పంత్ ఒక్కడే
2022 సంవత్సరానికి గాను ఐసీసీ పురుషుల టెస్టు జట్టులో టీమ్ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్కు చోటు లభించింది. భారత్ నుంచి ఐసీసీ టెస్టు జట్టులో అతనొక్కడే స్థానం సంపాదించాడు.
ఐసీసీ టెస్టు జట్టులో రిషబ్కు స్థానం
దుబాయ్: 2022 సంవత్సరానికి గాను ఐసీసీ పురుషుల టెస్టు జట్టులో టీమ్ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్కు చోటు లభించింది. భారత్ నుంచి ఐసీసీ టెస్టు జట్టులో అతనొక్కడే స్థానం సంపాదించాడు. 2022లో 12 ఇన్నింగ్స్ల్లో 61.81 సగటుతో పంత్ 680 పరుగులు రాబట్టాడు. అందులో రెండు శతకాలు, నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాయి. దూకుడైన నాయకత్వంతో ఇంగ్లాండ్ టెస్టు క్రికెట్ ముఖచిత్రాన్ని మార్చిన బెన్ స్టోక్స్ ఐసీసీ టెస్టు జట్టుకు కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఇంగ్లాండ్ ఆటగాళ్లు జానీ బెయిర్స్టో, జేమ్స్ అండర్సన్లకు జట్టులో చోటు దక్కింది. పాట్ కమిన్స్ సహా నలుగురు ఆస్ట్రేలియా నుంచి నలుగురు క్రికెటర్లకు స్థానం లభించింది. దక్షిణాఫ్రికా పేసర్ రబాడ, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్, వెస్టిండీస్ సారథి క్రెయిగ్ బ్రాత్వైట్ కూడా ఈ జట్టులో ఉన్నారు.
వన్డే జట్టులో అయ్యర్, సిరాజ్
2022 ఐసీసీ వన్డే జట్టులో టీమ్ఇండియా నుంచి శ్రేయస్ అయ్యర్, మహ్మద్ సిరాజ్లకు స్థానం లభించింది. నిరుడు 17 వన్డేలాడిన అయ్యర్ 55.69 సగటుతో 724 పరుగులు సాధించాడు. అందులో ఒక శతకం, ఆరు అర్ధ సెంచరీలు ఉన్నాయి. సిరాజ్ 15 వన్డేల్లో 24 వికెట్లు తీశాడు.
మహిళల బృందంలో మంధాన, హర్మన్, రేణుక
ఐసీసీ మహిళల వన్డే జట్టులో ముగ్గురు భారత క్రికెటర్లకు చోటు దక్కింది. 11 మంది సభ్యుల జట్టులో ఓపెనర్ స్మృతి మంధానా, కెప్టెన్ హర్మర్ప్రీత్ కౌర్, పేసర్ రేణుక సింగ్ స్థానం సంపాదించారు. 2022లో మంధానా ఒక శతకం, ఆరు అర్ధ సెంచరీలతో సత్తాచాటింది. హర్మన్ రెండు శతకాలు, అయిదు అర్ధ సెంచరీలతో మెరిసింది. నిరుడు ఏడు వన్డేలాడిన రేణుక 18 వికెట్లు పడగొట్టింది. భారత్తో పాటు దక్షిణాఫ్రికా నుంచి ముగ్గురు క్రికెటర్లు జట్టులో సంపాదించారు.
ఐసీసీ టెస్టు జట్టు: స్టోక్స్ (కెప్టెన్), ఖవాజా, క్రెయిన్ బ్రాత్వైట్, లబుషేన్, బాబర్, బెయిన్స్టో, పంత్ (వికెట్ కీపర్), కమిన్స్, రబాడ, లైయన్, అండర్సన్.
ఐసీసీ వన్డే జట్టు: బాబర్ (కెప్టెన్), హెడ్, షై హోప్, శ్రేయస్, లేథమ్ (వికెట్ కీపర్), సికందర్ రజా, మెహిదీ హసన్ మిరాజ్, అల్జారి జోసెఫ్, సిరాజ్, బౌల్ట్, జంపా.
ఐసీసీ మహిళల వన్డే జట్టు: అలీసా హీలీ (వికెట్ కీపర్), బెత్ మూనీ, స్మృతి మంధాన, హర్మన్ప్రీత్, రేణుక, లారా వోల్వార్డ్, అయబొంగా ఖాకా, షబ్నిమ్, నాట్ సీవర్, సోఫీ ఎకిల్స్టోన్, ఎమీలియా కెర్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీకి అరుదైన గౌరవం.. జైపుర్ మ్యూజియంలో మైనపు విగ్రహం
టీమ్ఇండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీకి మరో అరుదైన గౌరవం దక్కింది. -
ఐపీఎల్లో ఆ రూల్ నాకు నచ్చలేదు: రోహిత్ శర్మ
ఐపీఎల్లో అనుసరిస్తున్న ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తనకు అంతగా నచ్చలేదని ముంబయి స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) అన్నాడు. -
స్వదేశంలో జోఫ్రా ఆర్చర్ వరల్డ్ కప్ ఆడటం కష్టమేనా..?
ఐపీఎల్ ముగిసిన వారం తర్వాత టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అయితే, ఇంగ్లాండ్ స్టార్ పేసర్ మాత్రం ఆడే అవకాశాలు తక్కువే. -
ముంబయి గెలవాలంటే.. హార్దిక్ ఫామ్ అందుకోవడం అత్యవసరం: ఫించ్
ముల్లాన్పుర్ వేదికగా పంజాబ్తో తలపడేందుకు ముంబయి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఆ జట్టు విజయం సాధించాలంటే కెప్టెన్ రాణించాలని మాజీ క్రికెటర్ ఫించ్ వ్యాఖ్యానించాడు. -
అనుమానిత బుకీలను గుర్తించిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్!
ఐపీఎల్లో ఎలాంటి అనైతిక కార్యకలాపాలు జరగకుండా చూసేందుకు ఏర్పాటైన యాంటీ కరప్షన్ యూనిట్ తన పనిని మొదలు పెట్టింది. -
డేవన్ కాన్వే ఔట్.. మరో సీనియర్ ప్లేయర్కు చెన్నై అవకాశం
న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు డేవన్ కాన్వే ప్రస్తుత ఐపీఎల్ సీజన్ నుంచి వైదొలిగాడు. గాయం కారణంగా ఆటడం లేదని ఐపీఎల్ మేనేజ్మెంట్ వెల్లడించింది. -
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
ఐపీఎల్లో చెన్నై జట్టును తక్కువ చేయడం సరికాదని భారత మాజీ క్రికెటర్ శివరామకృష్ణన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. -
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
పొట్టి కప్ కోసం జట్టు ఎంపికపై ఇప్పటి వరకు తానెవరినీ కలవలేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్పష్టం చేశాడు. -
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
భారీ విజయంతో దిల్లీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగు పర్చుకుంది. సొంతమైదానంలోనే గుజరాత్ను చిత్తు చేసి ఈ సీజన్ ఐపీఎల్లో దిల్లీ మూడో విజయాన్ని నమోదు చేసింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
విధుల్లో అలసత్వం.. ఆరుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు
-
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
‘కేజ్రీవాల్ హత్యకు కుట్ర’.. ఆప్ తీవ్ర ఆరోపణలు
-
దక్షిణాదిలో ఈసారి భాజపా అత్యుత్తమ పనితీరు: అమిత్ షా
-
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు