సంక్షిప్త వార్తలు(5)
ఈ రంజీ సీజన్లో ఘోరంగా విఫలమైన హైదరాబాద్.. ఆఖరి మ్యాచ్లో పరువు కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోంది.
హైదరాబాద్ 247/4
ఈనాడు, హైదరాబాద్: ఈ రంజీ సీజన్లో ఘోరంగా విఫలమైన హైదరాబాద్.. ఆఖరి మ్యాచ్లో పరువు కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. మంగళవారం ఉప్పల్లో దిల్లీతో ప్రారంభమైన మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన హైదరాబాద్.. ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్లకు 247 పరుగులు సాధించింది. కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (23), రాహుల్ రాదేశ్ (41) తొలి వికెట్కు 55 పరుగులు జోడించి జట్టుకు శుభారంభం అందించారు. అయితే మొదట తన్మయ్.. అనంతరం రాహుల్, నితేశ్రెడ్డి (0) ఔటవడంతో హైదరాబాద్ ఇబ్బందుల్లో పడింది. ఈ స్థితిలో రోహిత్ రాయుడు (90 బ్యాటింగ్; 197 బంతుల్లో 8×4, 1×6), చందన్ సహాని (67; 126 బంతుల్లో 5×4, 3×6) నాలుగో వికెట్కు 132 పరుగులు జతచేసి జట్టును పటిష్ట స్థితికి చేర్చారు. దిల్లీ బౌలర్లలో దివిజ్ మెహ్రా (2/38) రాణించాడు.
ఆంధ్రకు ఆధిక్యం
ఈనాడు, విజయనగరం: అస్సాంతో రంజీ ట్రోఫీ మ్యాచ్లో ఆంధ్ర తొలి రోజే ఆధిక్యం సంపాదించింది.పేసర్లు మాధవ రాయుడు (4/12), శశికాంత్ (3/34)ల దెబ్బకు అస్సాం చేతులెత్తేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన అస్సాం తొలి ఇన్నింగ్స్లో 37.5 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. రిషవ్ దాస్ (30) టాప్ స్కోరర్. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర తొలి ఇన్నింగ్స్లో 47 ఓవర్లలో 3 వికెట్లకు 160 పరుగులు సాధించింది. కెప్టెన్ హనుమ విహారి (80; 123 బంతుల్లో 11×4, 1×6), అభిషేక్రెడ్డి (75; 129 బంతుల్లో 11×4) రెండో వికెట్కు 148 పరుగులు జోడించారు. ప్రస్తుతం ఆంధ్ర 47 పరుగుల ఆధిక్యంతో ఉంది. రికీ భుయ్ (1 బ్యాటింగ్), కరణ్ షిండే (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
మెయిన్ డ్రాకు ప్రియాంశు
జకార్త్తా: ఇండోనేసియా మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ ఆటగాడు ప్రియాంశు రజావత్ మెయిన్ డ్రాలో అడుగుపెట్టాడు. మంగళవారం పురుషుల సింగిల్స్ తొలి అర్హత రౌండ్లో ప్రియాంశు 21-17, 21-19తో పొపోవ్ (ఫ్రాన్స్)పై, రెండో రౌండ్లో 21-10, 13-21, 21-13తో స్వెండెన్సెన్ (డెన్మార్క్)పై గెలిచి మెయిన్ డ్రా చేరుకున్నాడు. సాయి ప్రణీత్ మెయిన్ డ్రాకు అర్హత సాధించలేకపోయాడు. తొలి రౌండ్లో 21-18, 9-21, 21-15తో ఇమాన్యుయెల్ రుంబే (ఇండోనేసియా)పై గెలిచిన సాయి ప్రణీత్.. రెండో రౌండ్లో 18-21, 19-21తో జూన్ వీ (మలేసియా) చేతిలో ఓడాడు. మిక్స్డ్ డబుల్స్ తొలి అర్హత రౌండ్లో రోహన్ కపూర్- సిక్కిరెడ్డి జోడీ 21-15, 21-18తో లీ వీ- చాంగ్ చింగ్ (చైనీస్ తైపీ) జంటపై నెగ్గి మెయిన్ డ్రా చేరుకుంది. సుమీత్రెడ్డి- అశ్విని పొన్నప్ప 20-22, 17-21తో హిదాయతుల్లా- ఐస్యా పుత్రి (ఇండోనేసియా)ల చేతిలో ఓడారు.
ఆస్ట్రేలియా పన్నెండోసారి
ప్రపంచకప్ హాకీ సెమీస్లోకి
భువనేశ్వర్: ఆధిపత్యాన్ని చాటుకుంటూ టైటిల్ ఫేవరెట్ ఆస్ట్రేలియా ప్రపంచకప్ హాకీ టోర్నీలో వరుసగా పన్నెండోసారి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం క్వార్టర్స్లో ఆ జట్టు 4-3 గోల్స్తో స్పెయిన్ను ఓడించింది. హేవార్డ్ (33వ, 37వ) రెండు గోల్స్తో ఆసీస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఫ్లయిన్ (30వ), కెప్టెన్ జాలెస్కీ (32వ) చెరో గోల్ చేశారు. స్పెయిన్ జట్టులో గిస్పెర్ట్ (20వ), రెకాసెన్స్ (24వ) మిరాల్స్ (41వ) బంతిని లక్ష్యానికి చేర్చారు. నాలుగు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా స్పెయిన్కు పెనాల్టీ స్ట్రోక్ దక్కడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. కానీ మిరాల్స్ స్కోరు చేయడంలో విఫలం కావడంతో స్పెయిన్కు ఓటమి తప్పలేదు.
ఆసీస్ వార్మప్ మ్యాచ్ ఎందుకు ఆడట్లేదు?: క్లార్క్
మెల్బోర్న్: భారత్తో నాలుగు టెస్టుల సిరీస్కు ముందు ఆస్ట్రేలియా ఎందుకు వార్మప్ మ్యాచ్ ఆడట్లేదని ఆ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ప్రశ్నించాడు. సన్నాహక మ్యాచ్ లేకపోవడం ఆసీస్ ప్రదర్శనపై ప్రభావం చూపుతుందని అతనన్నాడు. ‘‘భారత్తో తొలి టెస్టు ముందు ఆస్ట్రేలియా టూర్ మ్యాచ్ ఆడట్లేదు. ఇది మా ఆటగాళ్ల ప్రదర్శనపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి. ఆస్ట్రేలియా పిచ్లకు భారత్లో ఆడటానికి ఎంతో తేడా ఉంది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే స్పిన్ ఎదుర్కోవాలి. రివర్స్ స్వింగ్ ఆడేందుకు సిద్ధంగా ఉండాలి. ఇదో సవాల్. ఒక్కోసారి మూడు రోజుల్లో కూడా మ్యాచ్ ముగిసిపోతుంది’’ అని క్లార్క్ అన్నాడు. తాజాగా మాజీ వికెట్కీపర్ ఇయాన్ హీలీ కూడా క్లార్క్ మాదిరే తమ జట్టు వార్మప్ మ్యాచ్ ఆడకపోవడాన్ని తప్పుబట్టాడు. కానీ కోచ్ ఆండ్రూ మెక్డొనాల్డ్ భిన్నంగా స్పందించాడు. ఇటీవల కొన్ని పర్యటనల్లో సన్నాహక మ్యాచ్లు ఆడకుండానే ఆస్ట్రేలియా నేరుగా బరిలో దిగిందని.. సన్నద్ధత పేరుతో పర్యటనను పొడిగించాలనుకోవట్లేదని అన్నాడు. ఫిబ్రవరి 9న భారత్-ఆస్ట్రేలియా నాలుగు టెస్టుల సిరీస్ మొదలు కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
క్రికెటర్లు తాము కొట్టే షాట్.. లేదా తీసే వికెట్ జీవితాంతం మరిచిపోకుండా ఉంటారు. అలాంటి అనుభవం పంజాబ్ బ్యాటర్ అశుతోష్ శర్మకూ ఎదురైంది. -
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. తన సొంత మైదానంలో లఖ్నవూ జట్టు చెన్నైను ఢీకొట్టనుంది. -
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..