Team India: మన మెరుపులు
విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టులో తెలుగు రాష్ట్రాల క్రికెటర్లు త్రిష, షబ్నమ్ ఉన్నారు. భద్రాచలం అమ్మాయి త్రిష బ్యాటింగ్లో సత్తాచాటగా.. విశాఖపట్నం పేసర్ షబ్నమ్ బౌలింగ్తో ఆకట్టుకుంది.
ఈనాడు - హైదరాబాద్
విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టులో తెలుగు రాష్ట్రాల క్రికెటర్లు త్రిష, షబ్నమ్ ఉన్నారు. భద్రాచలం అమ్మాయి త్రిష బ్యాటింగ్లో సత్తాచాటగా.. విశాఖపట్నం పేసర్ షబ్నమ్ బౌలింగ్తో ఆకట్టుకుంది. ముఖ్యంగా 17 ఏళ్ల త్రిష తన ప్రదర్శనతో మెప్పించింది. 7 మ్యాచ్ల్లో 116 పరుగులు చేసింది. అందులో స్కాట్లాండ్పై ఓ అర్ధశతకమూ చేసింది. అవకాశం వచ్చిన ప్రతిసారి సత్తాచాటింది. కీలకమైన ఫైనల్లో తీవ్ర ఒత్తిడిలోనూ గొప్పగా ఆడింది. పిచ్ను అర్థం చేసుకుని, పరిస్థితులకు తగినట్లుగా ఆడి జట్టును విజయం వైపు నడిపించింది. మొట్టమొదటి అండర్-19 ప్రపంచకప్ గెలవడం సంతోషంగా ఉందని ఆమె ‘ఈనాడు’తో చెప్పింది. ‘‘ప్రపంచకప్ గెలిచిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. గాల్లో తేలిపోతున్నట్లు ఉంది. టోర్నీలో నాకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించా. స్కాట్లాండ్తో మ్యాచ్లో ఓపెనర్గా పంపించారు. ఆ పిచ్ కాస్త భిన్నంగా స్పందించింది. స్పిన్నర్స్కు అనుకూలించింది. అందుకే జాగ్రత్తగా ఆడా. ఇప్పటికే సీనియర్ స్థాయిలో ఆడిన షెఫాలి, రిచా ఘోష్లతో కలిసి ఆడడం మంచి అనుభవం. ఫైనల్లో ఒత్తిడికి గురి కాలేదు. జట్టును విజయతీరాలకు చేర్చగలమని నమ్మకంతో ఉన్నా. సౌమ్యకు కూడా అదే చెప్పా. ఔట్ కాకుండా చివరి వరకూ ఉండాల్సింది. ఈ కప్పు గెలవడమే ఇప్పటివరకూ నా జీవితంలో అత్యుత్తమ క్షణం’’ అని త్రిష చెప్పింది. మరోవైపు షబ్నమ్ రెండు మ్యాచ్ల్లో ఆడింది. అయితే అంచనాలను అందుకోలేకపోయినప్పటికీ ఆమె పేస్తో ఆకట్టుకుంది. ‘‘ప్రపంచకప్ నెగ్గడం గొప్పగా అనిపిస్తోంది. దీని కోసమే ఎంతో కష్టపడ్డాం. ఈ టోర్నీ నుంచి ఎంతో నేర్చుకున్నా. ఎన్నో అనుభవాలు సొంతం చేసుకున్నా. బౌలింగ్లో మరింత మెరుగయేందుకు శ్రమిస్తా. కప్పు అందుకున్న క్షణాన్ని ఎప్పటికీ మర్చిపోలేను’’ అని 15 ఏళ్ల షబ్నమ్ పేర్కొంది.
కథానాయికలు వీళ్లే: అన్ని విభాగాల్లో బలంగా కనిపించిన యువ భారత్.. టైటిల్ ఫేవరెట్గానే టోర్నీలో అడుగుపెట్టింది. అంచనాలను అందుకుంటూ సాగింది. గ్రూప్లో అజేయంగా నిలిచిన జట్టు.. సూపర్-6 దశలో ఆసీస్ చేతిలో ఓటమి మినహా మెరుగ్గానే రాణించింది. సెమీస్లో న్యూజిలాండ్ను చిత్తుచేసి.. తుదిపోరులో ఇంగ్లాండ్ను మట్టికరిపించింది. ఈ విజయం అమ్మాయిల క్రికెట్లో భారత భవిష్యత్ ఆశాజనకంగా ఉందని చాటుతోంది. బ్యాటింగ్లో శ్వేత సహ్రావత్, షెఫాలి వర్మ, గొంగడి త్రిష.. బౌలింగ్లో స్పిన్నర్లు పర్శవి, మన్నత్ కశ్యప్, అర్చన దేవి, పేసర్ తితాస్ నిలకడగా రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచిన ఓపెనర్ శ్వేత (7 మ్యాచ్ల్లో 99 సగటుతో 297) సూపర్ ఫామ్ జట్టుకు మేలు చేసింది. షెఫాలి (172)తో కలిసి ఆమె జట్టుకు మంచి ఆరంభాలు అందించింది. బౌలింగ్లో లెగ్స్పిన్తో పర్శవి ప్రత్యర్థి పనిపట్టింది. 6 మ్యాచ్ల్లో 11 వికెట్లతో జట్టు కప్పు గెలవడంలో ప్రధాన భూమిక పోషించింది. ఆఫ్ స్పిన్నర్లు మన్నత్ (9), అర్చన (8) కూడా అదరగొట్టారు. పేస్ సంచలనం తితాస్ (6) భవిష్యత్ స్టార్గా ఎదిగేలా కనిపిస్తోంది. పేస్తో ఆరంభంలోనే వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచడంలో రాటుదేలింది. ఇక ఇప్పటికే సీనియర్ జట్టులో ముద్ర వేసిన షెఫాలి, రిచా ఘోష్ అనుభవం కూడా టోర్నీలో భారత్కు ఉపయోగపడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు.
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్