Shubman gill: బల్లగుద్ది చెప్పాడు.. ఎన్నో ప్రశ్నలకు బదులిచ్చేశాడు!
బంగ్లాదేశ్పై మెరుపు డబుల్ సెంచరీ సాధించిన ఇషాన్ కిషన్ను కాదని ఓపెనింగ్లో చోటివ్వడమా? అసలు పరిమిత ఓవర్ల క్రికెట్కు అతడి వేగం
బంగ్లాదేశ్పై మెరుపు డబుల్ సెంచరీ సాధించిన ఇషాన్ కిషన్ను కాదని ఓపెనింగ్లో చోటివ్వడమా? అసలు పరిమిత ఓవర్ల క్రికెట్కు అతడి వేగం సరిపోతుందా? దూకుడుకు మారుపేరైన ఎంతోమంది కుర్రాళ్లుండగా అతణ్ని ఆడించడం సరైందేనా?.. శ్రీలంక సిరీస్ ముంగిట శుభ్మన్ గిల్ విషయంలో ఇలా ఎన్నెన్నో సందేహాలు, ప్రశ్నలు! కానీ కొన్ని రోజులు గడిచాయో లేదో.. ఇప్పుడందరూ ప్రశ్నలు మానేసి, శుభ్మన్ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. శ్రీలంకపై ఓ అర్ధశతకం, ఓ శతకంతో విమర్శకులకు బదులిచ్చిన శుభ్మన్.. న్యూజిలాండ్తో తొలి వన్డేలో ఏకంగా డబుల్ సెంచరీ బాదేసి ఔరా అనిపించాడు. ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే ప్రపంచకప్కు ఓపెనర్ తనే అని ఈ ఇన్నింగ్స్తో అతను బల్లగుద్ది చెప్పాడు. ఈ ఒక్క ఇన్నింగ్స్తో అతను చాలా ప్రశ్నలకు బదులిచ్చేశాడనే చెప్పాలి.
సెంచరీ కొట్టిన వెంటనే డబుల్ సెంచరీ బాదడం అతడి సూపర్ ఫామ్కు, నిలకడకు రుజువైతే.. పరిమిత ఓవర్ల క్రికెట్కు తగ్గట్లు వేగంగా ఆడలేడన్న విమర్శకు కూడా ఈ ఇన్నింగ్స్తోనే అతను సమాధానం చెప్పాడు. 150 నుంచి 200కు కేవలం 23 బంతుల్లోనే చేరుకోవడం.. డబుల్ సెంచరీ కష్టమనుకున్న దశలో వరుసగా మూడు సిక్సర్లు బాది ఆ మైలురాయిని చేరుకోవడం.. గిల్ దూకుడుకు నిదర్శనం. సంప్రదాయ షాట్లతోనే విధ్వంసం సృష్టించగలనని గిల్ ఉప్పల్లో చాటిచెప్పాడు. గత కొంత కాలంగా ధావన్, కేఎల్ రాహుల్ల వైఫల్యంతో ఓపెనింగ్ విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్న భారత్కు గిల్ రూపంలో పరిష్కారం దొరికింది. ఇషాన్ కూడా సత్తా చాటుకున్నప్పటికీ.. అతడికి కూడా నిలకడ లేమి సమస్య ఉంది. ఇషాన్ కూడా కుదురుకుంటే ప్రపంచకప్ వరకు బ్యాటింగ్ ఆర్డర్లో దిగువన ఆడొచ్చు. ప్రపంచకప్ తర్వాత రోహిత్ తప్పుకుంటే శుభ్మన్కు జోడీగా ఓపెనర్గా స్థిరపడడానికి అవకాశముంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..