు. పదవి నుంచి దిగిపోవడానికి నిరాకరించాడు. ‘‘నాపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదు. నేనెందుకు వైదొలగాలి? ఒక్క మహిళ అయినా ముందుకొచ్చి లైంగిక వేధింపుల ఆరోపణలు రుజువు చేస్తే ఉరి శిక్షకు సిద్ధం. నాపై ఓ పారిశ్రామికవేత్త కుట్ర చేస్తున్నాడు. ఈ ఆరోపణలపై సీబీఐ లేదా పోలీసులు దర్యాప్తు చేయొచ్చు. ఇదే రెజ్లర్లు ఒక వారం కింద నన్ను కలిశారు. ఏమీ చెప్పలేదు’’ అని చెప్పాడు. వినేశ్ను చంపుతామని తన తరఫున ఎవరో బెదరించారన్న ఆరోపణలపై స్పందిస్తూ.. ‘‘ఆమె పోలీసులను ఎందుకు సంప్రదించలేదు? ప్రధానమంత్రి లేదా క్రీడల మంత్రిని ఎందుకు కలవలేదు’’ అని బ్రిజ్ భూషణ్ అన్నాడు. ఇటీవల తెచ్చిన కొత్త నిబంధనలు అసౌకర్యం కలిగించడమే రెజ్లర్ల నిరసనకు కారణం కావొచ్చని చెప్పాడు. జాతీయ ఛాంపియన్షిప్లో ఆడాలని, సెలక్షన్ ట్రయల్స్కు హాజరుకావాలని రెజ్లర్లకు చెప్పడంలో తప్పులేదని అన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు.
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?