భారత్ 8 జపాన్ 0
పురుషుల హాకీ ప్రపంచకప్లో ఫైనల్ ఆశలు తెరపడ్డాక భారత జట్టు చెలరేగిపోయింది. గురువారం గోల్స్ వర్షం కురిపించింది.
రవుర్కెలా: పురుషుల హాకీ ప్రపంచకప్లో ఫైనల్ ఆశలు తెరపడ్డాక భారత జట్టు చెలరేగిపోయింది. గురువారం గోల్స్ వర్షం కురిపించింది. వర్గీకరణ మ్యాచ్లో 8-0తో జపాన్ను చిత్తుగా ఓడించింది. భారత్ తరఫున అభిషేక్ (36వ, 44వ), హర్మన్ప్రీత్ సింగ్ (46వ, 59వ) చెరో రెండు గోల్స్ కొట్టగా.. మన్దీప్ సింగ్ (33వ), వివేక్ సాగర్ (40వ), మన్ప్రీత్ సింగ్ (59వ), సుఖ్జీత్ సింగ్ (60వ) తలో గోల్ సాధించారు. భారత్ ఇక 9-12 వర్గీకరణ మ్యాచ్లో శనివారం దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. క్వార్టర్స్ బెర్తును నిర్ణయించే క్రాస్ఓవర్ మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమితో భారత జట్టు ప్రపంచకప్ టైటిల్ రేసు నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే.
నేడు సెమీస్ పోరు
భువనేశ్వర్: పురుషుల హాకీ ప్రపంచకప్లో కీలక సమరానికి సమయం ఆసన్నమైంది. పూల్ దశను దాటుకుని.. క్రాస్ ఓవర్స్ను తట్టుకుని.. క్వార్టర్స్ను అధిగమించి.. ఇప్పుడు నాలుగు మేటి జట్లు సెమీస్ పోరుకు సిద్ధమయ్యాయి. ప్రపంచ ర్యాంకింగ్స్లో తొలి నాలుగు స్థానాల్లో ఉన్న జట్ల మధ్య ఫైనల్ కోసం యుద్ధం జరుగుతుంది. శుక్రవారం తొలి సెమీస్లో నంబర్వన్ ఆస్ట్రేలియాతో నాలుగో ర్యాంకర్ జర్మనీ తలపడుతుంది. వరుసగా రెండు, మూడు ర్యాంకుల్లో ఉన్న బెల్జియం, నెదర్లాండ్స్ మరో సెమీస్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. జర్మనీ క్రాస్ ఓవర్లో గెలిచి క్వార్టర్స్ చేరి, ఆపై ముందంజ వేయగా.. మిగతా మూడు నేరుగా క్వార్టర్స్లో అడుగుపెట్టి, అనంతరం సెమీస్ చేరాయి. జర్మనీతో మ్యాచ్లో ఆసీస్ ఫేవరెట్గా కనిపిస్తోంది. మూడో సారి టైటిల్పై కన్నేసిన జర్మనీ 2010 తర్వాత తొలిసారి సెమీస్ చేరింది. ఇంగ్లాండ్తో క్వార్టర్స్లో ఆఖరి రెండు నిమిషాల్లో రెండు గోల్స్తో గట్టెక్కి, అనంతరం పెనాల్టీ షూటౌట్లో ఆ జట్టు గెలిచింది. మరోవైపు వరుసగా 12వ సారి సెమీస్ ఆడబోతున్న ఆస్ట్రేలియా పటిష్ఠంగా కనిపిస్తోంది. ఇక డిఫెండింగ్ ఛాంపియన్ బెల్జియం, గత రెండు సార్లు రన్నరప్ నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ ఆసక్తి రేపుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. తన సొంత మైదానంలో లఖ్నవూ జట్టు చెన్నైను ఢీకొట్టనుంది. -
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి