సాహో సానియా..
దాదాపు రెండు దశాబ్దాల గ్రాండ్స్లామ్ ప్రయాణం మదిలో మెదులుతుంటే.. ఉబికి వస్తున్న కన్నీళ్లతో.. భావోద్వేగ వాతావరణంలో.. సానియా మీర్జా వీడ్కోలు పలికింది.
గ్రాండ్స్లామ్ కెరీర్కు మీర్జా గుడ్బై
ఆఖరి టోర్నీలో రన్నరప్ ట్రోఫీ
దాదాపు రెండు దశాబ్దాల గ్రాండ్స్లామ్ ప్రయాణం మదిలో మెదులుతుంటే.. ఉబికి వస్తున్న కన్నీళ్లతో.. భావోద్వేగ వాతావరణంలో.. సానియా మీర్జా వీడ్కోలు పలికింది. జూనియర్గా.. టీనేజర్గా.. అమ్మాయిగా.. అమ్మగా.. గ్రాండ్స్లామ్ల్లో ఆడిన ఆమె.. ఇప్పుడు ఆ చిరస్మరణీయ కెరీర్కు గుడ్బై చెప్పింది. ఆరు డబుల్స్ టైటిళ్లు.. ఎన్నో జ్ఞాపకాలతో ప్రస్థానాన్ని ముగించింది. ప్రొఫెషనల్ బాటలో తొలి అడుగు వేసిన మెల్బోర్న్లోనే.. ఆఖరి గ్రాండ్స్లామ్ మ్యాచ్ ఆడేసింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ ఫైనల్లో బోపన్నతో కలిసి ఫైనల్ చేరిన ఆమె.. తుది సమరంలో గెలవలేకపోయింది. అయినా తన గ్రాండ్స్లామ్ కెరీర్కు ఇది ఘనమైన ముగింపే!
మెల్బోర్న్
ఇవి ఆనంద భాష్పాలు. నా ప్రొఫెషనల్ కెరీర్ మెల్బోర్న్లోనే ఆరంభమైంది. కొన్ని టైటిళ్లూ గెలిచా. రాడ్ లేవర్ ఎరీనా నా జీవితంలో ప్రత్యేకమైంది. గ్రాండ్స్లామ్ కెరీర్ ముగింపునకు ఇంతకంటే ఉత్తమ వేదిక ఉండదు. నా తనయుడి ఎదురుగా ఓ గ్రాండ్స్లామ్ ఫైనల్ ఆడతానని ఊహించలేదు.
- సానియా
ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ రన్నరప్ ట్రోఫీతో గ్రాండ్స్లామ్ కెరీర్ను సానియా మీర్జా ముగించింది. శుక్రవారం ఫైనల్లో సానియా- బోపన్న జోడీ 6-7 (2-7), 2-6 తేడాతో లూయిసా స్టెఫాని- రఫెల్ మాటాస్ (బ్రెజిల్) చేతిలో పరాజయం పాలైంది. యువ జంటతో పోరులో తొలి సెట్లో భారత సీనియర్ ద్వయం గట్టిగా పోరాడింది. తొలి రెండు గేమ్లు కోల్పోయిన తర్వాత సానియా- మీర్జా జోడీ పుంజుకుంది. విన్నర్లు, ఏస్లతో సత్తాచాటి వరుసగా మూడు గేమ్లు గెలిచి 3-2తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఓ తప్పిదంతో తర్వాతి గేమ్ కోల్పోయినప్పటికీ.. ఎనిమిదో గేమ్లో ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేసి 5-3తో దూసుకెళ్లింది. కానీ సెట్ పాయింట్ను కాపాడుకోలేకపోయింది. బోపన్న సర్వీస్లో వేగం తగ్గడం, కోర్టులో చురుగ్గా కదల్లేకపోవడంతో భారత జోడీ వెనకబడింది. తొమ్మిదో గేమ్లో సర్వీస్ కోల్పోయింది. 6-5తో నిలిచినప్పుడూ ప్రత్యర్థి సర్వీస్ను బ్రేక్ చేయలేకపోయింది. దీంతో 6-6తో స్కోరు సమమై టైబ్రేకర్ అనివార్యమైంది. అందులో సానియా జోడీ పూర్తిగా నిరాశపర్చింది. రెండో సెట్లో 1-4తో వెనకబడ్డ సానియా- బోపన్న జోడీ ఇక కోలుకోలేదు. మరో గేమ్ మాత్రమే గెలిచిన ఈ జంట.. చివరకు మ్యాచ్ చేజార్చుకుంది. ఈ పోరులో ప్రత్యర్థితో సమానంగా ఏస్లు (చెరో 4) కొట్టిన భారత జోడీ.. రెండు విన్నర్లు ఎక్కువే సంధించింది. బ్రెజిల్ ద్వయం 18 విన్నర్లు కొట్టగా.. భారత జంట 20 సాధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
ముంబయి ఇండియన్స్ జట్టు గురించి తాను మాట్లాడిన మాటలు వక్రీకరణకు గురికావడం వల్లే సోషల్ మీడియాలో వైరల్గా మారినట్లు అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. -
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడించారు. -
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ